Political News

మాల ధారణ – బీజేపీకి చాన్స్ ఇచ్చిన తెలంగాణ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వంపై కారాలు మిరియాలు నూరుతున్న బీజేపీ నాయకులకు ఇప్పుడు కొత్త అంశం చేతికి అందింది. ఇటీవల జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఓటమి తర్వాత కమల నాథులకు పెద్దగా విషయాలు దొరకలేదు. ప్రభుత్వంపై విమర్శలు చేయడానికి, తమ వారిని ఎంగేజ్ చేయడానికి అంశాలు లేకుండా పోయింది. ఇలాంటి సమయంలో తెలంగాణ పోలీసులు తీసుకున్న నిర్ణయం బీజేపీకి కలిసివస్తోందని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.

ఏం జరిగింది

కార్తీక మాసం వచ్చేసరికి అయ్యప్ప భక్తులు, శివ భక్తులు మాల ధారణ చేస్తారు. దీక్షలు స్వీకరిస్తారు. భక్తులతో పాటు ఉద్యోగాలు చేసుకునే వారు కూడా ఈ సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. పోలీసులు కూడా ఎన్నేళ్లుగా మాల ధరిస్తూ విధులు నిర్వహిస్తున్నారు. కొంతమంది బూట్లు వేసుకోకపోయినా యూనిఫాం ధరిస్తారు. దీక్షకు సంబంధించిన కండువాలు మెడలో వేసుకుంటారు.

ఇలాంటి సమయంలో డీజీపీ శివధర్ రెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేశారు. మాల ధారణ చేసే పోలీసులు విధులకు దూరంగా ఉండాలని, సెలవుపై వెళ్లాలని ఆదేశించారు. అదేవిధంగా కొన్ని సూచనలు కూడా చేశారు. మాల పేరుతో జుట్టు పెంచుకుని, గడ్డాలు పెంచుకుని, బూట్లు లేకుండా డ్యూటీ చేయడం అనుమతించబోదని స్పష్టం చేశారు. దీంతో ఇప్పటికే మాలలు ధరించిన అధికారులు ఇరుకాటంలో పడ్డారు. త్వరలో మాల ధారణ చేయాలనుకున్నవారు వెనక్కి తగ్గే ప్రయత్నం చేస్తున్నారు.

ఒక జిల్లా ఎస్పీ ఇటీవల అయ్యప్ప మాల ధారణ చేయడంతో ఆయన్ని సెలవుపై పంపించారు. మరోవైపు ఈ ఆదేశాలను బీజేపీ నేతలు ఖండిస్తున్నారు. హిందువుల దేవుళ్లను అవమానించేలా ఈ ఆదేశాలు ఉన్నాయని ఆరోపిస్తున్నారు. దీనిపై బుధవారం పార్టీ అత్యవసర సమావేశం నిర్వహిస్తున్నారు. చర్చించి కార్యాచరణ చేపట్టాలని నిర్ణయించారు. ఇక ఏం జరుగుతుందో చూడాలి.

Satya

Recent Posts

వింటేజ్ హీరో నెక్స్ట్ ఏం చేయబోతున్నారో

కంబ్యాక్ అవ్వాలనే సంకల్పంతో నిర్మాతగా మారి మరీ హీరోగా నటించిన వడ్డే నవీన్ కు ఆశించిన స్వాగతం దక్కలేదు. ట్రాన్స్…

21 minutes ago

జూన్ చివరి వారం… రీ రిలీజుల అర్పణం

అదేంటో సమంతకు భలే కలిసి వస్తోంది. మా ఇంటి బంగారంకు తొలి రోజు బాగానే ఉందనే టాక్ వచ్చింది కానీ…

3 hours ago

తెలుగమ్మాయి… హాలీవుడ్‌లో ఇంకాస్త హై లెవెల్

'బ్రహ్మోత్సవం' సినిమాలో చిన్న పాత్రతో కెరీర్ స్టార్ట్ చేసిన అవంతికా వందనపు, ఇప్పుడు అమెరికన్ మెయిన్ స్ట్రీమ్ మీడియాలో తనకంటూ…

7 hours ago

చరణ్ పాప్ కార్న్ పాయింట్ – ఒప్పుకోవాల్సిన లాజిక్కేనా

ఇండస్ట్రీలో ఎప్పటి నుంచో డిబేట్ ఒకటుంది. జనం మునుపటిలా థియేటర్లకు ఎక్కువ సంఖ్యలో ఎందుకు రావడం లేదనేది అందులో మెయిన్…

10 hours ago

షిరిడీ సాయి ఆలయాలకు ‘శ్రీవాణి’ నగదు అవసరం లేదా?

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తుల నుంచి భారీ సంఖ్యలో విరాళాలు అందుతున్నాయి. ఈ నిధులతో…

10 hours ago

మార్కెట్ వెలుగుతోంది చూడు లెనిన్

ఇంకో పద్దెనిమిది రోజుల్లో లెనిన్ విడుదల. అక్కినేని అభిమానులు బాగా ఎగ్ జైట్మెంట్ తో ఉన్నారు. ఇప్పటికే పలు వాయిదాలు…

12 hours ago