Political News

జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ : టీడీపీ

త‌న‌పై ఉన్న వేల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా హైద‌రాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్క‌సారి ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేర‌కు నాంప‌ల్లికి వ‌చ్చి.. కోర్టు విచార‌ణకు హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిన‌ని… తాను బ‌య‌ట‌కు వ‌స్తే.. భారీ భ‌ద్ర‌త క‌ల్పించాల్సి  ఉంటుంద‌ని, పైగా తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ.. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా కోర్టునుంచి అనుమ‌తి పొందారు.

దీంతో గ‌త ఐదేళ్లు గా జ‌గ‌న్ విచార‌ణ‌కు రాకుండా.. త‌న న్యాయ‌వాదులను మాత్ర‌మే పంపుతున్నారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న కేవ‌లం ఎమ్మెల్యేగా మిగిలారు. 11 స్థానాలే రావ‌డం తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు. దీంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఎలాంటి హోదా లేదు. ఒక్క ఎమ్మెల్యేగా త‌ప్ప‌.. కాబ‌ట్టి ఆయ‌నను కోర్టుకు పిలవాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లుచేసింది. దీంతో కోర్టు ఇటీవ‌ల ఆయ‌న‌ను హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్ప‌డంతో జ‌గ‌న్ గురువారం కోర్టుకు వ‌చ్చారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా విమానాశ్ర‌యం నుంచి కోర్టు వ‌ర‌కు భారీగా ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల‌ను పిలిచి.. ర్యాలీగా వెళ్లారు. దారి పొడ‌వునా.. దండాలు పెట్టుకుంటూ.. జ‌గ‌న్ ముందుకు సాగారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ఉంద‌ని పేర్కొంటూ వార్త‌లు ప్ర‌చారం చేసింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నాయకులు ఆస‌క్తిగా స్పందించారు. ఒక‌ర‌కంగా సెటైర్లు సంధించారు. అయితే.. ఇక నుంచి జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు, జైలు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ అని నాయ‌కులు వ్యాఖ్యానించారు.

“ఎవ‌రైనా కోర్టుకు వెళ్తుంటే.. అంతో ఇంతో భిడియ ప‌డ‌తార‌ని.. కానీ, జ‌గ‌న్‌లో అలాంటిదేమీ లేద‌ని.. పైగా ఇదేదో పెళ్లికి వెళ్లిన‌ట్టు వెళ్లారు“ అని కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కోర్టుకు వెళ్ల‌డం అల‌వాటు ప‌డిన జ‌గ‌న్‌కు ఇది కొత్త‌కాద‌ని కూడా ఎద్దేవా చేశారు. ఏదో ప్ర‌జాక్షేత్రంలో కి ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ట్టుగా ర్యాలీగా వెళ్ల‌డాన్ని దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్ ఇక ముందు కూడా కోర్టు యాత్ర‌లు విజ‌య‌వంతంగా చేసుకోవాల‌ని వ్యాఖ్యానించడం కొస‌మెరుపు.

This post was last modified on November 20, 2025 6:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganTDP

Recent Posts

10 వేల కెపాసిటీ బ్యాటరీతో ఫోన్ వచ్చేసింది

స్మార్ట్‌ఫోన్ ప్రపంచంలో రియల్‌మీ సరికొత్త రికార్డు సృష్టించింది. గురువారం భారత మార్కెట్లో పీ4 పవర్ 5G ఫోన్‌ను విడుదల చేసింది.…

4 hours ago

వెండి కూడా బంగారానికి చేరువయ్యేలా..

​హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నాయి. జనవరి 29 నాటి గణాంకాల ప్రకారం, కేవలం…

5 hours ago

కూతురు కాదు కసాయి… షాకింగ్ ఘటన

అమ్మాయిది అగ్రకులం... అబ్బాయిది వెనుకుబడిన కులం...ఇద్దరూ ప్రేమించుకున్నారు...కానీ, ఈ కులాంతర వివాహానికి అమ్మాయి తల్లిదండ్రులు ఒప్పుకోలేదు...ఆ తర్వాత ఆ ప్రేమ…

6 hours ago

జగన్ పాదయాత్రపై షర్మిల సంచలన వ్యాఖలు

ఈ మధ్యకాలంలో పొలిటికల్ సౌండ్ తగ్గించిన ఏపీ కాంగ్రెస్ చీఫ్, వైఎస్ షర్మిల మళ్ళీ రంగంలోకి దిగారు. మహాత్మా గాంధీ…

8 hours ago

‘ఒరేయ్ తరుణ్ భాస్కర్… క్యారెక్టర్లో ఉండిపోకు’

దర్శకుడిగా తొలి చిత్రం ‘పెళ్ళిచూపులు’తో తరుణ్ భాస్కర్ రేపిన సంచలనం అంతా ఇంతా కాదు. రెండో సినిమా ‘ఈ నగరానికి…

9 hours ago

‘వారణాసి’లో పోస్టర్లు… జక్కన్న పనేనా..?

రాజమౌళి సినిమా అంటే ఒకప్పట్లా భారతీయ ప్రేక్షకులు మాత్రమే కాదు.. గ్లోబల్ ఆడియన్స్ కూడా ఎదురు చూస్తున్నారు. తన చివరి చిత్రం ‘ఆర్ఆర్ఆర్’…

10 hours ago