Political News

అనుకోని విప‌త్తులు: ఏపీకి ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ట్లేదుగా!

ఏపీలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్పడిన త‌ర్వాత‌.. సుప‌రిపాల‌న అందించేందుకు.. గ‌త ప్ర‌భుత్వం చేసిన త‌ప్పుల‌ను స‌రిదిద్దుకుని, ఆర్థికంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లాల‌న్న విధానంతో ప్ర‌భుత్వం ముందుకు సాగుతోంది. అయితే.. స‌ర్కారుకు ఊపిరి స‌ల‌ప‌నివ్వ‌ని విధంగా ప్ర‌కృతి విప‌త్తులు, మాన‌వ త‌ప్పిదాలు జ‌రుగుతున్నాయి. దీంతో ఇటు ప్ర‌జ‌ల‌కు.. అటు స‌ర్కారుకు కూడా ఇబ్బందిక‌ర ప‌రిస్థితి ఏర్ప‌డుతోంద‌న్న‌ది వాస్త‌వం.

వ‌ర‌ద‌లు.. వ‌ర్షాలు.. తుఫాన్లు వంటివి కామ‌న్‌గా వ‌స్తాయి. వీటిని అడ్డుకునే ప్ర‌య‌త్నం ఎవ‌రూ చేయ‌లేరు. కానీ, న‌ష్టం రాకుండా.. ప్ర‌జ‌ల‌కు క‌ష్టం క‌ల‌గ‌కుండా చ‌ర్య‌లు తీసుకుని విప‌త్తుల నుంచి బ‌య‌ట ప‌డొచ్చు. ప్ర‌భుత్వం దీనినే అనుస‌రిస్తోంది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు రెండు తుఫాన్లు వ‌చ్చినా.. ప్రాణ న‌ష్టం జ‌ర‌గ‌లేదు. ఆస్తులు, పొలాలు.. పంట‌లు, ఇళ్లు వంటివాటికి న‌ష్టం వాటిల్లింది. దీనికి సంబంధించిన ప‌రిహారం ప్ర‌భుత్వం ఇస్తోంది.

ఇక‌, మాన‌వ త‌ప్పిదాల కారణంగా చోటు చేసుకుంటున్న ప‌రిణామాలు.. కొన్ని ఉన్నాయి. గ‌త ఏడాది వైకుంఠ ద్వార ద‌ర్శ‌నాల స‌మ‌యంలో తిరుప‌తిలో ఏర్పాటు చేసిన టోకెన్ల క్యూలైన్ల‌లో తొక్కిస‌లాట జ‌రిగింది. అప్ప‌ట్లో ఆరుగురు మృతి చెందారు. ఇది పూర్తిగా అధికారుల అల‌స‌త్వం, ముంద‌స్తు వ్యూహం కొర‌వ‌డిన కార‌ణంగానే జ‌రిగింద‌ని నివేదిక‌లు తేల్చాయి. దీంతో ఇద్ద‌రు అధికారుల‌ను విధుల నుంచి స‌స్పెండ్ చేశారు.

ఆ త‌ర్వాత‌.. సింహాద్రి అప్ప‌న్న చంద‌నోత్స‌వ స‌మ‌యంలో పిట్ట‌గోడ కూలిపోయి.. భ‌క్తుల‌ పై పడిన ఘ‌ట‌న‌లో ఏడుగురు భ‌క్తులు మృతి చెందారు. ఈ విష‌యంలోనూ ఆల‌య అధికారుల త‌ప్పులు ఉన్నాయ‌ని గుర్తించిన ప్ర‌భుత్వం వారి పై చ‌ర్య‌లు తీసుకుంది. ఇక‌, ఇటీవ‌ల క‌ర్నూలులో చోటు చేసుకున్న బ‌స్సు ప్ర‌మాద ఘ‌ట‌న కూడా.. తీవ్రంగా క‌ల‌చి వేసింది 19 మంది కాలి బుగ్గ‌య్యారు. ఇక‌, ఇప్పుడు కాశీబుగ్గ ఘ‌ట‌న‌.. కూడా ఓ ప్రైవేటు వ్య‌క్తి నిర్ల‌క్ష్యం కార‌ణంగా చోటు చేసుకుంద‌ని అధికారులు చెబుతున్నారు. మొత్తంగా ఆయా ఘ‌ట‌నలు.. ఇటు ప్ర‌భుత్వాన్ని, అటు ప్ర‌జ‌ల‌ను కూడా ఊపిరి తీసుకోలేనంతగా బాధిస్తున్నాయ‌నే చెప్పాలి.

This post was last modified on November 2, 2025 5:00 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నియోజకవర్గాల పెంపు: ఒరిగేదేంటి.. జరిగేదేంటి?

దేశవ్యాప్తంగా అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల పెంపు వ్యవహారం ఇప్పుడు రాజకీయ పార్టీల మధ్య చర్చకు దారితీసింది. ప్రాంతీయ పార్టీలు వీటికి…

4 hours ago

జ‌మిలికి జై కొట్టాలా?.. కాంగ్రెస్ అంత‌ర్మ‌థ‌నం!

దేశంలో రెండు కీల‌క అంశాల‌ను తేల్చేసేందుకు కేంద్రంలోని న‌రేంద్ర మోడీ సర్కారు సిద్ధ‌మైంది. 1) జ‌మిలి ఎన్నిక‌లు. 2) పార్ల‌మెంటు…

8 hours ago

అమ‌రావ‌తి ఆగ‌ద‌ని తెలిసీ.. జ‌గ‌న్ `రాజ‌కీయం`

ఏపీ రాజధాని అమరావతి నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. చాలా వేగంగా కూడా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం ఏర్పడిన కూటమి ప్రభుత్వం అమరావతి నిర్మాణాలను…

10 hours ago

జగిత్యాల టాక్: జీవన్ రెడ్డి రాంగ్ స్టెప్..!

జగిత్యాల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి జీవన్ రెడ్డి తాజాగా బీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు. ఆ పార్టీ అధినేత…

10 hours ago

ఆ క‌మెడియ‌న్ కోసం వెతుకుతున్న‌ మెగా ఫ్యాన్స్

జ‌నాల‌ను న‌వ్వించ‌డం కోసం సెల‌బ్రెటీల వ్య‌క్తిగ‌త జీవితాల్లోకి దూరితే.. ప‌రిణామాలు ఎలా ఉంటాయో చెప్ప‌డానికి ఈ ఉదంతం ఉదాహ‌ర‌ణ‌. హైద‌రాబాద్‌కు…

11 hours ago

వెయ్యి కోట్ల ఒప్పందం… ముస్లిం ఓట్ల కోస‌మేనా?

దేశవ్యాప్తంగా మరో రెండు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంది. వీటిలో ప్రధానంగా బిజెపి ఎక్కువగా ఆశలు పెట్టుకున్న రాష్ట్రం…

11 hours ago