స్థానిక సంస్థల ఎన్నికల వ్యవహారం రాష్ట్ర ప్రభుత్వంలో ఇబ్బందికర అంశంగా మారింది. వచ్చే ఏడాది మార్చి 31 నాటికి స్థానిక సంస్థలు ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేయాలి. ఈ మేరకు కేంద్ర ఎన్నికల సంఘానికి నోటు పంపించాలి. దానిని కేంద్ర ప్రభుత్వానికి పంపించాలి. లేకపోతే 15వ ఆర్థిక సంఘానికి సంబంధించిన దాదాపు 4 వేల కోట్ల రూపాయలకు పైగా గ్రామపంచాయతీ నిధులు కోల్పోయే అవకాశం ఉంటుంది. ఈ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం దృష్టి పెట్టినప్పటికీ స్థానికంగా ఉన్న పరిస్థితులు గ్రామీణ స్థాయిలో ఉన్న రాజకీయ వాతావరణం భిన్నంగా ఉంది.
అధికార పార్టీపై సానుకూలత ఉన్నప్పటికీ అది ఓటు బ్యాంకుగా మారుతుందా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. అన్నదాత సుఖీభవ, తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ బస్సు వంటి పథకాలతో ప్రజలకు మేలు చేస్తున్నామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ క్షేత్రస్థాయిలో నాయకులు వ్యవహరిస్తున్న తీరు కారణంగా అనుకున్న స్థాయిలో మైలేజ్ అయితే రావడం లేదు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో అయితే ఇది మరింత ఎక్కువగా కనిపిస్తోంది. ఇటీవల వర్షాలు, వరదలు, తుఫాన్ల కారణంగా నష్టపోయిన రైతాంగాన్ని పరామర్శించాలని వారికి భరోసా కల్పించాలని సీఎం చంద్రబాబు పదేపదే చెప్పినప్పటికీ నాయకులు కదిలింది లేదు.
రైతులను కలుసుకున్నది లేదు. వారికి భరోసా కల్పించింది కూడా కనిపించడం లేదు. ఇది పైకి కనిపించినటువంటి పెద్ద విపత్తుగా పార్టీ భావిస్తోంది. ఈ పద్ధతి కొనసాగితే గ్రామీణ ప్రాంతాల్లో జరిగే ఎన్నికల్లో ఎదురు దెబ్బ తగులుతున్నది ఒక వాదన. దీంతో ఇటీవల పంచాయతీ ఎన్నికలకు సంబంధించి కొంత హడావిడి చేసినప్పటికీ మళ్ళీ వెనక్కి తగ్గారు. కానీ, మరొకవైపు నాలుగు మాసాల్లో ఏదో ఒక నిర్ణయం తీసుకుని కేంద్ర ప్రభుత్వానికి నివేదిక పంపించకపోతే 15వ ఆర్థిక సంఘం నిధులు ఆగిపోయే ప్రమాదం కనిపిస్తోంది.
అలాగని ప్రత్యేక అధికారుల పాలనను తీసుకురావాలన్నా.. కేంద్రం ఒప్పుకోవడం లేదు. దీంతో నిధుల బెడద కొనసాగుతుంది. దీంతో ఇప్పుడు ఏం చేయాలన్న విషయంపై పార్టీ సందిగ్ధంలో పడింది. త్వరలోనే దీనికి సంబంధించి సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుంటారన్నది పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వాస్తవానికి గ్రామస్థాయిలో జరిగే ఎన్నికల్లో పార్టీల జెండాలు ఉండవు. పార్టీ నాయకుల ప్రమేయం కూడా తక్కువగానే ఉంటుంది. కానీ, సంస్థాగతంగా వచ్చే ఎన్నికల నాటికి ఇది బలమైన మద్దతు కూడగట్టే అవకాశం ఉండడంతో గ్రామపంచాయతీ ఎన్నికలను ప్రతి పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న విషయం తెలిసిందే.
This post was last modified on November 27, 2025 10:06 pm
తమిళనాడు ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ మరో సంప్రదాయాన్ని బ్రేక్ చేశారు. ఎన్నికలకు ముందు అందరం ఒక్కటేనంటూ నీతులు వల్లించే నాయకులు…
సౌత్ ఇండియన్ ఫిలిం మేకింగ్ ని కొత్త పుంతలు తొక్కించిన దర్శకుల్లో శంకర్, మురుగదాస్ పేర్లు ప్రత్యేకంగా నిలుస్తాయి. ఎందుకంటే…
‘టాక్సిక్’ వచ్చిన తర్వాత ‘ఇరుముడి’ రన్ మీద ప్రభావం తప్పదేమో అని డౌట్ ఉండేది. పెద్ద పాన్ ఇండియా సినిమా…
సుప్రసిద్ధ గాయని ఏంఎస్ సుబ్బులక్ష్మి జీవిత కథ ఆధారంగా బయోపిక్ తీసేందుకు నిర్మాత బన్నీ వాస్, అల్లు అరవింద్, రాక్…
నవంబర్ లో విడుదల కాబోతున్న రామాయణ పార్ట్ 1 మీద అంచనాలు ఎలా ఉన్నా బిజినెస్ వ్యవహారాలు మాత్రం జోరుగా…
సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ పుట్టినరోజు రానుంది. అభిమానులు పెద్ద ఎత్తున సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవుతున్నారు. అసలు రిలీజ్…