Movie News

బామ్మ భుజాల మీద సినిమాను నడిపించారు

తెలుగులో అయినా ఒకటి రెండు హిట్లు పడుతున్నాయి కానీ తమిళ బాక్సాఫీస్ మరీ అన్యాయంగా సరైన సినిమాలు లేక అలో లక్ష్మణా అంటోంది. సంక్రాంతికి భారీ అంచనాలతో వచ్చిన పరాశక్తి డిజాస్టర్ కావడం, జన నాయకుడు వాయిదా పడటం అక్కడి ఎగ్జిబిషన్ రంగాన్ని బాగా దెబ్బ కొట్టింది. అందుకే తాజాగా విడుదలైన తాయ్ కిళవి మీద భారీ ఆశలు పెట్టుకున్నారు.

శివ కార్తికేయన్ నిర్మాతగా వ్యవహరించడంతో బిజినెస్ పరంగా క్రేజ్ వచ్చింది. దానికి తోడు టైటిల్ రోల్ పోషించిన రాధికా శరత్ కుమార్ నటన గురించి ట్రైలర్ లో ముందే శాంపిల్స్ చూపించడంతో మాస్ ఆడియన్స్ ఆసక్తి పెంచుకున్నారు.  

కథ విషయానికి వస్తే పక్కా పల్లెటూరి మాస్ డ్రామా ఈ తాయ్ కిళవి. పవునుత్తాయి (రాధికా శరత్ కుమార్) అనే బామ్మకు కోపం ఎక్కువ. డబ్బులు వడ్డీలకు ఇస్తూ కాలం గడుపుతూ ఉంటుంది. ముక్కుసూటిగా మాట్లాడ్డం, తేడా వస్తే తుక్కు రేపడం ఆవిడ స్టైల్. బాధ్యత లేని ముగ్గురు కొడుకులను బయటికి పంపించి ఒంటరిగా ఉంటుంది.

ఆమె దగ్గర బంగారు నిధి ఉందనే ప్రచారం ఊళ్ళో మొదలవుతుంది. హఠాత్తుగా పక్షవాతం వచ్చి మాట పడిపోయాక, వెళ్ళిపోయిన సంతానం తిరిగి ఆమె దగ్గరకు చేరుకుంటారు. సైగ ద్వారా ఏదో చెప్పాలనే ప్రయత్నం చేస్తుంది పవునుత్తాయి. చివరికి ఏం జరిగింది, కథ కంచికి చేరిందా లేదానేది అసలు స్టోరీ.

పక్కా తమిళనాడు నేటివిటీలో రూపొందిన తాయ్ కిళవి ఆద్యంతం రాధికా శరత్ కుమార్ అద్భుతమైన నటన మీద వెళ్ళిపోతుంది. సెటిల్డ్ కామెడీ,  మంచి ఎమోషన్స్ తో దర్శకుడు శివకుమార్ మురుగేషన్ పూర్తి గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కించారు. సెకండాఫ్ లో ఎమోషన్స్ కాస్త ఎక్కువైనప్పటికీ వాటిని హ్యాండిల్ చేసిన తీరు బాగుంది.

కొంత ల్యాగ్ ని భరించగలిగితే తాయ్ కిళవి మంచి ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది. కాకపోతే మన తెలుగు జనాలకు కనెక్ట్ అవ్వడం కొంచెం కష్టమే. అందుకే డబ్బింగ్ లాంటి నిర్ణయం ప్రస్తుతానికి తీసుకోలేదు. నివాస్ కె ప్రసన్న సంగీతం అందించగా టాలీవుడ్ జనాలకు పరిచయమున్న ఆర్టిస్టులు ఇందులో లేరు.

This post was last modified on March 1, 2026 3:55 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

కుప్పంలో భువ‌నేశ్వ‌రి సైలెంట్ `టూర్స్‌`

ఏపీ సీఎం చంద్ర‌బాబు సొంత నియోజ‌క‌వ‌ర్గం.. తిరుప‌తిలోని కుప్పంలో ఆయ‌న స‌తీమ‌ణి నారా భువ‌నేశ్వ‌రి సైలెంట్‌గా చుట్టేస్తున్నారు. ప్ర‌తి రెండు…

3 minutes ago

ముస్లిం కట్టిన అయోధ్య రామాలయం ఇది

అయోధ్య రామాలయం ఎక్కడో ఉత్తర ప్రదేశ్ లో ఉంది కదా. మరి ఈ రామాలయం.. అది కూడా ఓ ముస్లిం కట్టిన…

8 minutes ago

పాపం కాదు… బాగుంది ప్రయత్నం అనిపించాలి

తిరువీర్ అంటే రెగ్యులర్ సినిమాలు చూసే ప్రేక్షకులకు సుపరిచితుడే కానీ సెలెక్టివ్ గా థియేటర్లకు వెళ్లే వాళ్లకు మాత్రం కొంచెం…

2 hours ago

ఇక ఎవరొచ్చినా అమరావతిని ముట్టుకోలేరు

తెలుగు నేల విభజన తర్వాత రాజధాని లేకుండానే ఆంధ్ర ప్రదేశ్ తన ప్రస్థానాన్ని మొదలుపెట్టాల్సి వచ్చింది. ఓ వైపు రాజధాని లేమి,…

2 hours ago

బస్సు ప్రమాదం… కత్తితో 8 మందిని కాపాడిన రియల్ హీరో

మార్కాపురం జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం తీరని విషాదాన్ని మిగిల్చిన విషయం తెలిసిందే. అయితే ఇదే ప్రమాదంలో మరోవైపు…

3 hours ago

సంక్షోభాన్ని అడ్డుకునేందుకు భారత్ ప్లాన్ బీ

పశ్చిమ ఆసియాలో యుద్ధం ముదురుతున్న కొద్దీ భారత్ తన ఇంధన అవసరాల కోసం వ్యూహాలను వేగవంతం చేస్తోంది. చమురు, గ్యాస్…

3 hours ago