Political News

జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ : టీడీపీ

త‌న‌పై ఉన్న వేల కోట్ల రూపాయ‌ల అక్ర‌మాస్తుల కేసుల‌కు సంబంధించి వైసీపీ అధినేత జ‌గ‌న్‌.. తాజాగా హైద‌రాబాద్‌లోని ఏసీబీ కోర్టుకు హాజ‌ర‌య్యారు. సుదీర్ఘ విరామం త‌ర్వాత‌.. ఆయ‌న కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్క‌సారి ఆయ‌న ముఖ్య‌మంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేర‌కు నాంప‌ల్లికి వ‌చ్చి.. కోర్టు విచార‌ణకు హాజ‌ర‌య్యారు. ఆ త‌ర్వాత తాను ముఖ్య‌మంత్రిన‌ని… తాను బ‌య‌ట‌కు వ‌స్తే.. భారీ భ‌ద్ర‌త క‌ల్పించాల్సి  ఉంటుంద‌ని, పైగా తాను నిరంత‌రం ప్ర‌జ‌ల‌తో ఉండాల్సిన అవ‌స‌రం ఉంద‌ని పేర్కొంటూ.. విచార‌ణ‌కు హాజ‌రు కాకుండా కోర్టునుంచి అనుమ‌తి పొందారు.

దీంతో గ‌త ఐదేళ్లు గా జ‌గ‌న్ విచార‌ణ‌కు రాకుండా.. త‌న న్యాయ‌వాదులను మాత్ర‌మే పంపుతున్నారు. అయితే, గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయిన త‌ర్వాత‌.. ఆయ‌న కేవ‌లం ఎమ్మెల్యేగా మిగిలారు. 11 స్థానాలే రావ‌డం తో ప్ర‌ధాన ప్ర‌తిప‌క్ష హోదా కూడా ఇవ్వ‌లేదు. దీంతో జ‌గ‌న్‌కు ఇప్పుడు ఎలాంటి హోదా లేదు. ఒక్క ఎమ్మెల్యేగా త‌ప్ప‌.. కాబ‌ట్టి ఆయ‌నను కోర్టుకు పిలవాల‌ని సీబీఐ పిటిష‌న్ దాఖ‌లుచేసింది. దీంతో కోర్టు ఇటీవ‌ల ఆయ‌న‌ను హాజ‌రు కావాల్సిందేన‌ని తేల్చి చెప్ప‌డంతో జ‌గ‌న్ గురువారం కోర్టుకు వ‌చ్చారు.

అయితే.. ఈ సంద‌ర్భంగా విమానాశ్ర‌యం నుంచి కోర్టు వ‌ర‌కు భారీగా ర్యాలీ నిర్వ‌హించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణుల‌ను పిలిచి.. ర్యాలీగా వెళ్లారు. దారి పొడ‌వునా.. దండాలు పెట్టుకుంటూ.. జ‌గ‌న్ ముందుకు సాగారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. జ‌గ‌న్‌కు ప్ర‌జాద‌ర‌ణ భారీగా ఉంద‌ని పేర్కొంటూ వార్త‌లు ప్ర‌చారం చేసింది. అయితే.. ఈ వ్య‌వ‌హారంపై టీడీపీ నాయకులు ఆస‌క్తిగా స్పందించారు. ఒక‌ర‌కంగా సెటైర్లు సంధించారు. అయితే.. ఇక నుంచి జ‌గ‌న్ కోర్టు యాత్ర‌లు, జైలు యాత్ర‌లు చేసుకుంటే బెట‌ర్ అని నాయ‌కులు వ్యాఖ్యానించారు.

“ఎవ‌రైనా కోర్టుకు వెళ్తుంటే.. అంతో ఇంతో భిడియ ప‌డ‌తార‌ని.. కానీ, జ‌గ‌న్‌లో అలాంటిదేమీ లేద‌ని.. పైగా ఇదేదో పెళ్లికి వెళ్లిన‌ట్టు వెళ్లారు“ అని కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కోర్టుకు వెళ్ల‌డం అల‌వాటు ప‌డిన జ‌గ‌న్‌కు ఇది కొత్త‌కాద‌ని కూడా ఎద్దేవా చేశారు. ఏదో ప్ర‌జాక్షేత్రంలో కి ప్ర‌జ‌ల‌ను ప‌రామ‌ర్శించేందుకు వెళ్లిన‌ట్టుగా ర్యాలీగా వెళ్ల‌డాన్ని దుయ్య‌బ‌ట్టారు. జ‌గ‌న్ ఇక ముందు కూడా కోర్టు యాత్ర‌లు విజ‌య‌వంతంగా చేసుకోవాల‌ని వ్యాఖ్యానించడం కొస‌మెరుపు.

This post was last modified on November 20, 2025 6:42 pm

Share
Show comments
Published by
Kumar
Tags: JaganTDP

Recent Posts

రెహమాన్ నిజంగా లైవ్ ఇస్తున్నారా

పెద్ది రీ రికార్డింగ్ ఎక్కడిదాకా వచ్చిందో ఇంకా క్లారిటీ లేదు. అడుగుదామంటే దర్శకుడు బుచ్చిబాబు బయట కనిపించే పరిస్థితిలో లేరు.…

3 hours ago

4 ల‌క్ష‌ల క‌లెక్షన్… థియేట‌ర్‌కు 10 వేలు

తెలంగాణ‌లోని సింగిల్ థియేట‌ర్ల‌లో అద్దె విధానానికి స్వ‌స్తి ప‌లికి ప‌ర్సంటేజీ ప‌ద్ధ‌తిని తీసుకురావాల‌ని ఇక్క‌డి ఎగ్జిబిట‌ర్లు ఎప్ప‌ట్నుంచో డిమాండ్ చేస్తూ…

4 hours ago

స్నాక్ ప్యాకెట్లకు కలర్ కరువైంది

తినుబండారాలు అంటే చాలా మందికి అర్థం కాదేమో. ఎందుకంటే మనోళ్లంతా ఇప్పుడు ఆ తినుబండారాలకు స్నాక్స్ అని పేరు పెట్టుకున్నారు…

4 hours ago

సూపర్ నిర్ణయం… GO వచ్చినా పాత రేట్లే

తాజాగా జరిగిన తెలంగాణ ఎగ్జిబిటర్ల సమావేశంలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానం అమలు చేయడం గురించి పెద్ద చర్చే జరిగింది.…

6 hours ago

నానితో క్లాష్… మెగాస్టార్ ఒప్పుకోరేమో

అప్డేట్స్ కంటే పుకార్లతో ఎక్కువ కాలక్షేపం చేస్తున్న సినిమా విశ్వంభర. చిరంజీవి అంతటి మెగాస్టార్ తో తీసిన ఈ ప్యాన్…

6 hours ago

పెద్ది మెడకు పర్సెంటేజ్ గొడవ

తెలంగాణలో సింగల్ స్క్రీన్లకు పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేయాలనే డిమాండ్ క్రమంగా తీవ్ర రూపం దాలుస్తోంది. ఇవాళ హైదరాబాద్ లో…

8 hours ago