Political News

వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విచార‌ణ ఖైదీలుగా ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తూ.. విజ‌య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డిస్టిల‌రీల నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నార‌ని, నాసిర‌కం మ‌ద్యం విక్ర‌యించి.. ప్ర‌జ‌ల‌ను దండుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో 3500 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. దీనిపై విచార‌ణ చేయిస్తోంది. ఈక్ర‌మంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆ పార్టీ సానుభూతి ప‌రుడు, గ‌తంలో ఐటీ స‌ల‌హాదారుల‌గా వ్య‌వ‌హ‌రించిన రాజ్ క‌సిరెడ్డి స‌హాప‌లువురిపై కేసు న‌మోదైంది. దీంతో వారిని విచారించిన అధికారులు కోర్టు ఆదేశాల‌తో జైలుకు త‌ర‌లించారు. దాదాపు 5-6 మాసాలుగా వారు విజ‌య‌వాడ లోని జిల్లా స్థాయి జైల్లోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే..తమ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు.

తాజాగా .. విజ‌య‌వాడ‌, గుంటూరు జైల్లో ఉన్న నిందితులు చెవిరెడ్డి, బూణేటి చాణక్య‌, రాజ్ క‌సిరెడ్డి, స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి స‌హా ప‌లువురి రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో విజ‌య‌వాడ‌లోని కోర్టులో వారిని హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో వారిని విచారించిన కోర్టు.. తిరిగి 14 రోజ‌లు రిమాండ్‌.. (అంటే డిసెంబ‌రు 5వ తేదీ వ‌ర‌కు) విధించింది. అయితే.. వీరిలో కొంద‌రికి ఆటోమేటిక్‌గానే బెయిల్ ల‌భించింది. దీంతో వారిపై తిరిగి పిటిష‌న్ వేయాల‌ని సిట్ అదికారులు నిర్ణ‌యించారు. ఫ‌లితంగా.. వారు కూడా మ‌ళ్లీ జైలుకే ప‌రిమితం కానున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతున్నా.. దీనిలో కీల‌క నిందితులు ఇంకా విదేశాల్లోనే ఉన్నార‌ని సిట్ చెబుతోంది. మ‌రోవైపు ఈ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్లి.. ఇటీవ‌ల బెయిల్ ద‌క్కించుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని మ‌రోసారి విచారించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

Satya

Recent Posts

కొత్త శుక్రవారం… కావాలి శుభప్రదం

టాలీవుడ్ బాక్సాఫీస్ జూన్ నెల నుంచి ఊపందుకుంది. ఓవర్సీస్, నార్త్ పక్కనపెడితే తెలుగు రాష్ట్రాల వరకు పెద్ది బ్లాక్ బస్టర్…

1 hour ago

ఎక్కడ చూసినా GV ప్రకాష్ సంగీతమే

టాలీవుడ్ లో ఎక్కువ డిమాండ్ ఉన్న సంగీత దర్శకులు ఎవరయ్యా అంటే ముందు వినిపించే పేరు తమన్. అది నిజం…

1 hour ago

ప్రెగ్నెంట్ అన్నారు… క్రేజీ మూవీ చేస్తోంది

టాలీవుడ్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న సినిమా మొత్తానికి ముహూర్త వేడుకను ముగించింది. విక్టరీ వెంకటేష్, నందమూరి కళ్యాణ్ రామ్‌…

4 hours ago

మృణాల్… ఫ్లాపులు కూడా తాకలేని అందం

టాలీవుడ్ లో క్లాసిక్ లుక్స్ తో ప్రేక్షకుల మనసు గెలుచుకున్న హీరోయిన్లలో మృణాల్ థాకూర్ ఒకరు. సీతారామం సినిమాతో తెలుగు…

5 hours ago

కొరియన్ మార్కెట్ పై వంగా డార్క్ స్ట్రాటజీ?

పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కావడం ఇప్పుడు చాలా కామన్ పాయింట్. కానీ ప్రభాస్, సందీప్ రెడ్డి వంగా…

7 hours ago

రిష‌బ్ శెట్టి మీద 500 కోట్లా?

నాలుగేళ్ల‌ ముందు వ‌ర‌కు రిష‌బ్ శెట్టి అంటే.. క‌న్న‌డ‌కే ప‌రిమిత‌మైన ఒక న‌టుడు, ద‌ర్శ‌కుడు. త‌న మార్కెట్ ప‌రిధి చాలా…

9 hours ago