Political News

ప‌వ‌న్‌పై అక్క‌సెందుకు: క‌ళ్ల ముందే క‌నిపిస్తున్న వైసీపీ లోపాలు!

తాటి చెట్టు కింద నిల‌బడి పాలు తాగుతున్నామ‌న్న చందంగా వైసీపీ నాయ‌కులు వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ త‌ప్పులు తెలుసుకునే ప్ర‌య‌త్నం కూడా చేయ‌లేక పోతున్నార‌న్న వాద‌న కూడా వినిపిస్తోంది. స‌హ‌జంగా ప్ర‌జాస్వామ్యంలో రాజ‌కీయ విమ‌ర్శ‌లు కామ‌నే అయినా.. హ‌ద్దులు మీరి చేస్తున్న విమ‌ర్శ‌లు.. వివాదాల‌కు దారితీస్తున్నాయి. ఇవి ప్ర‌త్య‌ర్థుల‌కు ఆటోమేటిక్‌గానే వ‌రాలుగా మారుతున్నాయి. కానీ.. త‌మ త‌ప్పులు తెలుసుకోవ‌డంలో విఫ‌ల‌మ‌వుతున్న వైసీపీ నాయ‌కులు ఎదుటి వారిపై అక్క‌సు పెంచుకోవ‌డం మ‌రింత చిత్రంగాఉంద‌ని రాజ‌కీయ విశ్లేష‌కులు చెబుతున్నారు.

జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్‌.. త‌ర‌చుగా వైసీపీ నాయ‌కుల వ్య‌వ‌హార శైలిపై వ్యాఖ్య‌లు చేస్తున్నారు. వారిలా మ‌నం ఉండొద్దు.. అని కూడా త‌న పార్టీ వారికి, ప‌రోక్షంగా కూట‌మి నాయ‌కుల‌కు కూడా చెబుతున్నారు. తాజాగా కోన‌సీమ ప‌ర్య‌ట‌న‌లోనూ.. ప‌వ‌న్ క‌ల్యాణ్ ఇవే వ్యాఖ్య‌లు చేశారు. `బూతులు మ‌న సంస్కృతి కాదు. దూకుడు కూడా మ‌న ప‌ద్ధ‌తి కాదు. అది వేరే పార్టీ సొంతం. వాటిని మీరు అనుక‌రించొద్దు“ అని జ‌న‌సేన కార్య‌క‌ర్త‌లు, నాయ‌కుల‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

దీనిపై వైసీపీ నాయ‌కులు రుస‌రుసలాడుతున్నారు. కానీ, వాస్త‌వాలు మాత్రం క‌ళ్ల ముందే క‌నిపిస్తున్నాయి. పార్టీ 11 స్థానాలకే గ‌త ఎన్నిక‌ల్లో ప‌రిమిత‌మైన‌ప్ప‌టికీ.. నాయ‌కుల‌కు జ్ఞానోద‌యం క‌ల‌గ‌డం లేద‌ని.. ఇటీవల ఆ పార్టీకే చెందిన కురువృద్ధ‌నేత , మాజీ ఎంపీ ఒక‌రు వ్యాఖ్యానించారు. ముఖ్యంగా జ‌గ‌న్‌ను కీర్తించేందుకు నాయ‌కులు, వారి కీర్త‌న‌ల కోసం జ‌గ‌న్ వెంపర్లాడుతున్న ప‌రిస్థితి క‌నిపిస్తోంది. ఈ క్ర‌మంలో హ‌ద్దులు మీరిన విమ‌ర్శ‌లు.. ప్ర‌భుత్వాన్ని ప్ర‌తి విష‌యంలోనూ టార్గెట్ చేస్తున్న స్ఫ‌ష్ట‌మ‌వుతోంది. దీని వ‌ల్ల ప్ర‌యోజ‌నం ఉంటుందా?  అనేది ఆ పార్టీ నేత‌లు ఆలోచ‌న చేయ‌డం లేదు.

మ‌రోవైపు.. అధికారంలో లేక‌పోయినా.. త‌ప్పులు జ‌రుగుతూనే ఉన్నాయన్న వాద‌న వినిపిస్తోంది. అధికారంలో ఉన్న‌ప్పుడు త‌ప్పులు చేయ‌డం వేరు. అధికారం పోయిన త‌ర్వాత కూడా.. న‌కిలీ మ‌ద్యం కేసులో మాజీ మంత్రి జోగి ర‌మేష్ ప్ర‌మేయం ఉండ‌డం.. తిరుమ‌ల తిరుప‌తి ల‌డ్డూ వివాదాన్ని స‌ర్ది చెప్పుకొనే ప‌రిస్థితిని ఎదుర్కొన‌డం వంటివి పార్టీకి మ‌చ్చ‌లుగా మారుతున్నాయి. ఇక‌, ర‌ప్పా – ర‌ప్పా.. న‌రుకుతాం.. అనే డైలాగులు అన్ని చోట్లా క‌నిపిస్తున్నాయి. ఇవ‌న్నీ.. పార్టీ ప‌రంగా జ‌రుగుతున్న త‌ప్పులు. వీటినే ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్ర‌స్తావిస్తున్నారు. సో.. వ్య‌వ‌స్థాగ‌తంగా జ‌రుగుతున్న త‌ప్పుల‌ను వైసీపీ గ్ర‌హించ‌క‌పోగా.. ప‌వ‌న్‌పై అక్క‌సు పెంచుకుంటే జ‌రిగేది.. ఒరిగేదీ ఏమీ లేద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.

This post was last modified on November 26, 2025 9:54 pm

Share
Show comments
Published by
Kumar
Tags: PawanYCP

Recent Posts

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

2 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

2 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

2 hours ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

4 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

5 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

5 hours ago