Political News

దేశ రాజ‌ధానిలో భారీ పేలుడు… 8 మంది మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించింది. కీల‌క‌మైన ప‌ర్య‌టక ప్రాంతం ఎర్ర‌కోట వ‌ద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేష‌న్ గేటు 1 ద‌గ్గ‌ర పార్క్ చేసి ఉంచిన కారులో జ‌రిగిన ఈ పేలుడు రాజ‌ధానిని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లు కార్లు కాలి పోగా.. 8 మంది మృతి చెందిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి.. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఈ పేలుడు కార‌ణాల‌పై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని.. అనుమానుత‌ల‌ను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని పోలీసులు తెలిపారు.

కాగా.. ఘ‌ట‌నా ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పేలుడు ధాటికి భారీగా శ‌బ్దాలు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. స‌మీపంలోని ప‌లు ఇళ్లలో గోడ‌లు, వ‌స్తువులు కూడా ధ్వంస‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఇక‌, ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో బైకులు, కార్లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఇక‌, ఈ ఘ‌ట‌న అనంత‌రం.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు భీతిల్లారు. ప్ర‌జ‌లు ప‌రుగులు పెట్టిన దృశ్యా లు సీసీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. అయితే.. చిత్రం ఏంటంటే ప్ర‌తి సోమ‌వారం రాజ‌ధానిలో ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో తాజాగా పేలుడు జ‌రిగిన రోజు సోమ‌వారం కావ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌ని పోలీసులుచెబుతున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెంద‌గా.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అనేక అనుమానాలు!

రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. ఇది కుట్ర పూరితంగా జ‌రిగిందా? లేక‌.. ఉగ్ర‌వాద కోణం ఉందా? అనే దిశ‌గా పోలీసులు దృష్టి పెట్టారు. సోమ‌వారం ఉద‌యం నుంచి మెట్రో రైల్వే స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎవ‌రు సంచ‌రించారు, ముసుగులు ధ‌రించిన వారు ఉన్నారా?  లేక‌.. ఎవ‌రైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, మ‌రో రీజ‌న్‌పై కూడా దృష్టి పెట్టారు. కారులో పేలుడు ప‌దార్థాలు ఉంచి.. దూరంగా ఎవ‌రైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తుచేస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర‌ప‌తి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఢిల్లీసీఎం రేఖా గుప్తా.. ఈ ఘ‌ట‌న‌పై ప‌ర్య‌వేక్షించారు.

This post was last modified on November 10, 2025 9:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

29 minutes ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

37 minutes ago

మెక్సికన్ డాన్ ను గర్ల్ఫ్రెండ్ పట్టించిందా..

మెక్సికోలో అత్యంత ప్రమాదకరమైన డ్రగ్ మాఫియా డాన్ నెమెసియో రూబెన్ ఒసెగ్వెరా సెర్వంటెస్ అలియాస్ 'ఎల్ మెంచో' కథ ముగిసింది.…

2 hours ago

రోమియో రక్తంలో ఏం చూపించబోతున్నారు

న్యాచురల్ స్టార్ నాని తన ఇమేజ్ ని ఏ దిశగా తీసుకెళ్తున్నాడో ప్రేక్షకులకు పూర్తి క్లారిటీ వచ్చేస్తోంది. దసరాతో తెచ్చుకున్న…

3 hours ago

కల్కి 2 ప్లానింగ్… ఒక పద్ధతి ఒక ప్రణాళిక

ప్రభాస్ సినిమాలు సెట్స్ మీద ఎన్ని ఉన్నా ముందుగా ఏది విడుదలవుతుందో చెప్పలేని పరిస్థితి నెలకొన్న మాట వాస్తవం. ఆదిపురుష్…

3 hours ago

తిరుమలలో పాము కాటు… నిజమెంత?

తిరుమ‌ల‌పై మ‌రో దుష్ప్ర‌చారం జ‌ర‌గ‌డంపై ప్ర‌భుత్వం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. ఈ దుష్ప్రాచారానికి కార‌ణం ఎవ‌రు? ఎక్క‌డ నుంచి జ‌రిగింది?…

7 hours ago