Political News

బాబా వారికి ట్రంప్ సెగ‌.. మోడీకి మ‌ద్ద‌తు!

రాందేవ్ బాబాగా ప్ర‌చారంలో ఉన్న ప‌తంజ‌లి సంస్థ వ్య‌వ‌స్థాప‌కుడు, ప్ర‌ముఖ క్రియా యోగ ద్వారా ప్ర‌పంచ వ్యాప్తంగా గుర్తింపు పొందిన ఆయ‌న‌కు.. తాజాగా అమెరికా అధ్య‌క్షుడు డొనాల్డ్ ట్రంప్ విధిస్తున్న సుంకాల బెడ‌ద చుట్టుకుంది. పతంజ‌లి సంస్థ ద్వారా ఆయుర్వేద మందులు.. మ‌హిళ‌లు, పురుషుల సౌంద‌ర్య సాధ‌నాల వ్యాపారాన్ని రాందేవ్ చేస్తున్న విష‌యం తెలిసిందే. త‌ర‌చుగా ఈయ‌న విమ‌ర్శ‌లలో చుట్టుకుంటున్నారు.

ఇదిలావుంటే.. ట్రంప్ విధించిన సుంకాల‌తో ప‌లు వ్యాపార‌ల‌పై ప్ర‌భావం ప‌డిన‌ట్టుగానే.. పతంజ‌లి ఉత్ప‌త్తుల పై కూడా తీవ్ర ప్ర‌భావం ప‌డింది. గ‌త రెండు నెల‌ల కాలంలో ప‌తంజ‌లి ఉత్ప‌త్తుల అమెరికా ఎగుమ‌తులు.. 35 శాతానికి ప‌డిపోయాయి. ఇది వ్యాపార ప‌రంగా.. రాందేవ్‌కు తీవ్ర దెబ్బ‌తగిలేలా చేసింది. దీంతో రాందేవ్ బాబా తాజాగా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ క్ర‌మంలోనే ఆయ‌న త‌ర‌చుగా విమ‌ర్శించే మోడీ విధానాల‌ను మెచ్చుకోవ‌డం.. తాను స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారుతాన‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

ర‌ష్యా నుంచి చ‌మురు కొనుగోలు చేస్తున్నార‌న్న వంక‌తో భార‌త్‌పై ట్రంప్ సుంకాల కొర‌డా ఝ‌ళిపించారు. దీనివల్ల భార‌త్లోని అనేక ప‌రిశ్ర‌మ‌ల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ముఖ్యంగా సౌంద‌ర్య‌సాధ‌నాలు, మందులు, ఆక్వా ఉత్ప‌త్తులు, ఆహారం వంటివాటిపై సుంకాల ప్ర‌భావం ఉంది. దీంతో ప్ర‌ధాని మోడీ యూట‌ర్న్ తీసుకుని అమెరికా జోలికి పోకుండా.. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగాన్ని పెంచేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. ఇదే విష‌యాన్ని ఆయ‌న గ‌త రెండు మాసాలుగా ప్ర‌చారం కూడా చేస్తున్నారు.

అయితే.. ఇలా స్వ‌దేశీ ఉత్ప‌త్తుల‌ను పెంచ‌డం ద్వారా దేశ ఆర్థిక ప‌రిస్థితి ఏమేర‌కు ప్ర‌భావితం అవుతుంద‌ని గ‌తంలో రాందేవ్ బాబా వ్యాఖ్యానించారు. దీనిపై కేంద్రం మౌనంగాఉంది. అయితే.. ఇప్పుడు సుంకాల‌ బాధ త‌న‌వ‌ర‌కు వ‌చ్చే స‌రికి బాబా యూట‌ర్న్ తీసుకున్నారు. స్వ‌దేశీ ఉత్ప‌త్తుల వినియోగం మంచిదేన‌ని.. త‌ద్వారా ప్ర‌పంచ దేశాలకు ముకుతాడు వేయొచ్చన్నారు. తాను కూడా స్టార్ క్యాంపెయిన‌ర్‌గా మారి.. ప్ర‌చారం చేస్తాన‌ని చెప్పారు. ఇదేస‌మ‌యంలో ట్రంప్ చేస్తున్న‌ది సుంకాల పెంపు కాద‌న్న ఆయ‌న‌.. ఆర్థిక యుద్ధ‌మ‌ని సంచ‌ల‌న వ్యాఖ్యలు చేయ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on November 2, 2025 3:48 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

1 hour ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

4 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

5 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

7 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

9 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

9 hours ago