తెలంగాణ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న బీజేపీ నాయకులకు ఇప్పుడు కొత్త అంశం చేతికి అందింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కమల నాథులకు పెద్దగా విషయాలు దొరకలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, తమ వారిని ఎంగేజ్ చేయడానికి అంశాలు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసివస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఏం జరిగింది
కార్తీక మాసం వచ్చేసరికి అయ్యప్ప భక్తులు, శివ భక్తులు మాల ధారణ చేస్తారు. దీక్షలు స్వీకరిస్తారు. భక్తులతో పాటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పోలీసులు కూడా ఎన్నేళ్లుగా మాల ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బూట్లు వేసుకోకపోయినా యూనిఫాం ధరిస్తారు. దీక్షకు సంబంధించిన కండువాలు మెడలో వేసుకుంటారు.
ఇలాంటి సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మాల ధారణ చేసే పోలీసులు విధులకు దూరంగా ఉండాలని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేశారు. మాల పేరుతో జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, బూట్లు లేకుండా డ్యూటీ చేయడం అనుమతించబోదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే మాలలు ధరించిన అధికారులు ఇరుకాటంలో పడ్డారు. త్వరలో మాల ధారణ చేయాలనుకున్నవారు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు.
ఒక జిల్లా ఎస్పీ ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేయడంతో ఆయన్ని సెలవుపై పంపించారు. మరోవైపు ఈ ఆదేశాలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. హిందువుల దేవుళ్లను అవమానించేలా ఈ ఆదేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై బుధవారం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. చర్చించి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.
This post was last modified on November 26, 2025 6:23 pm
హీరోల పారితోషకాలు అంతకంతకూ పెరిగిపోతుండడంపై నిర్మాతల్లో ఆందోళన వ్యక్తమవుతున్న మాట వాస్తవం. పైకి చెప్పకపోయినా ఈ విషయంలో అసంతృప్తితో ఉన్నారన్నది ఇండస్ట్రీలో…
అధికారంలో ఉన్న నాయకులు, అధికారంలో లేని నాయకులు ఇలా రెండు వర్గాలుగా విభజించినప్పుడు సాధారణంగా పదవులు పొందిన వారు సంతృప్తి…
మూడు రోజుల తెలుగు వారి పెద్ద పండుగ.. సంక్రాంతి. ఇళ్లకే కాదు.. గ్రామాలకు సైతం శోభను తీసుకువచ్చే సంక్రాంతికి.. కోడి…
ఈ సంక్రాంతికి ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ చిత్రంతో ప్రేక్షకులను పలకరించబోతోంది డింపుల్ హయతి. కెరీర్లో ఆమెకు ఇంకా పెద్ద బ్రేక్ రాలేదు. ఇప్పటికే ఖిలాడి,…
బీజేపీ కురువృద్ధ నాయకుడు, దేశ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు.. ప్రస్తుతం ప్రత్యక్ష రాజకీయాల నుంచి తప్పుకొన్నారు. అయితే.. ఆయన…
చుక్క పడందే నిద్ర పట్టని వారు చాలా మంది ఉన్నారు. వీరిలో చిన్న చితకా మందుబాబులను పక్కన పెడితే, మద్యం…