Political News

RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఘటనలో తాజా గా కీలక అడుగులు పడ్డాయి. ప్రభుత్వం వివరాల దిశగా చర్యలు వేగవంతం చేసింది. దీంతో రఘురామ కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆవేదన నుంచి ఒకింత ఊరట లభించినట్టు అయింది. ఏపీలో వైసీపీ సర్కారు పాలన సమయంలో సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ కు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4న విచారణ కు రావాలని ఆదేశించింది.

ఏం జరిగింది?

వైసీపీ హయాంలో ప్రభుత్వ లోపాలను, సీఎం జగన్ వ్యవహార శైలిని అదే పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ రఘురామ తరచుగా విమర్శించేవారు. అయితే దీనిపై మార్పు అవసరం ఉన్నా వైసీపీ అధినేత రఘురామ పై అక్కసు పెంచుకున్నారు. ప్రజాస్వామ్యం అంటేనే విమర్శకు స్థానం ఉంటుంది. దాని నుంచి పాలకులు తమను తాము సరిదిద్దుకునే అవకాశం పొందాలి. కానీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం సొంత ఎంపీ పైనే దేశద్రోహం కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో రఘురామను అరెస్టు చేసే బాధ్యతను అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు అప్పగించారు. దీంతో రఘురామను ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లో బలవంతంగా అరెస్టు చేయడంతో పాటు విజయవాడ కు తరలించారు. అదే రోజు రాత్రి గుంటూరులోని ఒక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించారన్నది రఘురామ చేసిన ఆరోపణ. దీనిపై కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైదరాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలకు పంపించింది. నివేదికను కూడా సమర్పింపజేసింది.

ఇక తనను హింసించారంటూ రఘురామ చేసిన ఫిర్యాదు పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా విజయనగరం ఎస్పీ దామోదర్ వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ఏ1 గా అప్పటి సీఐడీ చీఫ్ ప్రస్తుతం బీహార్ లో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులను విచారించినా రఘురామ మాత్రం సీఐడీ చీఫ్ సునీల్ విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.

తరచూ ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఏ1 గా ఉన్న సునీల్ ను విచారించాలని డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. విచారణాధికారి తాజాగా సునీల్ కు నోటీసులు పంపించారు. డిసెంబరు 4న విజయవాడ లో జరిగే విచారణ కు హాజరు కావాలని ఆదేశించారు. ఈ పరిణామంతో ఆ రోజున ఏం జరిగిందన్న నిజాలు బయటపడతాయని మరియు దీనివెనుక ఎవరు ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తుందని రఘురామ భావిస్తున్నారు.

Satya

Recent Posts

రామాయ‌ణ పై ముందే చేతులెత్తేసిన కాజ‌ల్

స్టార్ హీరోయిన్లు ఏదైనా రామాయణ లాంటి పెద్ద సినిమాలో న‌టించిన‌పుడు వారి ఇమేజ్‌కు త‌గ్గ పాత్ర‌లు లేక‌పోతే.. అభిమానులు ఫీల‌వ‌డం…

50 minutes ago

టీడీపీ, జనసేనల మైత్రి క్షేత్రస్థాయిలో ఎలా ఉంది…?

ఏపీలో కూటమి పాలనకు అప్పుడే రెండేళ్లు పూర్తి అయిపోయింది. ఇంకో మూడేళ్లు ఉంటే మరో ఎన్నికలకు కూటమి పార్టీలు సన్నద్ధం కావాల్సిన పరిస్థితి.…

1 hour ago

మావిగనా?… మాయా జగనా..?

ఏపీ రాజకీయాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా మావిగన్ పై ఓ రేంజిలో చర్చ నడుస్తోంది. వైసీపీ అదినేత వైఎస్ జగన్…

3 hours ago

అంత అత్యాశ ఎందుకు ట్రంప్?

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరోసారి తన వ్యాఖ్యలతో చర్చనీయాంశంగా మారారు. రెండోసారి అధ్యక్ష పదవిలో ఉన్న ట్రంప్.. ఇప్పటికే…

10 hours ago

అవమానంతో ఉక్కిరిబిక్కిరవుతున్న ‘అల్ఫా’

మొన్న విడుదలైన బాలీవుడ్ మూవీ అల్ఫా మీద విమర్శల వర్షం కురుస్తూనే ఉంది. కంటెంట్ బాలేకపోవడం, డిజాస్టర్లు హిందీలో కొత్త…

11 hours ago

సంయుక్త హాట్ మోడ్ అదిరింది

సంయుక్త మీనన్ ఈ ఏడాది వరుస సినిమాలతో ఫుల్ బిజీగా గడుపుతోంది. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో సినిమాలు చేస్తూ…

11 hours ago