Political News

రాజధానికి కూతవేటు దూరంలో మావోయిస్టుల కలకల

ఏపీ రాజధాని అమరావతి సమీపంలో విజయవాడ నగర శివారు కానూరు కొత్త ఆటోనగర్‌లో మావోయిస్టుల కలకలం రేగింది. కేంద్ర బలగాలు సోదాలు చేపట్టి ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 27 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఓ భవనాన్ని షెల్టర్‌గా చేసుకుని మావోయిస్టులు ఉన్నట్లు సమాచారం అందడంతో ఆ ప్రాంతంలో తనిఖీలు చేపట్టారు.

అరెస్టయిన మావోయిస్టుల్లో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులు ఉన్నట్లు సమాచారం. 11 మంది సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. నాలుగు చోట్ల డంప్‌లు ఏర్పాటు చేసినట్లు పోలీసులకు సమాచారం అందింది. వాటిని స్వాధీనం చేసుకునేందుకు విస్తృతంగా గాలింపు చేపట్టారు.

స్థానిక పోలీసుల సాయంతో ఆక్టోపస్‌, గ్రేహండ్స్‌ బలగాలు కొత్త ఆటోనగర్‌ను ఆధీనంలోకి తీసుకుని సోదాలు చేశారు. భవన యజమాని కోసం పోలీసుల ఆరా తీశారు. అతడు నెలన్నర నుంచి విదేశాల్లో ఉంటున్నట్లు తెలిసింది. పది రోజుల క్రితం ఈ ప్రాంతానికి మావోయిస్టులు వచ్చినట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కూలీ పనుల కోసం వచ్చామంటూ, అద్దెకు ఉంటామని మావోయిస్టులు ఈ భవనంలోకి ప్రవేశించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు వాచ్‌మెన్‌ను అదుపులోకి తీసుకుని పోలీసులు ప్రశ్నిస్తున్నారు.

This post was last modified on November 18, 2025 3:54 pm

Share
Show comments
Published by
Kumar
Tags: VIjayawada

Recent Posts

జాన్వీని ఎందుకు దాచి పెడుతున్నారు

ఇప్పటిదాకా జరిగిన పెద్ది ప్రమోషన్లను జాగ్రత్తగా గమనిస్తే జాన్వీ కపూర్ కేవలం చికిరి చికిరి పాటలో మాత్రమే కనిపించింది. దాంట్లో…

42 minutes ago

పోలీసు కేసు కూడా విష్ణుప్రియకి ప్లస్సే

బిగ్ బాస్‌తో పాటు అనేక టీవీ షోల ద్వారా పాపుర‌ల్ అయిన అమ్మాయి.. విష్ణుప్రియ భీమ‌నేని. ఈ పాపులారిటీతోనే ఇన్‌స్టాగ్రామ్‌లో…

49 minutes ago

అంతమంది హిట్టర్లు ఉన్నా… ఇదేం ఆట?

ఐపీఎల్ 2026లో కోల్‌కతా నైట్ రైడర్స్ (KKR) పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. చెన్నైలోని చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన…

3 hours ago

‘గుడ్’ ప్రమోషన్లు చేసుకోవాలి ‘కార్తీక్’

టైటిల్ లో బ్యాడ్ అని పెట్టుకున్నారు కానీ దానికి తగ్గట్టే ప్రమోషన్లలో బాగా వెనుకబడిపోయింది బ్యాడ్ బాయ్ కార్తీక్. శుక్రవారం…

4 hours ago

ప్రతాప్ కష్టం చూస్తే పాపం అనాల్సిందే

ఈ శుక్రవారం అన్నీ చిన్న సినిమాలే విడుదల కాబోతున్నాయి. వాటిలో పాపం ప్రతాప్ ఒకటి. తిరువీర్ హీరోగా నటించిన ఈ…

5 hours ago

క్వాంటం కంప్యూటింగ్‌లో మనదే తొలి అడుగు

అమ‌రావ‌తిలో ఏర్పాటు చేయ‌నున్న క్వాంటం కంప్యూటింగ్‌లో తొలి అడుగు విజ‌య‌వంతంగా ప‌డింద‌ని సీఎం చంద్ర‌బాబు అన్నారు. రాజ‌ధాని అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం…

5 hours ago