Political News

గ్రామ సచివాలయాలకు కొత్త పేరు, ప్రకటించిన సీఎం బాబు!

ఏపీలో కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామ/ వార్డు సచివాలయాల పేరు మార్చేందుకు నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని సీఎం చంద్రబాబు నాయుడు ఈ రోజు ప్రకటించారు. గ్రామ సచివాలయాల వ్యవస్థ ప్రజలకు మరింత సమర్థవంతంగా సేవలు అందించే విధంగా రూపకల్పన చేయాలి. అందుకే వాటిని విజన్ యూనిట్స్‌గా మార్చుతున్నాం. ఇవి భవిష్యత్తులో ప్రజా సేవలకు కేంద్ర బిందువుగా నిలుస్తాయ ని ఆయన తెలిపారు. మంత్రులు, అన్ని విభాగాల కార్యదర్శులతో సీఎం ఉన్నత స్థాయి భేటీ నిర్వహించారు. జిల్లా కలెక్టర్లు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలో పాల్గొన్నారు.

డేటా డ్రైవన్ గవర్నెన్స్ పై సీఎం సమీక్షించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఏపీలో ప్రతి పౌరుడికి డిజిలాకర్రూపొందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సూచించారు. పౌరుల అన్ని పత్రాలు డిజిలాకర్లో పొందుపరుస్తామన్నారు.  పౌరుల హెల్త్ డేటాను సైతం డిజిలాకర్లో పొందుపరుస్తామన్నారు. పోలీసు కేసులపై కూడా ఆ డిజిలాకర్లో పొందుపరచాలన్నారు. పోలీసు విభాగం వివరాలు డేటా లేక్తో అనుసంధించాలని సూచించారు.

విభాగాల వారీగా టెక్నాలజీ వినియోగానికి ఓనర్షిప్ తీసుకోవాలని అని సీఎం తెలిపారు. సాంకేతికత ద్వారా ప్రజలకు సుపరిపాలన అందిస్తామని అన్నారు. గ్రామ సచివాలయాన్ని విజన్ యూనిట్ గా మార్చి సమర్థవంతంగా వాడాలని సూచించారు. ఇటీవల తుఫాను సమయంలో సాంకేతికతతో ప్రాణ, ఆస్తి నష్టం తగ్గించగలిగామన్నారు. డేటా ఆధారిత పాలన అత్యంత కీలక అంశంగా మారిందని ఆయన తెలిపారు. ఏఐ వాడితే జీవోల ద్వారా లిటిగేషన్లు రాకుండా నివారించవచ్చిని సీఎం అభిప్రాయపడ్డారు.

క్వాంటం కంప్యూటర్ జనవరి నుంచే అమరావతిలో ప్రారంభిస్తామని అన్నారు. 2047 విజన్డాక్యుమెంట్ లక్ష్యాలకు అనుగుణంగా పనిచేయాలని ఆయన సూచించారు.
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలన్నదే అధికారులు, ప్రజాప్రతినిధుల ప్రాధాన్యత కావాలన్నారు. సీఎఫ్ఎంఎస్ వ్యవస్థ ద్వారా సమర్ధంగా వనరుల్ని వినియోగించగలుగుతున్నాం అని తెలిపారు.

గత ప్రభుత్వం చేసిన విధ్వంసాన్ని చక్కదిద్దుతూ ఉన్న సమస్యల్ని ఒక్కొక్కటిగా పరిష్కరిస్తున్నాం అని సీఎం తెలిపారు. నిర్దిష్ట ప్రమాణాలకు అనుగుణంగానే ప్రభుత్వం పౌరసేవలు అందించాల్సి ఉందన్నారు. ప్రతీ నియోజకవర్గానికీ ఓ సీనియర్ అధికారి నేతృత్వంలో టాస్క్ ఫోర్సు ఏర్పాటు చేసి విజన్ ప్లాన్ అమలు చేస్తాం అన్నారు. ఆర్టీజీఎస్ ద్వారా సేకరించిన సమాచారాన్ని విశ్లేషించి ఆయా శాఖలకు అప్పగిస్తున్నాం.. దానికి అనుగుణంగానే నిర్ణయాలు వేగంగా తీసుకోవాల్సి ఉంటుందని సీఎం అన్నారు.

This post was last modified on November 6, 2025 6:04 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

ఆరెంజ్ ఎన్నిసార్లు చూస్తారయ్యా

కొంచెం ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్తే మగధీర లాంటి ఇండస్ట్రీ హిట్ తర్వాత వచ్చిన సినిమాగా ఆరెంజ్ మీద ఓ…

38 minutes ago

పలాస దర్శకుడికి విషమ పరీక్ష

ఏడేళ్ల క్రితం వచ్చిన పలాసతో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు కరుణ కుమార్. తక్కువ ఖర్చులో స్టార్ క్యాస్టింగ్ లేకుండా…

3 hours ago

నిజాం గడ్డపై ‘కింగ్’ కన్ను

అక్కినేని నాగార్జున హీరోనే కాదు.. నిర్మాత, డిస్ట్రిబ్యూటర్ కూడా. ఐతే ఒకప్పటితో పోలిస్తే గత కొన్నేళ్లలో ఆయన అన్నపూర్ణ సంస్థలో…

5 hours ago

మహేష్ కోసం వాయిస్ మార్చమన్న కృష్ణ

కొన్ని సినిమాలు హీరోలకు నటులుగా మంచి పేరు తెచ్చిపెడతాయి. కానీ బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితాన్ని అందుకోవు. మహేష్ బాబు…

10 hours ago

వైసీపీలా చెడ్డపేరు తెచ్చుకోవద్దు: పవన్ హెచ్చరిక

ఏపీలో మద్యం అమ్మకాల విషయంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రభుత్వ నిబంధనలను ఎవరూ పట్టించుకోవడం…

11 hours ago

టాక్సిక్ ఎందుకు భయపడటం లేదు

దురంధర్ 2 ది రివెంజ్ దెబ్బకు అడివి శేష్ డెకాయిట్ వాయిదా పడింది. ఇదే రూటులో టాక్సిక్ కూడా మనసు…

12 hours ago