Political News

ఇక‌ రైతు బాబు.. ఈ చంద్ర‌బాబు… !

రైతుల ప‌క్ష‌పాతిగా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికి ఉన్న పేరు అంద‌రికీ తెలిసిందే. ఆయ‌న హ‌యాం చిన్న‌దే అయినా.. ఎక్కువ‌గా రైతుల‌కు మేలు చేశార‌న్న వాద‌న ఉంది. ఇది.. త‌దుప‌రి ఎన్నిక‌ల్లో విజ‌యం ద‌క్కించుకునేందుకు అవ‌కాశంగా మారింది. 2004-09 మ‌ధ్య తీసుకున్న ప‌లు నిర్ణ‌యాలు.. 2009లో కూడా క‌లిసి వ‌చ్చాయి. ఇక‌, ఆ త‌ర్వాత‌.. అదే త‌ర‌హాలో అన్న‌దాత‌ల‌ను ప్ర‌స‌న్నం చేసుకున్న నాయ‌కులు పెద్ద‌గా క‌నిపించ‌లేదు.

ఈ విష‌యంలో జ‌గ‌న్ కొంత మేర‌కు ప్ర‌య‌త్నం చేసినా.. బ‌ట‌న్ నొక్కుడుకు మాత్ర‌మే ప‌రిమిత‌మ‌య్యారన్న వాద‌న ఉంది. నిజానికి రైతు భ‌రోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు ఏ స‌మ‌స్య వ‌చ్చినా.. అక్క‌డ చెప్పుకొనే అవ‌కాశం క‌ల్పించారు. కానీ, చివ‌రిలో రైతుల భూముల‌కు సంబంధించి చేసిన స‌ర్వేలు.. వారికి ఇచ్చిన ప‌ట్టాల‌పై త‌న ఫొటోలు వేసుకోవ‌డం.. స‌రిహ‌ద్దు రాళ్ల‌పైనా త‌న చిత్త‌రువును చిత్రించ‌డంవంటివి జ‌గ‌న్‌కు- రైతుల‌కు మ‌ధ్య గ్యాప్‌ను భారీగా పెంచాయి.

ఈ ప‌రిణామాలు.. గ‌త ఎన్నిక‌ల్లో జ‌గ‌న్‌కు మైన‌స్ మార్కులు వేయించాయి. ఈ ప‌రిస్థితి ఇలా ఉంటే.. తాజాగా సీఎం చంద్ర‌బాబు రైతుల‌ను మ‌చ్చిక చేసుకునేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. సోమ‌వారం నుంచి రైతన్నా మీ కోసం కార్య‌క్ర‌మం ద్వారా గ‌తానికి భిన్నంగా రైతుల‌కు చేరువ అయ్యేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారు. దీనిలో భాగంగా రైతుల స‌మ‌స్య‌ల‌ను విన‌డంతోపాటు.. వారిని అధునాతన సాగువైపు మ‌ళ్లించేందుకు ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ముఖ్యంగా అగ్రిటెక్‌వైపు న‌డిపించాల‌ని యోచిస్తున్నారు.

వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చడమే ప్రధాన లక్ష్యంగా సోమ‌వారం నుంచి వారం రోజుల పాటు ‘రైతన్నా.. మీకోసం’ అనే కార్యక్రమానికి  సీఎం చంద్ర‌బాబు శ్రీకారం చుడుతున్నారు. ఈ కార్యక్రమంలో చంద్రబాబుతో పాటు మంత్రులు, ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు నేరుగా అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లనున్నారు. ఈ సంద‌ర్భంగా ప్రభుత్వం గతంలో రైతుల కోసం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్తులో ఏం చేయబోతోంది అనే అంశాలను రైతులకు వివరించనున్నారు.

అదేవిధంగా అధునాత‌న సాగు విధానాలు, సాంకేతికత వినియోగం, పురుగుమందుల వాడకంతో కలిగే నష్టాలు వంటి కీల‌క అంశాల‌ను వివరిస్తారు. అలాగే, నీటి భద్రత, ఆధునిక నీటిపారుదల పద్ధతులపై అవగాహన కల్పిస్తారు. దీంతో పాటు, మార్కెట్‌లో డిమాండ్‌కు అనుగుణంగా ఉండే పంటలను సాగు చేయడం ద్వారా అధిక ఆదాయం పొందడంపై మార్గనిర్దేశం చేస్తారు. ఈ విధానాలు రైతులకు మెరుగైన దిగుబడులతోపాటు ఆదాయం పొందేందుకు దోహ‌ద‌ప‌డ‌నున్నాయ‌ని చంద్ర‌బాబు భావిస్తున్నారు. త‌ద్వారా రైతుల ప‌క్ష‌పాతిగా త‌న‌ను తాను మార్చుకునే ప్ర‌య‌త్నం చేస్తున్నారు.

Kumar

Recent Posts

బాక్సాఫీస్‌కు మంచి రోజులొచ్చాయి

2026లో టాలీవుడ్ బాక్సాఫీస్ మోతెక్కిపోతుందనే సంకేతాలు కనిపించాయి ఆరంభంలో. ‘మన శంకర వరప్రసాద్ గారు’తో పాటు ‘అనగనగా ఒక రాజు’,…

20 minutes ago

థియేట‌ర్లు, షోలు పెంచుకుంటున్న బంగారం

ఈ రోజుల్లో చిన్న‌, మిడ్ రేంజ్ సినిమాల‌కు రిలీజ్రోజు ఇచ్చిన థియేట‌ర్ల‌ను జ‌నంతో నింప‌డ‌మే క‌ష్టమైపోతోంది. జ‌నం థియేట‌ర్ల‌కు రావ‌డం…

52 minutes ago

కూట‌మికి రెండేళ్లు ఓకే… చేయవలసినవి ఇంకా ఉన్నాయి

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం రెండేళ్ల పాల‌న‌ను పూర్తి చేసుకుంది. మూడో ఏడాదిలోకి అడుగులు వేసింది. ప్ర‌భుత్వం ఏం చేయాల‌న్నా.. మ‌రో…

3 hours ago

ప్రభాస్ ఫోన్ లో ఆ వాల్ పేపర్ ఎందుకుంది?

ఇటీవల నాగ్ అశ్విన్ తో ప్రభాస్ చేసిన ప్రమోషనల్ ఇంటర్వ్యూ నెట్టింట ఎంతగా వైరల్ అయిందో అందరికీ తెలుసు. అందులో…

8 hours ago

“మ‌రో వందేళ్ల‌యినా… కాంగ్రెస్ ఇంతే”

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ప‌శ్చిమ‌బెంగాల్‌లో శ‌నివారం సాయంత్రం ప‌ర్య‌టించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న దేశ‌వ్యాప్తంగా అన్న‌దాత‌ల‌కు పీఎం-కిసాన్ నిధుల‌ను…

9 hours ago

‘గొడ్డ‌లి పార్టీ అంత‌కు మించి ఏం చేసింది?’

ఏపీ సీఎం చంద్ర‌బాబు.. మ‌రోసారి వైసీపీపై నిప్పులు చెరిగారు. గ‌త ఐదేళ్ల కాలంలో గొడ్డ‌లి పార్టీ(వైసీపీ) రాష్ట్రాన్ని ధ్వంసం చేయ‌డం..…

11 hours ago