Political News

దూరం ఎంతైనా ట్రైన్ టికెట్ 50 రూపాయలే

లాక్ డౌన్ కారణంగా నెలన్నర రోజులుగా వివిధ రాష్ట్రాల్లో నానా అవస్థలు పడుతున్నారు వలస కార్మికులు. ఉండటానికి గూడు లేక.. తినడానికి తిండి లేక వాళ్లు పడుతున్న బాధలు అన్నీ ఇన్నీ కావు. పెట్టే బేడా సర్దుకుని.. సామానంతా నెత్తిన పెట్టుకుని.. చిన్న పిల్లల్ని ఎండలో రోడ్డు మీద నడిపించుకుంటూ తీసుకెళ్తున్న దృశ్యాలు చూస్తే కడుపు తరుక్కుపోతోంది.

ఒక చిన్న పాప ఇలా మూడు రోజులు ఎండలో నడిచి స్వస్థలానికి చేరుకుని అక్కడ ప్రాణాలు విడిచింది. ఇంకా వెలుగులోకి రాని దారుణాలు మరెన్నో. వీళ్ల కోసం ఎలాంటి ఏర్పాట్లు చేయకుండా కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ ప్రకటించడం.. ఆ తర్వాత కూడా ఎలాంటి చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు దారి తీసింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వివిధ ప్రాంతాల్లో వలస కార్మికులు ఆందోళనలు కూడా నిర్వహించారు. ఐతే ఎట్టకేలకు వలస కార్మికుల మీద మోడీ సర్కారు దృష్టిపెట్టింది.

వలస కార్మికులు స్వస్థలాలకు వెళ్లేందుకు అనుమతినిస్తూ రెండు రోజుల కిందటే ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం.. వారి కోసం ప్రత్యేక బస్సులు, రైళ్లు నడపాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. దేశవ్యాప్తంగా 300 ప్రత్యేక రైళ్లు ఇందుకోసం నడవనున్నాయి. వలస కార్మికులు ప్రభుత్వ అధికారుల్ని సంప్రదిస్తే వారున్న చోటికే బస్సులు పంపి.. రైళ్ల దగ్గరికి తీసుకెళ్లనున్నారు.

కార్మికులు ఎక్కడికి వెళ్లాల్సి ఉన్నా.. అది ఎంత దూరమైనా సరే.. రూ.50 రూపాయలు టికెట్ ధర ఉండేలా నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర హోం శాఖ సహాయమంత్రి కిషన్ రెడ్డి మీడియాకు వెల్లడించారు. వివిధ రాష్ట్రాల్లోని వలస కార్మికుల్ని స్వస్థలాలకు తీసుకెళ్లే బాధ్యత పూర్తిగా ప్రభుత్వం తీసుకుందని.. ఎవరూ బాధ పడాల్సిన పని లేదని ఆయనన్నారు.

ఎవరెవరిని తరలించాలనే విషయాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసిన నోడల్ అధికారులే చూసుకుంటారని.. రాష్ట్రాలు ఇంకా ఎన్ని రైళ్లు కోరితే అన్ని ఏర్పాటు చేస్తామని.. భౌతిక దూరం, సురక్షిత చర్యలన్నీ చేపట్టి కార్మికుల్ని స్వస్థలాలకు తరలిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.

This post was last modified on May 2, 2020 4:12 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జగన్ పర్యటనలకు కార్యకర్తలు బలి

వైసీపీ అధినేత జ‌గ‌న్ ప‌రామ‌ర్శ‌ల యాత్ర‌లు.. కార్య‌క‌ర్త‌ల ప్రాణాల మీద‌కి తెస్తున్నాయి. గ‌తంలో గుంటూరులో నిర్వ‌హించిన ప‌రామ‌ర్శ యాత్ర‌లో ఒక…

24 minutes ago

అమ‌రావ‌తిలో అద్భుతం… `క్వాంట‌మ్` కేంద్రానికి ముహూర్తం!

ఏపీ రాజ‌ధాని అమ‌రావ‌తిలో అద్భుత ఘ‌ట్టానికి ముహూర్తం ఖ‌రారైంది. శ‌నివారం ఇక్క‌డ క్వాంట‌మ్ కంప్యూటింగ్ కేంద్రం ఏర్పాటుకు శ్రీకారం చుట్ట‌నున్నారు.…

38 minutes ago

ల‌డ్డూ వివాదం: ఆర్ ఎస్ ఎస్ స‌హా ధార్మిక సంస్థ‌లు ఏమ‌య్యాయి!?

రాముడిని ఎవ‌రైనా కామెంట్ చేసినా.. కృష్ణుడిపై ఎవ‌రైనా వ్యంగ్య చిత్రాలు రూపొందించినా..విరుచుకుప‌డే ధార్మిక సంస్థ‌లు.. ఇప్పుడు ఏమ‌య్యాయి? ఎక్క‌డున్నాయి. ఏపీ…

4 hours ago

ఇక ‘నెంబర్ వన్’ హీరోయిన్ లేనట్టేనా?

ఒక సినిమాకు హీరో ఎంత అవసరమో హీరోయిన్ కూడా అంతే అవసరం ఉంటుంది. కొన్ని సినిమాల్లో కథానాయిక ప్రాధాన్యత ఎక్కువ…

6 hours ago

విమానాల్లో లోపాలు.. ఎయిర్ ఇండియా, ఇండిగో టాప్!

మన దేశంలోని విమానయాన సంస్థలకు చెందిన విమానాల్లో భద్రతపై ఆందోళన కలిగించే విషయాలు వెలుగులోకి వచ్చాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల…

7 hours ago

‘కేసీఆర్ కుటుంబాన్ని కిషన్ రెడ్డి కాపాడుతున్నారు’

బీజేపీ సీనియ‌ర్ నేత‌, కేంద్ర మంత్రి, సికింద్రాబాద్ ఎంపీ గంగాపురం కిష‌న్ రెడ్డిపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తీవ్ర…

7 hours ago