చుట్టూతా అడవి.. పక్కనే సెలయేరు.. ఒక బండరాయిపై కూర్చున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేతిలో పుస్తకం పట్టుకొని సీరియస్ గా చదువుతున్నారు.. సోషల్ మీడియాలో దీనిని చూసిన ఆయన అభిమానులు, జనసైనికులు.. ఆ పుస్తకం పేరు ఏంటని ఆసక్తిగా గమనించారు. మరికొందరైతే ఆ పుస్తకం పైన టైటిల్ ని చూసి గూగుల్ సెర్చ్ చేశారు. కెన్నెత్ ఆండర్సన్ రాసిన మాన్ ఈటర్స్ జంగిల్ కిల్లర్స్ పుస్తకం అది..! ఆ పుస్తకంలో ఏముంది అనే ఆసక్తి సహజంగానే అందరికీ కలిగింది.
1910- 1974 మధ్య కాలంలో జీవించిన కెన్నెత్ ఆండర్సన్ భారతదేశానికి చెందిన స్కాట్లండు సంతతి వాడైన ప్రముఖ రచయిత, వేటగాడు, అధికారి. బెంగళూరులో నివాసముంటూ భారతదేశపు అడవులలో సంచరించే పులులు, చిరుతపులులు, ఏనుగులు అడవి కుక్కలు, పాములు, ఎలుగుబంట్లు మొదలైన వన్యమృగాల గురించి ఆసక్తికరమైన ఎన్నో పుస్తకాలు, రచనలు చేశారు. ఈ పుస్తకంలో మనుషులను చంపే మృగాలను నిర్మూలించాలని పిలుపుని అందుకున్న వేటగాడు ఎలా తన సవాలను స్వీకరిస్తాడు… ఇందులోని వేటగాడి క్యారెక్టర్ ద్వారా అడుగు అడుగుగా తన అనుభవాలను వివరించి, తన వేట విధానాన్ని, అందులో దాగి ఉన్న భయం మరియు ఉత్కంఠను పాఠకుడి ముందు ఉంచాడు ఆండర్సన్.
పవన్ కళ్యాణ్ కు సహజంగా పుస్తకాలు చదవడం అంటే ఎంతో ఆసక్తి. మరి ఇతర రాజకీయ నాయకుడికి లేని అలవాటు ఇది. ఈ ఏడాది విజయవాడలో జరిగిన 35వ పుస్తక మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఇటీవల లక్ష్మి ముర్డేశ్వర్ పురి రచించిన “ఆమె సూర్యుడిని కబళించింది” పుస్తకాన్ని ఆయన ఆవిష్కరించారు. పలు ప్రసంగాల్లో ఆయన పుస్తకాల్లోని వాక్యాలను ప్రస్తావిస్తుంటారు. ఇప్పుడు ఈ పుస్తకాన్ని చదవడంతో సహజంగానే అందరికీ ఆ పుస్తకంపై ఆసక్తి కలిగింది.
This post was last modified on November 9, 2025 7:40 pm
తెలుగు సినీ ప్రేక్షకులు అత్యంత ఆసక్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నందన్ది ఒకటి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్…
తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…
అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అందరూ హిట్ మెషీన్ అంటారు. దర్శక ధీరుడు రాజమౌళి తర్వాత అపజయం లేకుండా కెరీర్ను సాగిస్తున్న…
అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…
బలంగా మాట్లాడాలి. మాటకు మాట కౌంటర్ ఇవ్వాలి. అది వింటే ప్రత్యర్థులు నోరు అప్పగించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…
బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…