తెలంగాణలో భూముల ధరలకు రెక్కలు మొలుస్తున్నాయి. ఒక ప్రాంతాన్ని మించి మరో ప్రాంతం దూసుకుపోవడానికి పోటీ పడుతోంది. తాజాగా కోకాపేట భూములకు ప్రభుత్వం వేలం నిర్వహించగా ఇక్కడి భూములు రాయదుర్గంతో పోటీ పడుతున్నాయనేలా రికార్డు ధరలు పలికాయి. ప్రభుత్వానికి కాసుల వర్షం కురిసింది. దీంతో ప్రభుత్వంలో ఆనందం వ్యక్తమవుతోంది. తాజాగా కోకాపేటలో 5 ఎకరాలను వేలం ద్వారా విక్రయించారు. అయితే ఊహించిన ధర కంటే ఎక్కువగా సొమ్ము రావడం గమనార్హం. గతానికి భిన్నంగా ఇప్పుడు భారీ ఎత్తున స్పందన రావడం, భూముల విలువ కోట్లు పలకడం అధికారులను కూడా ఆశ్చర్యపరిచింది.
వాస్తవానికి రాయదుర్గంలో ఇప్పటి వరకు రికార్డు స్థాయిలో భూములు పలుకుతున్నాయి. దీనికి కారణం కూడా ఉంది. ఇది హైటెక్ సిటీకి సమీపంలో ఉండడం, పైగా హైదరాబాద్ మెట్రో పరిధిలో ఉండడం ప్రధాన కారణాలు. దీంతో ఇక్కడి భూములు ఎకరానికి 177 కోట్ల రూపాయలు పలికాయి. వాస్తవానికి ప్రభుత్వం ఇక్కడి భూములు 100 కోట్ల మేరకు పలుకుతాయనిచె ఆంచనా వేసింది. కానీ ప్రభుత్వ అంచనాలను మించి, ఇటీవల 7.67 ఎకరాలను విక్రయించగా భారీగా ధర పలికి, ప్రభుత్వ అంచనాలకు మించి సొమ్ము వచ్చింది. ఇక్కడ ఎకరానికి 177 కోట్ల రూపాయల చొప్పున ఒక సంస్థ భూమి కొనుగోలు చేసింది.
ఇప్పుడు కోకాపేట విషయానికి వస్తే ఇది రంగారెడ్డి జిల్లాలోని ప్రాంతం. పైగా శివారులో ఎక్కడో విసిరేసినట్టుగా కనిపించే ప్రాంతం. అయినా తాజాగా ఇక్కడి భూములు కూడా రాయదుర్గంతో పోటీ పడుతున్నట్టుగా అనిపించాయి. ఇక్కడి నియోపొలిస్ ప్రాంతంలోని భూములను విక్రయించేందుకు ప్రభుత్వం ప్రయత్నించింది. ఈ నేపథ్యంలో ఎకరానికి 99 కోట్ల రూపాయలు ధరగా నిర్ణయించింది. కానీ అనూహ్యంగా ఎకరానికి 137 కోట్ల రూపాయలు పలికాయి. ఇది ఇటీవల కాలంలో హైదరాబాద్కు వెలుపల నమోదైన అత్యధిక ధర అని తెలంగాణ పారిశ్రామిక వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి ఇలా భారీ ఎత్తున భూములకు రెక్కలు రావడం వెనుక ఫ్యూచర్ సిటీ ప్రాభవం కూడా ఉన్నట్టుగా అంచనాలు వెలువడుతున్నాయి.
This post was last modified on November 24, 2025 10:38 pm
ట్రాఫిక్ పోలీసుల కళ్లుగప్పి వెళ్లేందుకు మనమైతే...ఎన్నెన్నో మార్గాలు అవలంబిస్తూ ఉంటాం. అయితే ఈ కొత్త మాయగాడు మాత్రం ట్రాఫిక్ పోలీసుల కళ్ల ముందే మాయ…
భారతీయ సినీ చరిత్రలోనే అత్యుత్తమ గాయనీమణుల్లో ఒకరైన ఆశా భోస్లే ఇక లేరు. అనారోగ్యం కారణంగా ఇటీవల ముంబయిలోని బ్రీచ్…
తెలుగులోనూ మంచి గుర్తింపు ఉన్న తమిళ నటుడు కార్తీ ఫిల్మోగ్రఫీలో సర్దార్ సినిమాది ప్రత్యేక స్థానం. నాలుగేళ్ళ క్రితం 2022లో…
షూటింగ్ ఆలస్యాలు, రిలీజ్ వాయిదాల తర్వాత ఎట్టకేలకు జూన్ 26 విడుదల తేదీని లెనిన్ లాక్ చేసుకున్న సంగతి తెలిసిందే.…
తెలంగాణలోని కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్న నాయకురాలు.. గిరిజన నేత సీతక్క(అనసూయ) ఒక్కసారిగా బ్లాస్ట్ అ య్యారు. `చెప్పుతెగుద్ది` అని…
పల్నాడు జిల్లా మాచర్ల పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్న పోలీసు అధికారుల అవినీతి అక్రమాలు వరుసగా బయటపడుతున్నాయి. ఇప్పటికే మాచర్ల…