Political News

నేపాల్ రూ 100 నోటులో భారత ప్రదేశాలు?

భారత్, నేపాల్ మధ్య స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, సరిహద్దు గొడవలు అప్పుడప్పుడు రాజుకుంటూనే ఉంటాయి. ఇన్నాళ్లు కేవలం మాటల యుద్ధంగా, రాజకీయ మ్యాపులకే పరిమితమైన ఈ వివాదం ఇప్పుడు ప్రజల జేబుల్లోకి కూడా వచ్చేసింది. నేపాల్ తీసుకున్న తాజా నిర్ణయం రెండు దేశాల మధ్య దౌత్యపరమైన వేడిని పెంచేలా ఉంది. ఒక చిన్న కాగితం ముక్క ఇప్పుడు పెద్ద చర్చకు దారితీసింది.

సాధారణంగా ఏ దేశమైనా తమ కరెన్సీ నోట్ల మీద తమ దేశ గొప్పతనాన్ని లేదా చిహ్నాలను ముద్రిస్తుంది. కానీ నేపాల్ మాత్రం ఒక అడుగు ముందుకేసి, ఇండియాకు చెందిన ప్రాంతాలను తమవిగా చూపిస్తూ కొత్త కరెన్సీని రిలీజ్ చేసింది. ఇది పక్కాగా ఇండియాను ఇరిటేట్ చేసే చర్యే అని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆ నోటు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

అసలు విషయానికి వస్తే.. నేపాల్ ప్రభుత్వం కొత్తగా 100 రూపాయల నోట్లను విడుదల చేసింది. ఇందులో ముద్రించిన నేపాల్ మ్యాప్ లో భారత భూభాగాలైన కాలాపానీ, లిపులేఖ్, లింపియాధురా ప్రాంతాలను తమ దేశంలో భాగంగా చూపించింది. నేపాల్ రాష్ట్ర బ్యాంక్ (NRB) ఈ కొత్త నోట్లను చలామణిలోకి తెచ్చింది. ఇందులో మాజీ గవర్నర్ మహా ప్రసాద్ అధికారి సంతకం, జారీ చేసిన తేదీ కూడా ఉంది.

ఈ వివాదం ఈనాటిది కాదు. 2020 మే నెలలో కేపీ శర్మ ఓలి ప్రభుత్వం ఉన్నప్పుడే ఈ మూడు ప్రాంతాలను కలుపుకుని కొత్త రాజకీయ మ్యాప్ ను ఆమోదించింది. ఇప్పుడు దాన్ని అధికారికంగా కరెన్సీపై ముద్రించింది. విచిత్రం ఏంటంటే.. రూ. 10, 50, 500 వంటి నోట్లు ఉన్నా, కేవలం రూ. 100 నోటు మీద మాత్రమే నేపాల్ మ్యాప్ ఉంటుంది. అందుకే ఈ మార్పు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తోంది.

దీనిపై భారత్ తీవ్రంగా స్పందించింది. నేపాల్ ఏకపక్షంగా తీసుకున్న ఈ నిర్ణయం వాస్తవాలను మార్చలేదని భారత విదేశాంగ మంత్రి జైశంకర్ గతంలోనే తేల్చిచెప్పారు. నోటు మీద మ్యాప్ మార్చినంత మాత్రాన, గ్రౌండ్ లెవల్ లో ఇండియా భూభాగం నేపాల్ ది అయిపోదు కదా అని భారత్ గట్టి కౌంటర్ ఇచ్చింది. సరిహద్దు చర్చలు జరుగుతుండగా ఇలాంటి పనులు చేయడం సరికాదని భారత్ వాదన.

సిక్కిం, బెంగాల్, బీహార్, యూపీ, ఉత్తరాఖండ్ రాష్ట్రాలతో కలుపుకుని దాదాపు 1,850 కిలోమీటర్ల మేర భారత్ నేపాల్ సరిహద్దు ఉంది. ఇలాంటి సున్నితమైన సమయంలో నేపాల్ చేసిన ఈ ‘కరెన్సీ రాజకీయం’ భవిష్యత్తులో రెండు దేశాల బంధంపై ఎలాంటి ప్రభావం చూపుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే ఆ కొత్త నోటు సరిహద్దుల్లో కొత్త చిచ్చు రేపేలా ఉంది.

Kumar

Recent Posts

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

5 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

5 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

6 hours ago

నాగార్జున నోట‌… చింటు మాట‌

టాలీవుడ్ నిర్మాతల్లో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీకి సోష‌ల్ మీడియాలో ఉన్న ఫాలోయింగే వేరు. కొంత‌మంది అత‌ణ్ని అభిమానిస్తే.. కొంత‌మంది త‌న‌ను అదే…

6 hours ago

చింతమనేని Vs పవన్… ఎలా ముగిసింది?

టీడీపీ సీనియర్ నేత, ఏలూరు జిల్లా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు సంబందించి తెలుగు నేల ప్రజళకు ఎలాంటి…

6 hours ago

దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్

మామూలుగా చూస్తే దినేశ్ కార్తీక్‌కు మురళీ విజయ్ థ్యాంక్స్ చెబితే.. అందులో వార్తేముంది అనిపించొచ్చు. కానీ వీళ్లిద్దరి మధ్య ఏం…

9 hours ago