ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాల్లో దురంధర్ 2 నిడివి గురించి తెగ చర్చ జరుగుతోంది. ఏకంగా 3 గంటల 55 నిమిషాల ఫైనల్ వెర్షన్ ని దర్శకుడు ఆదిత్య ధార్ లాక్ చేశాడనే వార్త హాట్ టాపిక్ గా మారిపోయింది. నిజానికి మూడు గంటల నలభై నిమిషాలకు సెన్సార్ కాపీ సిద్ధమయ్యిందనే వార్త వచ్చిన కొన్ని గంటలకే ఫ్రెష్ అప్డేట్ రావడం గమనార్హం.
అంటే ఇంటర్వెల్ తో కలిపి ప్రేక్షకులు 4 గంటల 10 నిమిషాలు థియేటర్లోనే ఉండాల్సి వస్తుంది. జెపి దత్తా ఎల్ఓసి లైన్ అఫ్ కంట్రోల్ తర్వాత ఇంత సుదీర్ఘమైన నిడివితో ఏ ఇండియన్ మూవీ రాలేదు. ఒకవేళ నిజమైతే మాత్రం రణ్వీర్ సింగ్ కెరీర్ లో అరుదైన ఘనత చేరుతుంది.
ఇక టెన్షన్ దేనికనే పాయింట్ కు వద్దాం. ఇంత లెన్త్ ఉంటే మల్టీప్లెక్సుల్లో షోలు షెడ్యూల్ చేయడం చాలా కష్టమవుతుంది. ఎందుకంటే ఒక్క షోకు సగటు నాలుగున్నర గంటలు పడితే (క్లీనింగ్ తో కలిపి) రోజుకు నాలుగు ఆటలే వేసినా పదహారు గంటలు అక్కడే అయిపోతాయి.
అంటే డబుల్ షిఫ్ట్స్ వేసి సిబ్బందితో పని చేయించాల్సి ఉంటుంది. ఓవర్ నైట్ జీతాలు అదనంగా ఇవ్వాలి. తెల్లవార్లు స్క్రీన్లు రన్ అవుతూనే ఉండాలి. హిట్ టాక్ వస్తే కనీసం రెండు వారాల పాటు ఈ పరిణామాల్లో ఎలాంటి మార్పు ఉండదు. రోజుకు ఒక్క షో తగ్గిపోవడం వల్ల కలెక్షన్లు బాగా ప్రభావితం చెందుతాయి. ఇది అసలు ఆందోళన.
అసలే కాంపిటీషన్ లో టాక్సిక్ ఉంది. రెండింటికి షోలు పంచాల్సిన బాధ్యత డిస్ట్రిబ్యూటర్ల మీద ఉంది. అలాంటప్పుడు దురంధర్ 2 ఇంత నిడివితో వస్తే ప్రాక్టికల్ గా చాలా సమస్యలు వస్తాయి. నిర్మాతలు ఎడిటింగ్ చేయమని ఆదిత్య ధార్ ని కోరుతున్నారట.
ప్రస్తుతానికి ఫుల్ వెర్షన్ సెన్సార్ చేయించి తదుపరి నిర్ణయం ఈ వారంలోనే తీసుకునే దిశగా చర్యలు ప్రారంభమైనట్టు ముంబై టాక్. ఓవర్సీస్ లో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలైపోయాయి. ట్రైలర్ రాకుండానే వెయ్యికిపైగానే టికెట్లు అమ్ముడుపోవడం క్రేజ్ ని సూచిస్తున్నాయి. వీలైనంత త్వరగా నిర్మాణ సంస్థ జియో స్టూడియోస్ దీనికి సంబంధించిన క్లారిటీ ఇస్తే బెటర్.
This post was last modified on March 1, 2026 5:12 pm
సినిమా నటులు ఎందరో రాజకీయ నాయకులయ్యారు. అయితే ప్రజల మనసులో బలమైన ముద్ర వేసిన వాళ్ళు మాత్రం కొందరే ఉంటారు.…
మూడ్ ఆఫ్ ది నేషన్ పేరుతో ఇండియా టుడే సీ ఓటర్ చేసిన సర్వే తమిళనాడు టీవీకే, కాంగ్రెస్ కాపురం…
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ( SIR ) చిక్కుముడిగా మారింది.…
కూటమిలో భాగస్వామి అయిన జనసేన పార్టీ ఎమ్మెల్యే పనితీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. పనితీరు బాగోలేని…
ఏపీ వాసులకు బీపీ పెరిగిపోతుంది.. దాంతోపాటు మధుమేహ వ్యాధి కూడా..! రాష్ట్రంలో అసంక్రమిత వ్యాధులను ముందుగానే గుర్తించి సకాలంలో చికిత్స…
సినిమా షూటింగ్ లో భాగంగా ఆర్టిస్టులు కొన్నిసార్లు రిస్కీ స్టంట్లు చెయ్యాల్సి ఉంటుంది. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా సరే కొన్నిసార్లు…