Political News

బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

రాందేవ్ బాబాగా ప్ర‌చారంలో ఉన్న ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ క్రియా యోగ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడ‌ద చుట్టుకుంది. పతంజ‌లి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు.. మ‌హిళ‌లు, పురుషుల సౌంద‌ర్య సాధ‌నాల వ్యాపారాన్ని రాందేవ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా ఈయ‌న విమ‌ర్శ‌లలో చుట్టుకుంటున్నారు.

ఇదిలావుంటే.. ట్రంప్ విధించిన సుంకాల‌తో ప‌లు వ్యాపార‌ల‌పై ప్ర‌భావం ప‌డిన‌ట్టుగానే.. పతంజ‌లి ఉత్ప‌త్తుల పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డింది. గ‌త రెండు నెల‌ల కాలంలో ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల అమెరికా ఎగుమ‌తులు.. 35 శాతానికి ప‌డిపోయాయి. ఇది వ్యాపార ప‌రంగా.. రాందేవ్‌కు తీవ్ర దెబ్బ‌తగిలేలా చేసింది. దీంతో రాందేవ్ బాబా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ర‌చుగా విమ‌ర్శించే మోడీ విధానాల‌ను మెచ్చుకోవ‌డం.. తాను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారుతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్నార‌న్న వంక‌తో భార‌త్‌పై ట్రంప్ సుంకాల కొర‌డా ఝ‌ళిపించారు. దీనివల్ల భార‌త్లోని అనేక ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ముఖ్యంగా సౌంద‌ర్య‌సాధ‌నాలు, మందులు, ఆక్వా ఉత్ప‌త్తులు, ఆహారం వంటివాటిపై సుంకాల ప్ర‌భావం ఉంది. దీంతో ప్ర‌ధాని మోడీ యూట‌ర్న్ తీసుకుని అమెరికా జోలికి పోకుండా.. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న గ‌త రెండు మాసాలుగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

అయితే.. ఇలా స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డం ద్వారా దేశ ఆర్థిక ప‌రిస్థితి ఏమేర‌కు ప్ర‌భావితం అవుతుంద‌ని గ‌తంలో రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం మౌనంగాఉంది. అయితే.. ఇప్పుడు సుంకాల‌ బాధ త‌న‌వ‌ర‌కు వ‌చ్చే స‌రికి బాబా యూట‌ర్న్ తీసుకున్నారు. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగం మంచిదేన‌ని.. త‌ద్వారా ప్ర‌పంచ దేశాలకు ముకుతాడు వేయొచ్చన్నారు. తాను కూడా స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారి.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో ట్రంప్ చేస్తున్న‌ది సుంకాల పెంపు కాద‌న్న ఆయ‌న‌.. ఆర్థిక యుద్ధ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 2, 2025 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

2 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

3 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

3 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

5 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

5 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

6 hours ago