Political News

ఇందిర‌మ్మ‌ జ‌యంతి… మ‌హిళ‌ల‌కు రేవంత్ కానుక ఇదే!

నేడు(న‌వంబ‌రు 19) దేశ మాజీ ప్ర‌ధాని, దివంగ‌త ఇందిరాగాంధీ జ‌యంతి. 1917, న‌వంబ‌రులో ఆమె జ‌న్మించారు. దేశానికి ప్ర‌ధాన మంత్రిగా చేశారు. కూడు-గూడు-గుడ్డ నినాదాన్ని అందిపుచ్చుకుని పేద‌లను త‌న‌వైపు తిప్పుకొన్నారు. అయితే.. ఎమ‌ర్జెన్సీ కార‌ణంగా.. ఇందిర‌మ్మ ప్రజా ప్రాభ‌వం కోల్పోయింది. ఇదిలావుంటే.. తెలంగాణ ప్ర‌భుత్వం ఇందిర‌మ్మ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని రాష్ట్రంలో వినూత్న ప‌థ‌కానికి శ్రీకారం చుట్టింది. దీనికి `ఇందిరా మ‌హిళా శ‌క్తి` అనే పేరు పెట్టింది. ఈ ప‌థ‌కం కింద‌.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కోటి మంది మ‌హిళ‌ల‌కు చీర‌లు పంపిణీ చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది.

ఈ విష‌యంపై సీఎం రేవంత్ రెడ్డి.. కేబినెట్‌లోని మ‌హిళా మంత్రులు కొండా సురేఖ‌, సీత‌క్క‌ల‌తో సుదీర్ఘంగా చ‌ర్చించారు. శాంపిల్‌గా కొన్ని చీర‌ల‌ను కూడా ప‌రిశీలించారు. గ్రామాలు, ప‌ట్ట‌ణాల్లో ఒకే త‌ర‌హా చీర‌ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. సీఎం ప‌రిశీలించిన చీర‌ల నాణ్య‌త బాగుంద‌ని.. క్వాలిటీ కూడా నాణ్యంగా ఉంద‌ని కితాబు నిచ్చారు. తెలుపు, నీలం క‌ల‌బోత‌తో ఈ చీర‌ల‌ను ఎంపిక చేయించారు. సిరిసిల్ల స‌హా.. ఇత‌ర రాష్ట్రాల నుంచి కూడా.. చీర‌ల‌ను కొనుగోలు చేశారు. కాగా.. రెండు విడ‌త‌లుగా ఇందిరా మ‌హిళా శ‌క్తి పేరిట చీర‌ల‌ను పంపిణీ చేయాల‌ని నిర్ణ‌యించారు. ఇందిరా గాంధీ జ‌యంతిని పుర‌స్క‌రించుకుని న‌వంబ‌రు 19న తొలిద‌శ పంపిణీ చేయ‌నున్నారు.

ఇది.. డిసెంబరు 8వ తారీకు వ‌ర‌కు కొన‌సాగుతుంది. ఈ ద‌శ‌లో అన్ని గ్రామీణ ప్రాంతాల్లోనూ మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తారు. కాగా.. ఇదేస‌మ‌యంలో గ్రామీణ ప్రాంతాల్లో పాల‌న‌పై కార్య‌క్ర‌మాలు కూడా చేప‌ట్ట‌నున్నారు. అనంత‌రం.. స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌లు జ‌రిగే అవ‌కాశం ఉన్న‌నేప‌థ్యంలో రెండో ద‌శ‌ను మార్చి వ‌ర‌కు పొడిగించారు. రెండో ద‌శ‌లో ప‌ట్ట‌ణ ప్రాంతాల్లోని మ‌హిళ‌ల‌కు చీర‌ల‌ను పంపిణీ చేస్తారు. దీనిలో భాగంగా మార్చి 1 నుంచి ఈ కార్య‌క్ర‌మాన్ని అమ‌లు చేస్తారు. మొత్తంగా కోటి మందికి చీర‌ల‌ను పంపిణీ చేసేందుకు ప్ర‌భుత్వం రంగం రెడీ చేసింది.

గ‌తంలో..

గ‌తంలో కేసీఆర్ స‌ర్కారు కూడా బ‌తుక‌మ్మ చీర‌ల పేరిట పేద కుటుంబాల‌కు చీర‌ల‌ను పంపిణీ చేసింది. అయితే.. అప్ప‌ట్లో ఇది వివాదం అయింది. చీర‌ల నాణ్య‌త స‌రిగా లేద‌నిపేర్కొంటూ మ‌హిళ‌లు.. రోడ్డెక్కి నిర‌స‌న తెలిపారు. మ‌రికొన్నిచోట్ల అధికారుల అల‌స‌త్వం కార‌ణంగా.. చీర‌లు గోడౌన్ కూడా దాట‌లేదు. మ‌రోవైపు .. సిరిసిల్ల చేనేత కార్మికుల‌కు.. కేసీఆర్ స‌ర్కారు బ‌కాయి పెట్టింది. ఇది కూడా రాజ‌కీయంగా వివాదానికి దారి తీసింది. అయితే.. మెజారిటీ గ్రామీణుల‌కు మేలు చేసింద‌న్న వాదన కూడా వినిపించింది. కానీ, ఇది గ‌త ఎన్నిక‌ల్లో బీఆర్ ఎస్‌కు పెద్ద‌గా ఫ‌లించ‌లేదు.

This post was last modified on November 19, 2025 5:11 pm

Share

Recent Posts

గుంటూరుపై వైసీపీ పూర్తి పట్టు కోల్పోయినట్టేనా?

గుంటూరులోని తూర్పు, ప‌డ‌మ‌ర నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ త‌న ప్ర‌భావం, ప్రాభవం కూడా కోల్పోయింది. రెండున్న‌రేళ్ల కాలంలో పార్టీ ఘోరంగా దెబ్బ‌తింద‌న్న…

2 minutes ago

‘ఫ్రీ బస్సు’లో ఎన్డీఏకు చేరువవుతున్న మహిళలు

ఏపీలోని నిర్దేశిత ఆర్టీసీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించేందుకు ‘స్త్రీ శక్తి’ పథకాన్ని ఎన్డీఏ ప్రభుత్వం సమర్థవంతంగా అమలు చేస్తోన్న…

7 minutes ago

అభిమాని ఆఖరిచూపుకు స్టార్ హీరో ఎందుకు వెళ్లలేదు

'టాక్సిక్' రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్న కన్నడ స్టార్ యశ్ వరుసగా ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నాడు. ఇక రీసెంట్ ఒక…

3 hours ago

కెన్యా విషయంలో జాగ్రత్తలు అవసరం

కొరియన్ కనకరాజు సీక్వెల్ కి ప్లానింగ్ జరుగుతోంది. కెన్యా కనకరాజు పేరుతో స్క్రిప్ట్ డిస్కషన్లు మొదలయ్యాయని సమాచారం. అంటే కొరియా…

3 hours ago

విశ్వనాథ్ గెలిస్తే క్రెడిట్ తెలుగు ప్రేక్షకులదే

కోలీవుడ్ స్టార్ సూర్య సుడి బాగుంది. చాలా ఏళ్లుగా సరైన సక్సెస్ లేక ఇబ్బంది పడుతున్న ఈ గజిని హీరోకి…

4 hours ago

ఇరుముడికి ఎలాంటి ఇరుకు లేదు

ఆగస్ట్ 21 ఇరుముడి విడుదలకు రంగం సిద్ధమయ్యింది. మాస్ మహారాజా రవితేజ హీరోగా శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందిన ఈ…

5 hours ago