తనపై ఉన్న వేల కోట్ల రూపాయల అక్రమాస్తుల కేసులకు సంబంధించి వైసీపీ అధినేత జగన్.. తాజాగా హైదరాబాద్లోని ఏసీబీ కోర్టుకు హాజరయ్యారు. సుదీర్ఘ విరామం తర్వాత.. ఆయన కోర్టు మెట్లు ఎక్కారు. 2020లో ఒకే ఒక్కసారి ఆయన ముఖ్యమంత్రి హోదాలో కోర్టు ఆదేశాల మేరకు నాంపల్లికి వచ్చి.. కోర్టు విచారణకు హాజరయ్యారు. ఆ తర్వాత తాను ముఖ్యమంత్రినని… తాను బయటకు వస్తే.. భారీ భద్రత కల్పించాల్సి ఉంటుందని, పైగా తాను నిరంతరం ప్రజలతో ఉండాల్సిన అవసరం ఉందని పేర్కొంటూ.. విచారణకు హాజరు కాకుండా కోర్టునుంచి అనుమతి పొందారు.
దీంతో గత ఐదేళ్లు గా జగన్ విచారణకు రాకుండా.. తన న్యాయవాదులను మాత్రమే పంపుతున్నారు. అయితే, గత ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత.. ఆయన కేవలం ఎమ్మెల్యేగా మిగిలారు. 11 స్థానాలే రావడం తో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వలేదు. దీంతో జగన్కు ఇప్పుడు ఎలాంటి హోదా లేదు. ఒక్క ఎమ్మెల్యేగా తప్ప.. కాబట్టి ఆయనను కోర్టుకు పిలవాలని సీబీఐ పిటిషన్ దాఖలుచేసింది. దీంతో కోర్టు ఇటీవల ఆయనను హాజరు కావాల్సిందేనని తేల్చి చెప్పడంతో జగన్ గురువారం కోర్టుకు వచ్చారు.
అయితే.. ఈ సందర్భంగా విమానాశ్రయం నుంచి కోర్టు వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. పెద్ద ఎత్తున వైసీపీ శ్రేణులను పిలిచి.. ర్యాలీగా వెళ్లారు. దారి పొడవునా.. దండాలు పెట్టుకుంటూ.. జగన్ ముందుకు సాగారు. దీనిని వైసీపీ అనుకూల మీడియా పెద్ద ఎత్తున హైలెట్ చేసింది. జగన్కు ప్రజాదరణ భారీగా ఉందని పేర్కొంటూ వార్తలు ప్రచారం చేసింది. అయితే.. ఈ వ్యవహారంపై టీడీపీ నాయకులు ఆసక్తిగా స్పందించారు. ఒకరకంగా సెటైర్లు సంధించారు. అయితే.. ఇక నుంచి జగన్ కోర్టు యాత్రలు, జైలు యాత్రలు చేసుకుంటే బెటర్ అని నాయకులు వ్యాఖ్యానించారు.
“ఎవరైనా కోర్టుకు వెళ్తుంటే.. అంతో ఇంతో భిడియ పడతారని.. కానీ, జగన్లో అలాంటిదేమీ లేదని.. పైగా ఇదేదో పెళ్లికి వెళ్లినట్టు వెళ్లారు“ అని కృష్ణాజిల్లాకు చెందిన టీడీపీ మాజీ మంత్రి వ్యాఖ్యానించారు. అంతే కాదు.. కోర్టుకు వెళ్లడం అలవాటు పడిన జగన్కు ఇది కొత్తకాదని కూడా ఎద్దేవా చేశారు. ఏదో ప్రజాక్షేత్రంలో కి ప్రజలను పరామర్శించేందుకు వెళ్లినట్టుగా ర్యాలీగా వెళ్లడాన్ని దుయ్యబట్టారు. జగన్ ఇక ముందు కూడా కోర్టు యాత్రలు విజయవంతంగా చేసుకోవాలని వ్యాఖ్యానించడం కొసమెరుపు.
This post was last modified on November 20, 2025 6:42 pm
జెనీలియా డిసౌజా.. ఈ పేరెత్తగానే తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడూ నవ్వుతూ కనిపించే అమ్మాయి గుర్తుకు వస్తుంది. ‘బొమ్మరిల్లు’లో హహ హాసిని…
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…