విశాఖపట్నం అంతర్జాతీయ విమానాశ్రయం రద్దీగా మారింది. ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ తో నిండిపోయింది. వైజాగ్ లో సీఐఐ పార్ట్ నర్ సమ్మిట్ ఈ రోజు మొదలైన విషయం తెలిసిందే. ఈ సదస్సుకు దేశ విదేశాల నుంచి వ్యాపార దిగ్గజాలు తరలి వస్తున్నారు. ఈ సీఐఐ సదస్సులో 112 పరిశ్రమలకు ప్రారంభోత్సవాలు చేయబోతున్నాం. సదస్సుకు 45 దేశాల నుంచి సుమారు 300 మంది ప్రతినిధులు, 200 మంది భారత అగ్రశ్రేణి సంస్ధల సీఈవోలు, పలువురు కేంద్ర మంత్రులు హాజరవుతారు.
కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత విశాఖ నుంచి అంతర్జాతీయ విమాన ప్రయాణికుల రాకపోకలు పెరిగాయి. విశాఖ నుంచి వారానికి నాలుగు రోజులు అంతర్జాతీయ సర్వీసులు నడుస్తున్నాయి. సాధారణంగా రోజూ దాదాపు 60 విమాన సర్వీసులు ఉన్నాయి. సింగపూర్కు వెళ్లేందుకు ఎప్పటి నుంచో సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
దుబాయ్ కి కూడా ఇక్కడి నుంచి విమాన సర్వీసు గత జూన్ లోనే ప్రారంభం అయింది. సీఐఐ భాగస్వామ్య సదస్సు జరుగుతున్న నేపథ్యంలో విమాన రాకపోకలు రద్దీగా మారాయి. ప్రత్యేక విమాన సర్వీసులు లేకపోయినా ప్రైవేటు విమానాలు, చార్టెడ్ ఫ్లైట్స్ లలో వ్యాపార వేత్తలు తరలి వస్తున్నారు.
మరోవైపు విశాఖలో స్టార్ హోటళ్లు కూడా నిండిపోయాయి. నోవాటెల్ హోటల్ లో బిజినెస్ రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహిస్తున్నారు. తైవాన్, ఇటలీ, స్వీడన్, నెదర్లాండ్స్ నుంచి వచ్చిన ప్రతినిధులు ఆయా హోటళ్లలో బస చేశారు.
దేశంలో ఇటీవలే లోక్ సభ, అసెంబ్లీ సీట్ల సంఖ్య పెంపునకు సంబందించి ఓ రేంజిలో రచ్చ జరిగిన సంగతి తెలిసిందే.…
రెడ్ బుక్ మూసేయలేదని.. అది ఇంకా తెరిచే ఉందని మంత్రి నారా లోకేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. రెడ్ బుక్లో…
ఈ ఏడాది ‘దురంధర్-2’ సినిమాతో బాలీవుడ్ బాక్సాఫీస్ బాగానే కళకళలాడినప్పటికీ.. ఓవరాల్ సక్సెస్ రేట్ ఏమీ అంత గొప్పగా లేదు.…
తమరిది అన్నదమ్ముల అనుబంధం అని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ను ఉద్దేశించి మంత్రి నారా లోకేష్ పలుమార్లు వ్యాఖ్యానించారు.…
రాష్ట్రంలో బౌలర్స్(ప్రత్యర్థులు) మారినా బ్యాట్స్మెన్ మాత్రం చంద్రబాబు నాయుడేనని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు. తిరుపతిలో జరిగిన ప్రభుత్వ వియోజత్సవ…
తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) ఇంచార్జీ మీనాక్షి నటరాజన్ తో పాటు గ్రాండ్ ఓల్డ్ పార్టీ కాంగ్రెస్ కు…