Political News

ద‌డ ద‌డ‌: బాబు విన్నారు.. రంగంలోకి దిగారు.. !

ఇటీవ‌ల లండ‌న్ ప‌ర్య‌ట‌న‌కు వెళ్లేముందు.. సీఎం చంద్ర‌బాబు మంగ‌ళ‌గిరిలోని టీడీపీ కేంద్ర కార్యాల‌యానికి వ‌చ్చారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న పార్టీ నాయ‌కుల‌కు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఇదేస‌మ‌యంలో ప్ర‌జ‌ల నుంచి విన‌తులు కూడా తీసుకున్నారు. వీటిలో ఎక్కువ‌గా రెవెన్యూ ప‌ర‌మైన స‌మ‌స్య‌లు.. ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో జ‌రుగుతున్న అవ‌క‌త‌వ‌క‌ల‌పైనే ఉన్నాయి. వీటిని సావ‌ధానంగా విన్న చంద్ర‌బాబు ఎవ‌రినీ హెచ్చ‌రించ‌లేదు. ఎవ‌రినీ ఏమీ అన‌లేదు.

కానీ, దాని తాలూకు ప‌ర్య‌వ‌సానం మాత్రం ఆ వెంట‌నే క‌నిపించింది. హుటాహుటిన ప్ర‌క్షాళ‌న‌కు దిగారు. ఏసీబీని రంగంలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాల‌యాల్లో త‌నిఖీలు ముమ్మ‌రం చేశారు. ఒకే రోజు ప‌లు కార్యాల‌యాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోట్ల రూపాయ‌ల సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. ప‌లువురు అధికారుల‌పైనా కేసులు న‌మోదు చేశారు. ఇదేస‌మ‌యంలో అవ‌క‌త‌వ‌క‌ల‌తో పాటు అన‌ధికార వ్య‌క్తులు చ‌క్రం తిప్పుతున్న తీరును కూడా తెలుసుకున్నారు.

ఈ మొత్తం వ్య‌వ‌హారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంలో గుబులు పుట్టించింది. వాస్త‌వానికి గ‌తంలో చంద్ర‌బాబు ముందు హెచ్చ‌రించేవారు. ప‌నితీరు మార్చుకోవాల‌ని.. ఫిర్యాదులు వ‌స్తున్నాయ‌ని చెప్పే వారు. కానీ ఈ ద‌ఫా అలాంటి హెచ్చ‌రిక‌లు ఏమీ లేకుండానే నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఈ క్ర‌మంలో 2 కీల‌క విష‌యాల‌ను ఆయ‌న ప‌రోక్షంగా చెప్పేశారు. 1) ప్ర‌జాసేవ‌లో అక్ర‌మాల‌కు తావు ఉండ‌దు: ఈ విష‌యంలో చంద్ర‌బాబు ఆది నుంచి చెప్పిన విష‌యాన్నే ఇప్పుడు అమ‌లు చేశారు.

అందుకే ఇంత హ‌ఠాత్తుగా నిర్ణ‌యం తీసుకున్నారు. 2) ఎంత‌టి వారినైనా వదిలేది లేదు: ఈ విష‌యాన్ని కూడా సీఎం చంద్ర‌బాబు త‌ర‌చుగా చెబుతున్నారు. అయితే.. అధికారులు ఈ విష‌యంలో రాజ‌కీయ నాయ‌కుల‌ను చంద్ర‌బాబు హెచ్చ‌రిస్తున్నార‌ని భావించి ఉంటారు. కానీ, క్షేత్ర‌స్థాయిలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై చంద్ర‌బాబు.. ఎప్పటిక‌ప్పుడు.. ప‌రిశీల‌న చేస్తున్నారు. తాజాగా వెయ్యికి పైగా ఫిర్యాదులు ఒక్క రిజిస్ట్రార్ కార్యాల‌యాలపైనే రావ‌డంతో చెప్ప‌కుండానే చ‌ర్య‌లు తీసుకున్నారు. దీనికి ప్ర‌జ‌ల నుంచి హ‌ర్షం వ్య‌క్తం కావ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 7, 2025 10:27 am

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

40 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

3 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

5 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

12 hours ago