Political News

జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ : టీడీపీ

త‌న‌పై ఉన్న వేల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా హైద‌రాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్క‌సారి ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేర‌కు నాంప‌ల్లికి వ‌చ్చి.. కోర్టు విచార‌ణకు హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిన‌ని… తాను బ‌య‌ట‌కు వ‌స్తే.. భారీ భ‌ద్ర‌త క‌ల్పించాల్సి  ఉంటుంద‌ని, పైగా తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ.. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా కోర్టునుంచి అనుమ‌తి పొందారు.

దీంతో గ‌త ఐదేళ్లు గా జ‌గ‌న్ విచార‌ణ‌కు రాకుండా.. త‌న న్యాయ‌వాదులను మాత్ర‌మే పంపుతున్నారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న కేవ‌లం ఎమ్మెల్యేగా మిగిలారు. 11 స్థానాలే రావ‌డం తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు. దీంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఎలాంటి హోదా లేదు. ఒక్క ఎమ్మెల్యేగా త‌ప్ప‌.. కాబ‌ట్టి ఆయ‌నను కోర్టుకు పిలవాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లుచేసింది. దీంతో కోర్టు ఇటీవ‌ల ఆయ‌న‌ను హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్ప‌డంతో జ‌గ‌న్ గురువారం కోర్టుకు వ‌చ్చారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా విమానాశ్ర‌యం నుంచి కోర్టు వ‌ర‌కు భారీగా ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల‌ను పిలిచి.. ర్యాలీగా వెళ్లారు. దారి పొడ‌వునా.. దండాలు పెట్టుకుంటూ.. జ‌గ‌న్ ముందుకు సాగారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ఉంద‌ని పేర్కొంటూ వార్త‌లు ప్ర‌చారం చేసింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నాయకులు ఆస‌క్తిగా స్పందించారు. ఒక‌ర‌కంగా సెటైర్లు సంధించారు. అయితే.. ఇక నుంచి జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు, జైలు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ అని నాయ‌కులు వ్యాఖ్యానించారు.

“ఎవ‌రైనా కోర్టుకు వెళ్తుంటే.. అంతో ఇంతో భిడియ ప‌డ‌తార‌ని.. కానీ, జ‌గ‌న్‌లో అలాంటిదేమీ లేద‌ని.. పైగా ఇదేదో పెళ్లికి వెళ్లిన‌ట్టు వెళ్లారు“ అని కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కోర్టుకు వెళ్ల‌డం అల‌వాటు ప‌డిన జ‌గ‌న్‌కు ఇది కొత్త‌కాద‌ని కూడా ఎద్దేవా చేశారు. ఏదో ప్ర‌జాక్షేత్రంలో కి ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ట్టుగా ర్యాలీగా వెళ్ల‌డాన్ని దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్ ఇక ముందు కూడా కోర్టు యాత్ర‌లు విజ‌య‌వంతంగా చేసుకోవాల‌ని వ్యాఖ్యానించడం కొస‌మెరుపు.

Kumar

Recent Posts

యూకేలో కొత్త ప్రధాని.. భారత విద్యార్థులపై ప్రభావం ఉంటుందా?

అభివృద్ధి చెందిన దేశాల్లో రాజకీయ స్థిరత్వం ఎక్కువగా ఉంటుందని భావిస్తారు. కానీ గత పదేళ్లుగా యునైటెడ్ కింగ్‌డమ్ పరిస్థితి మాత్రం…

16 minutes ago

భాగ్యశ్రీ మాటతో… మళ్ళీ రామ్ ట్రేండింగ్

టాలీవుడ్ స్టార్ రామ్ పోతినేని, యంగ్ హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే మధ్య ప్రేమాయణం నడుస్తోందంటూ గతంలోనే సోషల్ మీడియాలో చాలా…

1 hour ago

పవన్ చెప్పిందేమిటి?… వీరు చేస్తున్నదేమిటీ?

రాజకీయాల్లో విమర్శలు… వాటికి ప్రతి విమర్శలు సర్వసాధారణమే. అయితే విమర్శల పేరిట అసభ్య పదజాలం వాడటం సరికాదు.. ప్రతి విమర్శల…

2 hours ago

దీవానా సమస్య సెన్సార్ మాత్రమేనా

మొన్న శనివారం విడుదలైన దీవానాకు టాక్, రివ్యూస్ రెండూ డీసెంట్ గా వచ్చాయి. యునానిమస్ కాదు కానీ ఎవరూ నెగటివ్…

2 hours ago

రీ-నీట్… ఇంత చేసినా మళ్లీ సందేహాలు, ప్రశ్నలు!?

రీ-నీట్ 2026 పరీక్ష నిర్వహణ మరోసారి వివాదాలకు కేంద్రబిందువైంది. గతంలో నీట్ పరీక్షలో అవకతవకలు వెలుగుచూడటంతో రీ-ఎగ్జామ్ నిర్వహించినప్పటికీ, ఈసారి…

3 hours ago

పుట్టినరోజు సంబరం… జన నాయకుడి మౌనం

ఇవాళ తమిళనాడు ముఖ్యమంత్రి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ పుట్టినరోజు. సీఎం అయ్యాక ఫస్ట్ బర్త్ డే కావడంతో అభిమానుల…

3 hours ago