హైదరాబాద్: బీఆర్ఎస్ నుంచి తనను అవమానకరంగా బయటకు పంపించారని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
కవిత మాట్లాడుతూ, “ఉరి శిక్ష విధించే ఖైదీకి కూడా చివరి కోరిక అడుగుతారు. కానీ నాకు షోకాజ్ నోటీసు ఇవ్వకుండా సస్పెండ్ చేశారు. ఇది చాలా బాధాకరం” అని అన్నారు. ఇంకా ఆమె స్పష్టం చేస్తూ, “కేసీఆర్ పిలిస్తే కూతురిగా ఇంటికి వెళ్తాను. కానీ బీఆర్ఎస్తో ఇక నాకు ఎలాంటి సంబంధం లేదు” అని చెప్పింది.
తన సస్పెన్షన్పై కవిత చేసిన ఈ వ్యాఖ్యలు, పార్టీ అంతర్గత పరిస్థితులను మరింత కష్టతరం చేస్తున్నాయి. జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ కవిత మాట్లాడిన ప్రతి మాట బీఆర్ఎస్కు గట్టి దెబ్బలుగా మారుతున్నాయనే మాట రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది.
పార్టీలో ఇప్పటికే ఉన్న విభేదాలు ఇప్పుడు బయటపడుతున్నాయి. కుటుంబ రాజకీయాలు, పార్టీ భవిష్యత్తు దిశ గురించి చర్చలు మళ్లీ వేడెక్కుతున్నాయి.
This post was last modified on November 9, 2025 11:15 am
భర్త మహాశయులకు విజ్ఞప్తి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో గెస్టుగా వచ్చిన దర్శకుడు బాబీ మాట్లాడుతూ రవితేజ రొటీన్ సినిమాలు…
వైసీపీ అధినేత జగన్పై ఏపీ సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అమరావతిపై జగన్ రెండు రోజుల కిందట…
తెలంగాణలో త్వరలో జరగనున్న మునిసిపల్ ఎన్నికల్లో జనసేన పార్టీ పోటీ చేయనున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది.“త్వరలో జరగనున్న తెలంగాణ…
సినిమాల మీద మీమ్స్ క్రియేట్ చేయడంలో తెలుగు వాళ్లను మించిన వాళ్లు ఇంకెవ్వరూ ఉండరంటే అతిశయోక్తి కాదు. కొన్ని మీమ్స్…
అమరావతిని ఉద్దేశించి వైఎస్ జగన్ చేసిన వ్యాఖ్యలు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారాన్ని రేపాయి. రాజధానిని సో-కాల్డ్ నగరంగా అభివర్ణిస్తూ,…
సంక్రాంతి పండుగ వచ్చిందంటే చాలు…చిన్నా పెద్దా అని తేడా లేకుండా పతంగులు ఎగరేస్తుంటారు. పండుగ పూట కుటుంబ సభ్యులు, మిత్రులతో…