Political News

మెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్

విశాఖలో 15 బిలియన్ డాలర్ల భారీ పెట్టుబడితో ఏఐ డేటా సెంటర్ ను గూగుల్ ఏర్పాటు చేయబోతున్న సంగతి తెలిసిందే. భారత ఏఐ రంగంలో ఇది ఒక చరిత్రాత్మక మలుపు అని, ఏఐ రంగానికి ప్రపంచ కేంద్రంగా భారత్ మారబోతోందని ఏఐ నిపుణులు చెబుతున్నారు. అమెరికా వెలుపల ఏఐ రంగంలో గూగుల్ పెట్టిన అతి భారీ పెట్టుబడి, అతి పెద్ద డేటా సెంటర్ ఇదే కాబోతోందని ఐటీ రంగం కోడై కూస్తోంది. అంతేకాదు, గూగుల్ తర్వాత మరెన్నో ప్రముఖ ఏఐ కంపెనీలు భారత్ వైపు రావడం ఖాయమని ఏపీ ప్రభుత్వం కాన్ఫిడెంట్ గా ఉంది. ఈ క్రమంలోనే ఆ డేటా సెంటర్ క్రెడిట్ కొట్టేయాలని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్ భావిస్తున్నారు.

కొద్ది రోజుల క్రితం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గూగుల్ డేటా సెంటర్ పై మాట్లాడిన జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ హయాంలోనే ఆ డేటా సెంటర్ కు బీజం పడిందని, అదానీకి కూటమి ప్రభుత్వం కనీసం థ్యాంక్స్ చెప్పలేదని అన్నారు. అయితే, తాజాగా జగన్ మరో అడుగు ముందుకు వేసి అసలు గూగుల్ డేటా సెంటర్ క్రెడిట్ అంతా వైసీపీ ప్రభుత్వానిదేనని వితండ వాదన చేస్తున్నారు. గూగుల్ విషయంలో చంద్రబాబు క్రెడిట్ చోరీ చేశారని చెప్పారు.

అంతేకాదు, గూగుల్ ను ఏపీకి తెచ్చేందుకు చంద్రబాబు చేసింది ఏముందని జగన్ అంటున్నారు. సింగపూర్ నుంచి కేబుల్స్ తెచ్చింది వైసీపీ అని, అదానీ–గూగుల్ మధ్య 2022లోనే నోయిడా డేటా సెంటర్ అగ్రిమెంట్ ఉందని చెబుతున్నారు. తమ హయాంలోనే ఇక్కడ భూములిచ్చామని, ఆ రోజు పడ్డ అడుగులు ఇప్పుడు గూగుల్ కు బాటలు వేశాయని అంటున్నారు. ఇలా మెల్లమెల్లగా ప్లేటు ఫిరాయిస్తున్న జగన్ పై టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.

అయితే, జగన్ హయాంలో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడిన సంగతి ఆయన మరిచిపోయినట్లు కనిపిస్తోందని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. చంద్రబాబు బ్రాండ్ ఇమేజ్ వల్లే గూగుల్ తో పాటు ఇతర కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వస్తున్నాయని తెలుగు తమ్ముళ్లు చెబుతున్నారు. క్రెడిట్ కొట్టేయాల్సిన అవసరం చంద్రబాబుకు లేదని, ప్రపంచవ్యాప్తంగా చంద్రబాబుకు ఉన్న క్రెడిబిలిటీనే ఆయనకు ఆటోమేటిక్ గా క్రెడిట్ తెచ్చిపెడుతుందని అంటున్నారు.

This post was last modified on November 6, 2025 11:10 pm

Share
Show comments
Published by
Satya
Tags: Jagan

Recent Posts

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

1 minute ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

22 minutes ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

3 hours ago

మహిళా డాక్టర్ హిజాబ్ ను తొలగించిన సీఎం

బిహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. సోమవారం పట్నాలోని ముఖ్యమంత్రి నివాసంలో నిర్వహించిన ప్రభుత్వ కార్యక్రమంలో, నియామక…

5 hours ago

లైలా గాయానికి ఫంకీ మందు పని చేస్తుందా

విశ్వక్ సేన్ కెరీర్లో అతి పెద్ద డిజాస్టర్ లైలా. ఆడవేషం వేసి నరేష్ పాత సినిమా చిత్రం భళారే విచిత్రంలాగా…

8 hours ago