ఈ తరం రాజకీయ నాయకులలో జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ తీరు వేరు. ప్రజలకు జవాబుదారీగా ఉండాలని పవన్ ఎప్పటికప్పుడు తాపత్రేయ పడుతుంటారు. అనుక్షణం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతుంటారు. ముక్కుసూటిగా మాట్లాడే పవన్..తప్పు చేస్తే తననైనా నిలదీయాలని చాలా సందర్భాల్లో పిలుపునిచ్చారు. ఈ క్రమంలోనే తాజాగా మరోసారి అదే తరహా వ్యాఖ్యలతో పవన్ తన రాజకీయాలు వేరని నిరూపించారు. తనతో సహా ప్రతి రాజకీయ నాయకుడికీ యువత శల్య పరీక్ష పెట్టాలని పవన్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.
యువత బాధ్యతగా ఉంటేనే నాయకులకు భయం రాదని, ఇది తనకూ, ముఖ్యమంత్రి గారికి వర్తిస్తుందని పవన్ వ్యాఖ్యానించారు. శాసన సభలో తాను, ముఖ్యమంత్రి చంద్రబాబు ఇదే విషయం చెప్పామని గుర్తు చేశారు. తాము తప్పు చేసినా బాధ్యత వహిస్తామని చంద్రబాబు, తాను గతంలో కూడా చెప్పామని, తప్పు చేసిన వారెవరైనా ఉపేక్షించబోమని పవన్ మరోసారి స్పష్టం చేశారు. తాము జవాబుదారీగా ఉండాలనుకుంటున్నామని, శాసన సభలో మాట్లాడింది శాసనమవుతుందని తెలిపారు.
కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, కూటమి నాయకుల పనితీరుపై అయినా ప్రశ్నించాల్సిన బాధ్యత, అవసరం ప్రజలు..ముఖ్యంగా యువతపై ఉందని పవన్ చెప్పారు. ఈ తరం రాజకీయ నాయకులలో పవన్ మాదిరిగా జవాబుదారీతనంతో ఉంటే నేతలను వేళ్ల మీద లెక్కబెట్టవచ్చు. తప్పు చేస్తే ఎలా తప్పించుకోవాలి అని వంద మార్గాలు వెతికే ఈ కాలంలో తాను తప్పు చేసినా నిలదీయాలని స్వయంగా చెప్పే పవన్ వంటి నేతలు అరుదనే చెప్పాలి. అందుకే పవన్ కు తటస్థులు కూడా మద్దతు పలుకుతున్నారు.
స్టార్ హీరోలు లేని బాక్సాఫీస్ క్లాష్ మాములుగా అయితే అంత ఆసక్తికరంగా ఉండదు. కానీ జూలై మొదటి మూడో తేదీ…
దురంధర్ ది రివెంజ్ తర్వాత మళ్ళీ ఆ స్థాయి బ్లాక్ బస్టర్ కోసం ఎదురు చూస్తున్న బాలీవుడ్ బాక్సాఫీస్ కు…
అరవింద సమేత వీరరాఘవ తర్వాత జూనియర్ ఎన్టీఆర్, త్రివిక్రమ్ శ్రీనివాస్ కలయిక కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు.…
మాస్ మహారాజా రవితేజ హీరోగా రూపొందుతున్న ఇరుముడి ఆగస్ట్ 21 విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఒక టీజర్ రూపంలో…
ఎప్పుడో గజిని తర్వాత అంత పెద్ద బ్లాక్ బస్టర్ మళ్ళీ చూడలేకపోయాననే సూర్య కొరతని కరుప్పు మూడు వందల కోట్లు…
అమరావతి రాజధానిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కొత్త వ్యూహాన్ని అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. రాజధానికి కేంద్రం నుంచి భారీగా…