Political News

సొంతిల్లు డోంట్ మిస్.. నెలాఖరు వరకే గడువు..!

ఏపీలో కూటమి ప్రభుత్వం అర్హులైన నిరుపేదలందరికీ ఇళ్లు, ఇళ్ల స్థలాలు ఇవ్వాలనే లక్ష్యంతో ఉంది. ఒక ప్రణాళిక ప్రకారం గృహ నిర్మాణాలను చేపడుతోంది. పిఎంఏవై 1.00 పథకం అమలు గడువును కేంద్రం మరో ఏడాది పాటు పొడిగించిన నేపథ్యంలో, ఈ పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను ఈ ఏడాది డిసెంబర్ కల్లా పూర్తి చేయాలని నిర్ణయించింది. ఆ వివరాలను రాష్ట్ర గృహ నిర్మాణ సమాచార మరియు పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారధి ఈ రోజు సచివాలయంలో వెల్లడించారు.

పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యం పెట్టుకోగా, ఇప్పటికే 3.47 లక్షల మంది ఆవాస్ యోజన యాప్ లో దరఖాస్తు చేయడం జరిగిందని తెలిపారు. ఇంకా ఎవరైనా అర్హులు ఉంటే ఈ నెలాఖరు లోపు ఈ యాప్ ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవాలని మంత్రి విజ్ఞప్తి చేశారు.

ఐదేళ్ల కాలంలో దాదాపు 15.59 లక్షల గృహాలను నిర్మించాలనే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ఉంది. వీటిలో పిఎంఏవై 1.0 క్రింద 8.87 లక్షల గృహాలు, పిఎంఏవై 2.0 అర్బన్ క్రింద 91 వేల గృహాలు, పిఎంఏవై గ్రామీణ్ క్రింద 5.81 లక్షల గృహాలు నిర్మించేందుకు చర్యలు చేపట్టింది. వీటికి అదనంగా, పిఎంఏవై 1.00 పథకం క్రింద ఇప్పటి వరకూ ప్రారంభం కాని 3.03 లక్షల గృహాలను ఈ ఏడాది చివరి కల్లా పూర్తి చేయాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఇళ్ల స్థలాలు కావాల్సిన వారిని గుర్తించేందుకు నిర్వహిస్తున్న సర్వేలో ఇప్పటి వరకు 81 వేల మందికి ఇళ్ల స్థలాలు అవసరమని గుర్తించారు. అదే విధంగా, దాదాపు 1.15 లక్షల మంది ప్రభుత్వం మరియు పోరంబోకు స్థలాల్లో నివసిస్తున్న వారికి పొజిషన్ సర్టిఫికేట్లను అందజేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

ఉమ్మడి కుటుంబాలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో కామన్ వాల్ తో ట్విన్ హౌసెస్ నిర్మించుకునే అవకాశాన్ని కల్పిస్తూ త్వరలో జి.ఓ.ను జారీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.

This post was last modified on November 25, 2025 6:25 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

తిరుమల జీవోలపై చంద్రబాబు క్లారిటీ

తిరుపతి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారని ఏపీ సీఎం చంద్రబాబు కొద్ది నెలల క్రితం చేసిన ప్రకటన సంచలనం రేపిన…

19 minutes ago

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

2 hours ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

2 hours ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

2 hours ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

5 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

7 hours ago