ఇటీవల లండన్ పర్యటనకు వెళ్లేముందు.. సీఎం చంద్రబాబు మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయానికి వచ్చారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ నాయకులకు కొన్ని దిశానిర్దేశాలు చేశారు. ఇదేసమయంలో ప్రజల నుంచి వినతులు కూడా తీసుకున్నారు. వీటిలో ఎక్కువగా రెవెన్యూ పరమైన సమస్యలు.. ముఖ్యంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో జరుగుతున్న అవకతవకలపైనే ఉన్నాయి. వీటిని సావధానంగా విన్న చంద్రబాబు ఎవరినీ హెచ్చరించలేదు. ఎవరినీ ఏమీ అనలేదు.
కానీ, దాని తాలూకు పర్యవసానం మాత్రం ఆ వెంటనే కనిపించింది. హుటాహుటిన ప్రక్షాళనకు దిగారు. ఏసీబీని రంగంలోకి దింపారు. రాష్ట్ర వ్యాప్తంగా రిజిస్ట్రార్ కార్యాలయాల్లో తనిఖీలు ముమ్మరం చేశారు. ఒకే రోజు పలు కార్యాలయాల్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. కోట్ల రూపాయల సొమ్ములు స్వాధీనం చేసుకున్నారు. పలువురు అధికారులపైనా కేసులు నమోదు చేశారు. ఇదేసమయంలో అవకతవకలతో పాటు అనధికార వ్యక్తులు చక్రం తిప్పుతున్న తీరును కూడా తెలుసుకున్నారు.
ఈ మొత్తం వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా రెవెన్యూ యంత్రాంగంలో గుబులు పుట్టించింది. వాస్తవానికి గతంలో చంద్రబాబు ముందు హెచ్చరించేవారు. పనితీరు మార్చుకోవాలని.. ఫిర్యాదులు వస్తున్నాయని చెప్పే వారు. కానీ ఈ దఫా అలాంటి హెచ్చరికలు ఏమీ లేకుండానే నేరుగా రంగంలోకి దిగిపోయారు. ఈ క్రమంలో 2 కీలక విషయాలను ఆయన పరోక్షంగా చెప్పేశారు. 1) ప్రజాసేవలో అక్రమాలకు తావు ఉండదు: ఈ విషయంలో చంద్రబాబు ఆది నుంచి చెప్పిన విషయాన్నే ఇప్పుడు అమలు చేశారు.
అందుకే ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారు. 2) ఎంతటి వారినైనా వదిలేది లేదు: ఈ విషయాన్ని కూడా సీఎం చంద్రబాబు తరచుగా చెబుతున్నారు. అయితే.. అధికారులు ఈ విషయంలో రాజకీయ నాయకులను చంద్రబాబు హెచ్చరిస్తున్నారని భావించి ఉంటారు. కానీ, క్షేత్రస్థాయిలో జరుగుతున్న పరిణామాలపై చంద్రబాబు.. ఎప్పటికప్పుడు.. పరిశీలన చేస్తున్నారు. తాజాగా వెయ్యికి పైగా ఫిర్యాదులు ఒక్క రిజిస్ట్రార్ కార్యాలయాలపైనే రావడంతో చెప్పకుండానే చర్యలు తీసుకున్నారు. దీనికి ప్రజల నుంచి హర్షం వ్యక్తం కావడం గమనార్హం.
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…
గత ఏడాది పవన్ కళ్యాణ్ ఓజితో బ్లాక్ బస్టర్ అందుకున్నారు. కెరీర్ లో మొదటిసారి మూడు వందల కోట్ల క్లబ్బులోకి…
సీనియర్లలో ఎక్కువ వేగంగా సినిమాలు చేస్తున్న హీరోల్లో మొదటి స్థానం బాలకృష్ణకే ఇవ్వాలి. ఎందుకంటే భోళాశంకర్ తర్వాత చిరంజీవి ఏకంగా…
ఇప్పటి వరకు ఒక లెక్క.. ఇక నుంచి మరో లెక్క.. అన్నట్టుగా వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ పరిస్థితి…
పెద్ది మొదటి వారం పూర్తి చేసుకుని సెకండ్ వీక్ లో అడుగు పెట్టింది. మూడు వందల యాభై కోట్ల వైపు…
ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ తన పేరు వెనుక ఉన్న ఆసక్తికరమైన కథను వెల్లడించారు. జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో…