Political News

రైతులకు బాబుకు మధ్య గ్యాప్ చెరిగిపోతుంది

రైతులకు చంద్రబాబుకు మధ్య గ్యాప్ ఉందన్న ప్రచారం రాజకీయాల్లో ఉంది. పెట్టుబడిదారులకు, పారిశ్రామికవేత్తలకు ఇచ్చే ప్రాధాన్యం సీఎం చంద్రబాబు అన్నదాతలకు ఇవ్వరని, వారి కష్టాలు పట్టించుకోరని వైసీపీ నాయకులు ప్రచారం చేస్తారు. రైతు బాంధవులు అంటే వైఎస్ కుటుంబమేనని కూడా చెబుతుంటారు. అయితే దీనికి విరుగుడుగా చంద్రబాబు ఇప్పుడు అన్నదాతలను మచ్చిక చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రైతన్నలను టార్గెట్‌గా చేసుకుని రాజకీయాల్లో దూకుడు పెంచారు.

దీనిలో భాగంగానే టైം ప్రకారం అన్నదాత సుఖీభవ కార్యక్రమాన్ని అమలు చేస్తున్నారు. ఇప్పటికి రెండు విడతల్లో దాదాపు డెబ్బై వేల కోట్ల రూపాయలను నలభై ఆరు లక్షల మందికి పైగా రైతులకు అందించారు. ఇక తుఫాను, వరదల కారణంగా నష్టపోయిన రైతులను ఆదుకునే కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టారు. అదే సమయంలో రైతుల ఆదాయాన్ని పెంచేందుకు, వారి కష్టాన్ని తగ్గించేందుకు చంద్రబాబు ఐదు కీలక సూత్రాలతో పంచ సూత్ర ప్రణాళికను అమలు చేయాలని నిర్ణయించారు.

ఇటీవల కడప జిల్లా కమలాపురం నియోజకవర్గంలో నిర్వహించిన అన్నదాత సుఖీభవ నిధుల విడుదల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు ఈ ఐదు సూత్రాలను ప్రకటించారు. వీటివల్ల రైతులకు నష్టాలు రాకుండా మరిన్ని లాభాలు కలుగుతాయని చెబుతున్నారు. పైగా ఎవరో వచ్చి వారి దిగుబడిని కొనుగోలు చేసే వరకు ఎదురు చూడకుండా, రైతులే ముందుకు వచ్చి ప్రత్యక్షంగా విక్రయించుకునే అవకాశాలు కల్పిస్తున్నారు. ఈ విధంగా పంచ సూత్రాలను చంద్రబాబు ప్లాన్ చేశారు.

అయితే చంద్రబాబు అక్కడితో ఆగలేదు. ఏదో ఒక కార్యక్రమం ప్రకటించి చేతులు దులుపుకోలేదు. ఆ తర్వాత మరింత పక్కాగా ఈ సూత్రాలను అమలు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. దీనిలో భాగంగా ఈ నెల ఇరవై నాలుగు నుంచి రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని అన్నదాతల ఇళ్ల వద్దకే వెళ్లి నిర్వహించేలా ప్లాన్ చేశారు. ఇందులో ప్రజాప్రతినిధులు, నాయకులు, అధికారులు కూడా పాల్గొనాలని నిర్ణయించారు. తద్వారా రైతులకు చంద్రబాబుకు మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గించేలా పక్కా వ్యూహాన్ని సిద్ధం చేశారు.

ఇది ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.

This post was last modified on November 21, 2025 6:45 pm

Share
Show comments
Published by
Satya
Tags: Chandrababu

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

2 hours ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

4 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

6 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

11 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

12 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

13 hours ago