Political News

చెత్త‌-స‌త్తా.. తేల్చుకుందాం: కేటీఆర్‌

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పోలింగ్‌కు మ‌రో ఐదు రోజుల స‌మ‌య‌మే ఉన్న నేప‌థ్యంలో ప్ర‌ధాన పార్టీల మ‌ధ్య రాజ‌కీయ వేడి మ‌రింత పెరిగింది. ఇప్ప‌టి వ‌ర‌కు ఇంటింటి ప్ర‌చారం, ప్ర‌సంగాలు చేసుకున్న నాయ‌కులు.. తాజాగా ప్ర‌జ‌ల‌ను మ‌రింత‌గా త‌మ‌వైపు తిప్పుకొనే ప్ర‌య‌త్నంలో స‌వాళ్లు-ప్ర‌తిస‌వాళ్లు రువ్వుకుంటున్నారు. ఇదేస‌మ‌యంలో జూబ్లీహిల్స్ అభివృద్ధిపైనా ప్ర‌త్య‌క చ‌ర్చ‌కు దిగుతున్నారు. తాజాగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయ‌కుడు కేటీఆర్‌.. సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించి స‌వాల్ రువ్వారు.

జూబ్లీహిల్స్‌లో ఎవ‌రు అభివృద్ధి చేశారో.. ఎవ‌రు ప్ర‌జ‌ల‌కు మేలు చేశారో చ‌ర్చించేందుకు తాము సిద్ధ‌మ‌ని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి ముందుకు రావాల‌ని స‌వాల్ ఇచ్చారు. ఎవ‌రిది చెత్త పాల‌నో.. ఎవ‌రిది స‌త్తా పాల‌నో తేల్చుకుందామ‌ని అన్నారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న “జూబ్లీహిల్స్ ప్ర‌గ‌తి నివేదిక‌” పేరుతో ఒక నివేదిక‌ను విడుద‌ల చేశారు. గ‌త బీఆర్ఎస్ పాల‌న‌లో న‌గ‌రంలో ఎలాంటి అభివృద్ధి చేశామో చూడాల‌ని ఈ సంద‌ర్భంగా ఆయ‌న ప‌వ‌ర్ పాయింట్ ప్ర‌జెంటేష‌న్ కూడా ఇచ్చారు. జూబ్లీహిల్స్‌లో ర‌హ‌దారుల నుంచి డ్రైనేజీల వ‌ర‌కు ప‌లు అంశాల‌ను ప్ర‌స్తావించారు.

ఈ క్ర‌మంలోనే కాంగ్రెస్ రెండేళ్ల‌లో ఏం చేశార‌ని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ఒక్క రోడ్డ‌యినా వేశారా? ఒక్క బ్రిడ్జి అయినా క‌ట్టారా? అని కేటీఆర్ ప్ర‌శ్నించారు. ముఖ్య‌మంత్రి ప‌ద‌విలో ఉండి.. త‌న‌పై వ్య‌క్తిగ‌త విమ‌ర్శ‌లు చేశార‌ని.. అయినా తాను సీఎం ప‌ద‌వికి గౌర‌వం ఇస్తాన‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. రెండేళ్ల‌లో కాంగ్రెస్ ఏదైనా మంచిచేసి ఉంటే చెప్పాల‌ని స‌వాల్ రువ్వారు. ఎక్క‌డైనా స‌రే.. చ‌ర్చకు రెడీగా ఉన్నామ‌ని కేటీఆర్ వ్యాఖ్యానించారు. ముఖ్య‌మంత్రిగానే కాకుండా.. శాఖ‌ల ప‌రంగా కూడా రేవంత్ రెడ్డి విఫ‌ల‌మ య్యార‌ని కేటీఆర్ విమ‌ర్శించారు.

Satya

Recent Posts

దేవర 2 ఆశలు వదులుకోక తప్పదా

జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ఎదురు చూస్తున్న అప్డేట్ దేవర 2. మొదటి భాగం వచ్చి రెండేళ్లు దాటిపోతున్నా ఇప్పటికీ సీక్వెల్…

35 minutes ago

వీరభద్రుడిని వాయించేస్తున్నారు

కొన్ని సినిమాలకు బాక్సాఫీస్ దగ్గర పరిస్థితులు కలిసొచ్చి యావరేజ్ కంటెంట్‌తోనే ఇరగాడేస్తుంటాయి. రివ్యూలు, టాక్ అంతంతమాత్రంగా ఉన్నా సరే.. సినిమాకు…

1 hour ago

సర్వం సమంత మయం… బంగారం ప్రచారం

జూన్ 19 విడుదల కాబోతున్న మా ఇంటి బంగారం కౌంట్ డౌన్ మొదలైపోయింది. కేవలం నాలుగు రోజుల సమయం మాత్రమే…

1 hour ago

హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్న హీరోయిన్

కథానాయికగా పరిచయం అయింది తమిళంలోనే అయినా.. తెలుగులోనే ఎక్కువ సినిమాలు చేసి గుర్తింపు సంపాదించింది నివేథా పెతురాజ్. మెంటల్ మదిలో,…

1 hour ago

ట్రంప్ మాత్రమే కాదు ఇరాన్ కూడా చెప్పింది యుద్ధం ముగిసిందని!

ఒకప్పుడు అమెరికా అధ్యక్షుడు హోదాలో ఉన్న వ్యక్తి నోటి నుంచి ఒక మాట వస్తే.. అదో నిజమన్నట్లుగా ఉండేది. అలాంటి…

1 hour ago

కాక్రోచ్ పార్టీపై పవన్ ఫస్ట్ రియాక్షన్

ఢిల్లీలో 'జాతీయ సమగ్రత కోసం సేన ప్రస్థానం' పేరుతో 3 రోజుల పాటు సభలను నిర్వహించాలని జనసేన నిర్ణయించిన సంగతి…

2 hours ago