తెలంగాణ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న బీజేపీ నాయకులకు ఇప్పుడు కొత్త అంశం చేతికి అందింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కమల నాథులకు పెద్దగా విషయాలు దొరకలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, తమ వారిని ఎంగేజ్ చేయడానికి అంశాలు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసివస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఏం జరిగింది
కార్తీక మాసం వచ్చేసరికి అయ్యప్ప భక్తులు, శివ భక్తులు మాల ధారణ చేస్తారు. దీక్షలు స్వీకరిస్తారు. భక్తులతో పాటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పోలీసులు కూడా ఎన్నేళ్లుగా మాల ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బూట్లు వేసుకోకపోయినా యూనిఫాం ధరిస్తారు. దీక్షకు సంబంధించిన కండువాలు మెడలో వేసుకుంటారు.
ఇలాంటి సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మాల ధారణ చేసే పోలీసులు విధులకు దూరంగా ఉండాలని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేశారు. మాల పేరుతో జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, బూట్లు లేకుండా డ్యూటీ చేయడం అనుమతించబోదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే మాలలు ధరించిన అధికారులు ఇరుకాటంలో పడ్డారు. త్వరలో మాల ధారణ చేయాలనుకున్నవారు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక జిల్లా ఎస్పీ ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేయడంతో ఆయన్ని సెలవుపై పంపించారు. మరోవైపు ఈ ఆదేశాలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. హిందువుల దేవుళ్లను అవమానించేలా ఈ ఆదేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై బుధవారం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. చర్చించి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 26, 2025 6:23 pm
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…
తెలుగు సినీ పరిశ్రమలో సుదీర్ఘ కాలంగా నిర్మాతగా ఉన్నారు చదలవాడ శ్రీనివాసరావు. 90వ దశకంలోనే దివంగత నటుడు శోభన్ బాబు…
ఒక స్టార్ హీరో సినిమా ప్రారంభోత్సవం జరుగుతుంటేనో లేదా ప్రి రిలీజ్ ఈవెంట్ ఏర్పాాటు చేస్తేనో.. ఇంకో స్టార్ హీరో…
తమిళనాడు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమిళ భాషలో మాట్లాడి అక్కడి ప్రజలను ఆకట్టుకున్నారు. కోయంబత్తూరులో…
పెద్ద బ్యాగ్రౌండ్ లేకపోయినా.. చాలా కష్టపడి స్టార్గా ఎదిగిన నటుడు ధనుష్. అతణ్ని చూడగానే సాధారణ మధ్యతరగతి మనిషిలానే అనిపిస్తుంది…