Political News

జగన్ – కేటీఆర్: ఇద్దరు ఒకే వేదికపై…

ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బెంగళూరులో ఒకే వేదికపై కలుసుకోవడం తెలుగు రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. బెంగళూరులో జరిగిన ఓ ప్రైవేట్ కార్యక్రమానికి వీరిద్దరూ హాజరయ్యారు. కేటీఆర్, జగన్ ఇద్దరూ ఒకే వేదికపై కనిపించడంతో ఫంక్ష‌న్ లో ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మొన్నటికి మొన్న వైయస్ జగన్ హైదరాబాదులో కోర్టుకు హాజరైనప్పుడు ఆయన అభిమానులు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. అందులో కేటీఆర్, జగన్ ఫోటోలు కలిపి ప్రదర్శించడం రాజకీ య వర్గాల్లో చర్చ జరిగింది. మొదటినుంచి బీఆర్ఎస్, వైసీపీ పలు అంశాలపై సానుకూలంగా ఉంటున్నాయి. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నపుడు, అక్కడ కేసీఆర్ సీఎంగా ఉన్నారు. గత తెలంగాణా, ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో కూడా ఇద్దరి మధ్య లోపాయికారీ సంబంధం ఉందనే ఊహాగానాలు వినిపించాయి. 

ఓటమి తర్వాత అటు కేటీఆర్, ఇటు జగన్ కూడా అధికార పక్షం నుంచి రాజకీయంగా ఒత్తిడి ఎదుర్కొంటున్నారు. ఈ నేపధ్యంలో వారిద్దరి ఏమి చర్చ జరిగి ఉంటుంది అనే ఆసక్తి నెలకొంది. కొద్దిరోజుల కిందట తెలుగు రాష్ట్రాల సీఎంలు ఇద్దరూ హైదరాబాదులో ఒక ఫంక్షన్ లో ఇటువంటి ఫ్రేమ్ లోనే కనిపించారు. ఇప్పుడు అధికారం కోల్పోయిన ఇద్దరు నేతలు ఇలా కనిపించడం కూడా కొంత ఆసక్తిగా మారింది.

వీరి కలయిక తెలుగు రాష్ట్రాల రాజకీయాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది. వీరిద్దరి భేటీ రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఇది పూర్తిగా వ్యక్తిగత పర్యటన అని, రాజకీయాలకు సంబంధం లేదని ఇరు పార్టీల వర్గాలు క్లారిటీ ఇచ్చాయి.

This post was last modified on November 22, 2025 10:51 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganKTR

Recent Posts

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

50 minutes ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

1 hour ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

2 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

6 hours ago