Political News

RRR కేసు: ఇక సునీల్‌కుమార్ వంతు

ఏపీ అసెంబ్లీ ఉప సభాపతి రఘురామకృష్ణరాజు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న ఘటనలో తాజా గా కీలక అడుగులు పడ్డాయి. ప్రభుత్వం వివరాల దిశగా చర్యలు వేగవంతం చేసింది. దీంతో రఘురామ కొన్నాళ్లుగా ఎదుర్కొన్న ఆవేదన నుంచి ఒకింత ఊరట లభించినట్టు అయింది. ఏపీలో వైసీపీ సర్కారు పాలన సమయంలో సీఐడీ డీజీగా పనిచేసిన సునీల్ కుమార్ కు తాజాగా ప్రత్యేక దర్యాప్తు బృందం నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల 4న విచారణ కు రావాలని ఆదేశించింది.

ఏం జరిగింది?

వైసీపీ హయాంలో ప్రభుత్వ లోపాలను, సీఎం జగన్ వ్యవహార శైలిని అదే పార్టీ ఎంపీగా ఉన్నప్పటికీ రఘురామ తరచుగా విమర్శించేవారు. అయితే దీనిపై మార్పు అవసరం ఉన్నా వైసీపీ అధినేత రఘురామ పై అక్కసు పెంచుకున్నారు. ప్రజాస్వామ్యం అంటేనే విమర్శకు స్థానం ఉంటుంది. దాని నుంచి పాలకులు తమను తాము సరిదిద్దుకునే అవకాశం పొందాలి. కానీ ఈ విషయంలో మొండిగా వ్యవహరించిన జగన్ ప్రభుత్వం సొంత ఎంపీ పైనే దేశద్రోహం కేసు పెట్టింది.

ఈ నేపథ్యంలో రఘురామను అరెస్టు చేసే బాధ్యతను అప్పటి సీఐడీ చీఫ్ సునీల్ కుమార్ కు అప్పగించారు. దీంతో రఘురామను ఆయన పుట్టినరోజు నాడే హైదరాబాద్ లో బలవంతంగా అరెస్టు చేయడంతో పాటు విజయవాడ కు తరలించారు. అదే రోజు రాత్రి గుంటూరులోని ఒక పోలీస్ స్టేషన్ లో నిర్బంధించి హింసించారన్నది రఘురామ చేసిన ఆరోపణ. దీనిపై కోర్టులో కూడా కేసు దాఖలు చేశారు. ఆ సమయంలోనే సుప్రీంకోర్టు జోక్యం చేసుకుని హైదరాబాదులోని ఆర్మీ ఆసుపత్రిలో పరీక్షలకు పంపించింది. నివేదికను కూడా సమర్పింపజేసింది.

ఇక తనను హింసించారంటూ రఘురామ చేసిన ఫిర్యాదు పై కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసింది. సిట్ అధికారిగా విజయనగరం ఎస్పీ దామోదర్ వ్యవహరిస్తున్నారు. ఈ కేసులో ఏ1 గా అప్పటి సీఐడీ చీఫ్ ప్రస్తుతం బీహార్ లో పనిచేస్తున్న సునీల్ కుమార్ ను పేర్కొన్నారు. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులను విచారించినా రఘురామ మాత్రం సీఐడీ చీఫ్ సునీల్ విచారణ కోసం ఎదురు చూస్తున్నారు.

తరచూ ఈ విషయంలో ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఎట్టకేలకు ప్రభుత్వం స్పందించింది. ఏ1 గా ఉన్న సునీల్ ను విచారించాలని డీజీపీ కార్యాలయం నుంచి సమాచారం అందింది. విచారణాధికారి తాజాగా సునీల్ కు నోటీసులు పంపించారు. డిసెంబరు 4న విజయవాడ లో జరిగే విచారణ కు హాజరు కావాలని ఆదేశించారు. ఈ పరిణామంతో ఆ రోజున ఏం జరిగిందన్న నిజాలు బయటపడతాయని మరియు దీనివెనుక ఎవరు ఉన్నారన్న విషయం వెలుగులోకి వస్తుందని రఘురామ భావిస్తున్నారు.

This post was last modified on November 26, 2025 10:29 pm

Share
Show comments
Published by
Satya
Tags: RRR

Recent Posts

పద్మభూషణ్ ను కూడా మోసం చేసేశారు…

డిజిటల్ అరెస్ట్ పేరిట జరుగుతున్న సైబర్ మోసాలు సామాన్యులకే కాదు, ప్రముఖులకూ పెద్ద ముప్పుగా మారాయి. ప్రభుత్వం ఎంత అవగాహన…

4 minutes ago

లెక్క తప్పిన కలర్ ఫోటో దర్శకుడు

ఓటిటిలో డైరెక్ట్ గా రిలీజైనా కలర్ ఫోటోకు మంచి స్పందన వచ్చిన సంగతి ప్రేక్షకులకు గుర్తే. కొత్త ప్రేమకథ కాకపోయినా…

24 minutes ago

అఖండ-2.. హిందీలో పరిస్థితేంటి?

అఖండ సినిమా ఓటీటీలో రిలీజైనపుడు హిందీ ప్రేక్షకులు సైతం విరగబడి చూశారు. డివైన్ ఎలిమెంట్స్‌తో తీసిన సినిమాలకు కొన్నేళ్ల నుంచి…

27 minutes ago

బాబు స్పెషల్: శాంతి వనంలోనూ పెట్టుబడుల ధ్యానం!

ఏపీ సీఎం చంద్రబాబు ఎక్కడికి వెళ్లినా, ఏం చేసినా ఏపీలో పెట్టుబడులు, పరిశ్రమల రాక, ఉద్యోగాలు, ఉపాధి కల్పన వంటి…

49 minutes ago

దురంధర్ దర్శకుడిది భలే స్టోరీ గురు

ఆదిత్య ధర్.. ఇప్పుడు బాలీవుడ్లోనే కాక, దేశవ్యాప్తంగా అన్ని ఇండస్ట్రీల్లోనూ చర్చనీయాంశం అవుతున్న పేరిది. బాలీవుడ్ బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్లలో ఒకటిగా…

2 hours ago

8 గంటల పని… దీపికకు వ్యతిరేకంగా భర్త

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొనే స్పిరిట్, కల్కి-2 చిత్రాల నుంచి తప్పుకోవడం ఆ మధ్య చర్చనీయాంశంగా మారిన సంగతి…

3 hours ago