Political News

వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విచార‌ణ ఖైదీలుగా ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తూ.. విజ‌య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డిస్టిల‌రీల నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నార‌ని, నాసిర‌కం మ‌ద్యం విక్ర‌యించి.. ప్ర‌జ‌ల‌ను దండుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో 3500 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. దీనిపై విచార‌ణ చేయిస్తోంది. ఈక్ర‌మంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆ పార్టీ సానుభూతి ప‌రుడు, గ‌తంలో ఐటీ స‌ల‌హాదారుల‌గా వ్య‌వ‌హ‌రించిన రాజ్ క‌సిరెడ్డి స‌హాప‌లువురిపై కేసు న‌మోదైంది. దీంతో వారిని విచారించిన అధికారులు కోర్టు ఆదేశాల‌తో జైలుకు త‌ర‌లించారు. దాదాపు 5-6 మాసాలుగా వారు విజ‌య‌వాడ లోని జిల్లా స్థాయి జైల్లోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే..తమ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు.

తాజాగా .. విజ‌య‌వాడ‌, గుంటూరు జైల్లో ఉన్న నిందితులు చెవిరెడ్డి, బూణేటి చాణక్య‌, రాజ్ క‌సిరెడ్డి, స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి స‌హా ప‌లువురి రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో విజ‌య‌వాడ‌లోని కోర్టులో వారిని హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో వారిని విచారించిన కోర్టు.. తిరిగి 14 రోజ‌లు రిమాండ్‌.. (అంటే డిసెంబ‌రు 5వ తేదీ వ‌ర‌కు) విధించింది. అయితే.. వీరిలో కొంద‌రికి ఆటోమేటిక్‌గానే బెయిల్ ల‌భించింది. దీంతో వారిపై తిరిగి పిటిష‌న్ వేయాల‌ని సిట్ అదికారులు నిర్ణ‌యించారు. ఫ‌లితంగా.. వారు కూడా మ‌ళ్లీ జైలుకే ప‌రిమితం కానున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతున్నా.. దీనిలో కీల‌క నిందితులు ఇంకా విదేశాల్లోనే ఉన్నార‌ని సిట్ చెబుతోంది. మ‌రోవైపు ఈ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్లి.. ఇటీవ‌ల బెయిల్ ద‌క్కించుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని మ‌రోసారి విచారించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on November 21, 2025 6:29 pm

Share

Recent Posts

దేశముదురు చేయకపోవడమే మంచిదైంది

ఫిలిం ఇండస్ట్రీలో ఒక కథ వేర్వేరు చోట్లకు ప్రయాణించి.. చివరగా ఒక హీరో దగ్గర ఓకే అయి పట్టాలెక్కడం చాలా…

37 minutes ago

ఒకటవ తేదీకే ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు

గత కొంతకాలంగా ప్రభుత్వ ఉద్యోగులకు నెలనెలా వేతనాలు ఇవ్వడం రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద టాస్క్ అయిపొయింది. జగన్ ప్రభుత్వ హయాంలో…

2 hours ago

ఆదర్శ కుటుంబానికి తమన్ ఎలివేషన్

త్రివిక్రమ్ రచయితగా ఉన్న రోజుల్లో విక్టరీ వెంకటేష్‌తో నువ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి లాంటి మరపురాని చిత్రాలను అందించాడు. కానీ…

4 hours ago

విశ్వనాథ్  వాటిని మ్యాచ్ చేయాల్సిందే

వచ్చే నెల 14 విడుదల కాబోతున్న విశ్వనాథ్ అండ్ సన్స్ తీసింది తమిళంలోనే అయినప్పటికీ తెలుగులోనూ మంచి క్రేజ్ ఉంది.…

5 hours ago

జూలై చివరి వారం… OTT ఆప్షన్ల వర్షం

థియేటర్లలో కొత్త రిలీజులు స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే, శ్రీనివాస మంగాపురం లాంటివి సందడి చేస్తుండగా నేనేం తీసిపోలేదన్నట్టు…

5 hours ago

మెగా ట్రీట్… ఏ కానుక ఇవ్వబోతున్నారు

ఆగస్ట్ 22 చిరంజీవి పుట్టినరోజు రానుంది. ఈ సందర్భంగా ఫ్యాన్ సెలెబ్రేషన్స్ ఏ స్థాయిలో ఉంటాయో చెప్పనక్కర్లేదు. అసలే ఈ…

6 hours ago