రాజకీయాల్లో ఉన్నవారు ఏం మాట్లాడినా చాలా పెద్ద రీజనే ఉంటుంది. దీనికి ఎవరూ అతీతులు కాదు. తరచుగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తమ కూటమి ప్రభుత్వం మరో 15 ఏళ్లు అధికారంలో ఉంటుందని చెబుతున్నారు. ఎక్కడ ఆయన ప్రసంగించినా ఈ మాటే చెబుతున్నారు. సూపర్ జీఎస్టీ నుంచి పల్లె పండుగ వరకు ఏ కార్యక్రమం నిర్వహించినా జనసేన తరఫున పార్టీ కార్యక్రమంలో పాల్గొన్నా కూటమి ప్రభుత్వం 15 సంవత్సరాలు ఉంటుందని అంటున్నారు.
దీనిని వైసీపీ నాయకులు ఎద్దేవా చేయడం తెలిసిందే. అయితే పవన్ అంత తెలివి లేని వాడు రాజకీయంగా పరిణితి లేని వాడు అనుకుంటే పొరపాటేనని పరిశీలకులు చెబుతున్నారు. చాలా వ్యూహాత్మకంగా పవన్ ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని చెబుతున్నారు. పవన్ చాలా దూరదృష్టితో ఆలోచన చేసి ఈ వ్యాఖ్యలు చేస్తున్నారని ఆయన వ్యాఖ్యల వెనుక చాలా వ్యూహం ఉందని అంటున్నారు. దీనికి సంబంధించి ప్రధానంగా రెండు కారణాలను వారు చెబుతున్నారు.
కూటమి పార్టీల నాయకులను కలిసికట్టుగా ఉంచాలి: ఇది వాస్తవం. కొన్నాళ్లుగా కూటమి పార్టీల్లో నాయకుల మధ్య అంతరాలు పెరుగుతున్నాయి. అయితే ఎవరినీ నియంత్రించే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో వారంతట వారు తెలుసుకునేలా పవన్ కల్యాణ్ చంద్రబాబు సైతం వచ్చే 15 ఏళ్లు కూడా తమ కూటమి ఉంటుందని చెబుతున్నారు. తద్వారా నాయకులను ఏకతాటిపై నడిపించే ప్రయత్నం చేస్తున్నారు. ఒకవేళ నాయకులు ఈ విషయాన్ని గ్రహించలేక పోతే వారే నష్టపోతారన్న సందేశం ఈ వ్యాఖ్యల్లో ఉందని పరిశీలకులు చెబుతున్నారు.
ప్రజలను మానసికంగా సిద్ధం చేయడం: రాజకీయాల్లో ఈ వ్యూహం చాలా కీలకం. క్షేత్రస్థాయిలో నాయకులు ఎవరూ పోటీలో ఉన్నా అంతిమంగా ప్రజలే ఓటు వేయాలి. ఈ నేపథ్యంలో మానసికంగా వారిని ఆకట్టుకునేందుకు పార్టీలు చేసే ప్రయత్నాల్లో ఇలాంటి ప్రకటనలు కీలకం. గత ఎన్నికలకు ముందు కూడా వైసీపీ ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలనివ్వనని పవన్ ప్రకటించారు. దీనిని వైసీపీ లైట్ తీసుకుంది. ఫలితంగా 11 స్థానాలకు పరిమితం అయింది.
ఇక ఇప్పుడు వచ్చే 15 ఏళ్లు కూడా కూటమి అధికారంలో ఉంటుందన్న వాదనను బలంగా తీసుకువెళ్లడం ద్వారా ప్రజలను మానసికంగా సిద్ధం చేయాలన్న వ్యూహం ఉందని పరిశీలకులు చెబుతున్నారు. ఒక్కసారి ప్రజలు కనుక ఫిక్స్ అయితే దీనికి తిరుగు ఉండదు. అందుకే పదేపదే కూటమి పార్టీలు 15 ఏళ్ల మంత్రం పఠిస్తున్నారని పరిశీలకులు చెబుతున్నారు.
This post was last modified on November 26, 2025 11:00 pm
ఎల్లుండి విడుదల కాబోతున్న స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే సినిమా క్రేజ్ చూసి ట్రేడ్ షాకవుతోంది. ఈ సిరీస్…
ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డిపై మరో మహిళా ట్రైనీ ఐపీఎస్ లైంగిక వేధింపుల ఆరోపణలు చేసిన వ్యవహారం ఇరు తెలుగు…
దివంగత ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభకు టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమ హాజరు కావడంపై టీడీపీ అధినేత చంద్రబాబు సీరియస్…
టాలీవుడ్ విలక్షణ నటుడు దగ్గుబాటి రానా ఇంతకుముదులా వరుసగా సినిమాలు చేయడం లేదు. హీరోగా అయితే సినిమాలు పూర్తిగా ఆపేశాడు. విలన్,…
2024 సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీల్లో ఒకటైన మెగా డీఎస్సీ నిర్ణీత కాల వ్యవధిలోనే ముగిసింది. 16,347 మంది…
ఇప్పుడు ఫ్యానిజానికి అర్థమే మారిపోయింది. తమ అభిమాన కథానాయకుడి మీద ప్రేమ చూపించడం కంటే.. ఆ హీరోకు పోటీగా ఉన్న…