Political News

దేశ రాజ‌ధానిలో భారీ పేలుడు… 8 మంది మృతి

దేశ రాజ‌ధాని ఢిల్లీలో సోమ‌వారం రాత్రి 7 గంట‌ల స‌మ‌యంలో భారీ పేలుడు సంభ‌వించింది. కీల‌క‌మైన ప‌ర్య‌టక ప్రాంతం ఎర్ర‌కోట వ‌ద్ద ఉన్న మెట్రో రైల్వే స్టేష‌న్ గేటు 1 ద‌గ్గ‌ర పార్క్ చేసి ఉంచిన కారులో జ‌రిగిన ఈ పేలుడు రాజ‌ధానిని ఉలికిపాటుకు గురి చేసింది. ఈ ఘ‌ట‌న‌లో ప‌లు కార్లు కాలి పోగా.. 8 మంది మృతి చెందిన‌ట్టు ప్రాథ‌మికంగా అంచ‌నా వేశామ‌ని ఢిల్లీ పోలీసులు తెలిపారు. అయితే.. మృతుల సంఖ్య పెరిగే అవ‌కాశం ఉంద‌ని తెలిపారు. ఈ ఘ‌ట‌న విష‌యం తెలిసిన వెంట‌నే అగ్నిమాప‌క సిబ్బంది రంగంలోకి దిగి.. మంట‌ల‌ను ఆర్పే ప్ర‌య‌త్నం చేశారు. అయితే.. ఈ పేలుడు కార‌ణాల‌పై అధ్య‌య‌నం చేస్తున్నామ‌ని.. అనుమానుత‌ల‌ను అదుపులోకి తీసుకునే ప్ర‌య‌త్నంలో ఉన్నామ‌ని పోలీసులు తెలిపారు.

కాగా.. ఘ‌ట‌నా ప్రాంతంలో భీతావ‌హ వాతావ‌ర‌ణం నెల‌కొంది. పేలుడు ధాటికి భారీగా శ‌బ్దాలు వ‌చ్చాయ‌ని స్థానికులు తెలిపారు. స‌మీపంలోని ప‌లు ఇళ్లలో గోడ‌లు, వ‌స్తువులు కూడా ధ్వంస‌మ‌య్యాయ‌ని తెలిపారు. ఇక‌, ఘ‌ట‌న జ‌రిగిన ప్రాంతంలో బైకులు, కార్లు మంట‌ల్లో చిక్కుకున్నాయి. ఇక‌, ఈ ఘ‌ట‌న అనంత‌రం.. పెద్ద ఎత్తున ప్ర‌జ‌లు భీతిల్లారు. ప్ర‌జ‌లు ప‌రుగులు పెట్టిన దృశ్యా లు సీసీ కెమెరాల్లో న‌మోద‌య్యాయి. అయితే.. చిత్రం ఏంటంటే ప్ర‌తి సోమ‌వారం రాజ‌ధానిలో ప‌ర్యాట‌క ప్రాంతాల‌కు సెల‌వు ప్ర‌క‌టిస్తున్నారు. దీంతో తాజాగా పేలుడు జ‌రిగిన రోజు సోమ‌వారం కావ‌డంతో ప్రాణ న‌ష్టం త‌ప్పింద‌ని పోలీసులుచెబుతున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌లో 8 మంది మృతి చెంద‌గా.. ప‌దుల సంఖ్య‌లో గాయ‌ప‌డ్డారు. వారిని స‌మీపంలోని ఆసుప‌త్రుల‌కు త‌ర‌లించారు. మృతుల సంఖ్య‌పై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

అనేక అనుమానాలు!

రాజ‌ధాని ఢిల్లీలో చోటు చేసుకున్న పేలుడు ఘ‌ట‌న‌పై అనేక అనుమానాలు వ‌స్తున్నాయి. ఇది కుట్ర పూరితంగా జ‌రిగిందా? లేక‌.. ఉగ్ర‌వాద కోణం ఉందా? అనే దిశ‌గా పోలీసులు దృష్టి పెట్టారు. సోమ‌వారం ఉద‌యం నుంచి మెట్రో రైల్వే స్టేష‌న్ ప‌రిస‌ర ప్రాంతాల్లో ఎవ‌రు సంచ‌రించారు, ముసుగులు ధ‌రించిన వారు ఉన్నారా?  లేక‌.. ఎవ‌రైనా ఉద్దేశ పూర్వకంగా చేశారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తు ముమ్మ‌రం చేస్తున్నారు. ఇక‌, మ‌రో రీజ‌న్‌పై కూడా దృష్టి పెట్టారు. కారులో పేలుడు ప‌దార్థాలు ఉంచి.. దూరంగా ఎవ‌రైనా రిమోట్ కంట్రోల్ సాయంతో పేల్చారా? అనే కోణంలోనూ ద‌ర్యాప్తుచేస్తున్నారు. కాగా.. ఈ ఘ‌ట‌న‌పై ప్ర‌ధాని మోడీ, రాష్ట్ర‌ప‌తి దిగ్భ్రాంతి వ్య‌క్తం చేశారు. ఢిల్లీసీఎం రేఖా గుప్తా.. ఈ ఘ‌ట‌న‌పై ప‌ర్య‌వేక్షించారు.

This post was last modified on November 10, 2025 9:13 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

జగన్ అన్నా క్యాంటీన్లను తీసేసింది అందుకేనా?

వైసీపీ హ‌యాంలో రాష్ట్రాన్ని అన్ని విధాలా దోచుకున్న జ‌గ‌న్‌.. పేద‌ల‌కు ప‌ట్టెడ‌న్నం కూడా పెట్ట‌లేక పోయార‌ని సీఎం చంద్ర‌బాబు విమ‌ర్శించారు.…

32 minutes ago

అమరావతిపై ఇంత విషమేంటి నాని గారు?

ఏపీ రాజ‌ధాని అమ‌రావతిపై వైసీపీ నాయ‌కులు అదే అక్క‌సు ప్ర‌ద‌ర్శిస్తున్నారు. రాజ‌ధానిపై తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పిస్తూనే ఉన్నారు. జ‌గ‌న్ ప్ర‌తిపాదించిన…

1 hour ago

లాయర్ అవతారమెత్తిన రాజు గారు

కనుమూరి రఘురామకృష్ణరాజు... ఈ పేరుకు పెద్దగా పరిచయం అక్కర్లేదు. లోక్ సభ సభ్యుడిగా, ఆ తర్వాత శాసనసభ్యుడిగా ఎన్నికైన రాజు..…

1 hour ago

ఎట్టకేలకు వర్మ త్యాగానికి ఫలితం

జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కోసం తన సీటును త్యాగం చేసిన ఎస్వీఎస్ఎన్ వర్మకు ఎట్టకేలకు ఫలితం…

2 hours ago

జోష్ తగ్గింది జగన్

వైసీపీ అధినేత జగన్ ఎప్పుడు బయటకు వచ్చినా భారీ ఎత్తున జన సమీకరణ ఉంటుంది. ఆయన వెనక యువత ఎక్కువగా…

2 hours ago

టీడీపీలో లోకేష్ శ‌కం… ఇక కథ వేరుంటది

తెలుగుదేశం పార్టీలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటివరకు లేని వర్కింగ్ ప్రెసిడెంట్ పదవిని సృష్టించారు. దీనికి ప్రస్తుత మంత్రి నారా…

3 hours ago