Political News

వైసీపీ నేత‌ల‌కు మ‌ళ్లీ జైలుకే … ‘లిక్క‌ర్’ కేసు పాట్లు!

వైసీపీ హ‌యాంలో జ‌రిగిన లిక్క‌ర్ కుంభ‌కోణంలో ఆరోప‌ణ‌లు ఎదుర్కొంటూ విచార‌ణ ఖైదీలుగా ఉన్న నాయ‌కుల‌ను మ‌ళ్లీ జైలుకు త‌ర‌లిస్తూ.. విజ‌య‌వాడ కోర్టు తీర్పు ఇచ్చింది. 2019-24 మ‌ధ్య వైసీపీ హ‌యాంలో నూత‌న మ‌ద్యం విధానాన్ని అమ‌లు చేశారు. ఆ స‌మ‌యంలో డిస్టిల‌రీల నుంచి భారీ ఎత్తున ముడుపులు తీసుకున్నార‌ని, నాసిర‌కం మ‌ద్యం విక్ర‌యించి.. ప్ర‌జ‌ల‌ను దండుకున్నార‌ని.. ఈ క్ర‌మంలో 3500 కోట్ల రూపాయ‌ల అక్ర‌మాలు చోటు చేసుకున్నాయ‌ని ప్ర‌భుత్వం గుర్తించింది.

ఈ క్ర‌మంలోనే ప్ర‌త్యేక ద‌ర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి.. దీనిపై విచార‌ణ చేయిస్తోంది. ఈక్ర‌మంలో వైసీపీ సీనియ‌ర్ నేత‌, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి, ఆ పార్టీ సానుభూతి ప‌రుడు, గ‌తంలో ఐటీ స‌ల‌హాదారుల‌గా వ్య‌వ‌హ‌రించిన రాజ్ క‌సిరెడ్డి స‌హాప‌లువురిపై కేసు న‌మోదైంది. దీంతో వారిని విచారించిన అధికారులు కోర్టు ఆదేశాల‌తో జైలుకు త‌ర‌లించారు. దాదాపు 5-6 మాసాలుగా వారు విజ‌య‌వాడ లోని జిల్లా స్థాయి జైల్లోనే కాలం గ‌డుపుతున్నారు. అయితే..తమ‌కు బెయిల్ ఇవ్వాల‌ని కోరుతున్నా.. ఫ‌లితం ద‌క్క‌డం లేదు.

తాజాగా .. విజ‌య‌వాడ‌, గుంటూరు జైల్లో ఉన్న నిందితులు చెవిరెడ్డి, బూణేటి చాణక్య‌, రాజ్ క‌సిరెడ్డి, స‌జ్జ‌ల శ్రీధ‌ర్‌రెడ్డి స‌హా ప‌లువురి రిమాండ్ గ‌డువు ముగియ‌డంతో విజ‌య‌వాడ‌లోని కోర్టులో వారిని హాజ‌రు ప‌రిచారు. ఈ క్ర‌మంలో వారిని విచారించిన కోర్టు.. తిరిగి 14 రోజ‌లు రిమాండ్‌.. (అంటే డిసెంబ‌రు 5వ తేదీ వ‌ర‌కు) విధించింది. అయితే.. వీరిలో కొంద‌రికి ఆటోమేటిక్‌గానే బెయిల్ ల‌భించింది. దీంతో వారిపై తిరిగి పిటిష‌న్ వేయాల‌ని సిట్ అదికారులు నిర్ణ‌యించారు. ఫ‌లితంగా.. వారు కూడా మ‌ళ్లీ జైలుకే ప‌రిమితం కానున్నారు.

ఇక‌, ప్ర‌స్తుతం విచార‌ణ కొన‌సాగుతున్నా.. దీనిలో కీల‌క నిందితులు ఇంకా విదేశాల్లోనే ఉన్నార‌ని సిట్ చెబుతోంది. మ‌రోవైపు ఈ కేసులో అరెస్ట‌యి జైలుకు వెళ్లి.. ఇటీవ‌ల బెయిల్ ద‌క్కించుకున్న ఎంపీ మిథున్ రెడ్డిని మ‌రోసారి విచారించే అవ‌కాశం ఉంద‌ని అధికార వ‌ర్గాలు తెలిపాయి.

This post was last modified on November 21, 2025 6:29 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

బాబీ గారు… ప్రేక్షకులు ఎప్పుడైనా రైటే

భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…

5 hours ago

‘ఇవేవీ తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యాడో’

వైసీపీ అధినేత జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…

6 hours ago

అఫీషియల్: తెలంగాణ ఎన్నికల్లో జనసేన పోటీ

తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…

6 hours ago

‘నువ్వు బ‌జారోడివి కాదు’… అనిల్ మీమ్ పంచ్

సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయ‌డంలో తెలుగు వాళ్ల‌ను మించిన వాళ్లు ఇంకెవ్వ‌రూ ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. కొన్ని మీమ్స్…

8 hours ago

జగన్ చేతులు కాల్చాకా నేతలు ఆకులు పట్టుకున్నారు

అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…

9 hours ago

కైట్ కుర్రోళ్లు… ఇప్పటికైనా అర్థం చేసుకోండి

సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…

10 hours ago