హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ, “ఉరి శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇది చాలా బాధాకరం” అని అన్నారు. ఇంకా ఆమె స్పష్టం చేస్తూ, “కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను. కానీ బీఆర్ఎస్తో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పింది.
తన సస్పెన్షన్పై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కవిత మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్కు గట్టి దెబ్బలుగా మారుతున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీలో ఇప్పటికే ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కుటుంబ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు దిశ గురించి చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి.
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…
విహార యాత్రల్లో ప్రమాదం జరిగితే పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అలాంటిదే ఇప్పుడు వియత్నాంలో జరిగింది. వియత్నాంలో…