Political News

పీకే మ‌ద్ద‌తు దారు హ‌త్య, మారిన రాజ‌కీయం

బీహార్ అసెంబ్లీ ఎన్నిక‌ల ప్ర‌చారానికి మ‌రో వారం రోజుల్లో తెర‌ప‌డ‌నుంద‌న‌గా.. తీవ్ర‌సంచ‌ల‌న ఘ‌ట‌న చో టు చేసుకుంది. ఎన్నిక‌ల సంరంభం ప్రారంభ‌మైన త‌ర్వాత‌.. అంతో ఇంతో ప్ర‌శాంతంగానే పార్టీల‌ ప్ర‌చా రాలు సాగుతున్నాయి. ఇలాంటి స‌మ‌యంలో మ‌రో వారంలోనే ఈ ప్ర‌చారానికి తెర‌ప‌డి ప్ర‌జ‌లు కొత్త ప్ర‌భుత్వాన్ని ఎన్నుకునేందుకు రెడీ అయ్యారు. ఈ క్ర‌మంలో తాజాగా రాజ‌కీయ వ్యూహ‌క‌ర్త‌, జ‌న్ సురాజ్ పార్టీ అధినేత ప్ర‌శాంత్ కిశోర్ మ‌ద్ద‌తు దారు.. ఆ పార్టీ అభ్య‌ర్థి బంధువు దారుణ హ‌త్య‌కు గుర‌య్యారు.

అది కూడా.. ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న స‌మ‌యంలో.. వేల మంది ప్ర‌జ‌లు హాజ‌రైన స‌మ‌యంలో శనివారం సాయంత్రం గుంపుగా వ‌చ్చిన కొంద‌రు వ్య‌క్తులు.. జ‌న్ సురాజ్ పార్టీ కార్య‌క‌ర్త‌ల‌తో ఘ‌ర్ష‌ణ‌కు దిగారు. ఈ క్ర‌మంలో ఒక‌రు.. తుపాకీతో కాల్పుల‌కు దిగారు. ఈ ఘ‌ట‌న‌లో మొకామా నియోజ‌క‌వ‌ర్గం జ‌న్ సురాజ్ పార్టీ అభ్య‌ర్థి పీయూష్ ప్రియ‌ద‌ర్శి సొంత మామ‌గారు, పీకేకు స‌ల‌హాదారుగా, పార్టీలో కీల‌క రోల్ పోషిస్తున్న దులార్ చంద్ కు తూటా త‌గిలింది. ఆయ‌న అక్క‌డిక‌క్క‌డే మృతి చెందారు.

ఈ ఘ‌ట‌న రాష్ట్ర వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపింది. హుటాహుటిన రంగంలోకి దిగిన పోలీసులు కాల్పులు జ‌రిపిన వ్య‌క్తుల‌ను అరెస్టు చేయ‌గా.. మూలాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఇదే మొకామా నియోజ‌క‌వ‌ర్గం నుంచి బ‌రిలో ఉన్న అధికార జేడీయూ అభ్య‌ర్థి అనంత్ సింగ్ హ‌స్తం ఉంద‌ని పోలీసులు గుర్తించారు. ఆ వెంట‌నే ఆయ‌న‌ను ఆదివారం తెల్ల‌వారు జామున అరెస్టు చేశారు. త‌న‌కు పోటీ ఇస్తున్నందునే.. ఈ కాల్పులు జ‌రిపించిన‌ట్టు సింగ్ పోలీసులు తెలిపార‌ని స‌మాచారం.

రాజ‌కీయం యూట‌ర్న్‌..

తాజాగా జ‌రిపిన కాల్పుల ఘ‌ట‌న‌తో ఇప్ప‌టి వ‌ర‌కు.. ఉన్న రాజ‌కీయ ప్ర‌చారంలో యూట‌ర్న్ చోటు చేసుకుంది. ఇప్ప‌టి వ‌ర‌కు జంగిల్ రాజ్ అంటూ.. ఆర్జేడీపై విమ‌ర్శ‌లు గుప్పిస్తున్న జేడీయూ, బీజేపీల‌ను కార్న‌ర్ చేస్తూ.. కాంగ్రెస్‌, ఆర్జేడీ స‌హా ప్ర‌శాంత్ కిశోర్ పార్టీలు నిప్పులు చెరుగుతున్నాయి. తాజా హ‌త్య ఘ‌ట‌న అనంత‌రం.. ఎన్నిక‌ల సంఘం మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్న‌ట్టు ప్ర‌క‌టించింది. కాగా, వ‌చ్చే నెల 9, 11 న రెండు ద‌శ‌ల్లో బీహార్ ఎన్నిక‌లు జ‌ర‌గ‌నున్నాయి.

This post was last modified on November 2, 2025 3:40 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`పీపీపీ`కి కేంద్రం అండ‌… బాబుకు భ‌రోసా… !

ప్రైవేట్ పబ్లిక్ పార్ట్నర్ షిప్(పీపీపీ) ద్వారా రాష్ట్రంలో మెడికల్ కాలేజీలతో పాటు పర్యాటక ప్రాంతాలను కూడా అభివృద్ధి చేయాలని సీఎం…

5 minutes ago

మిథున్ రెడ్డి ఆస్తులు ఎలా పెరిగాయ్.. హాట్ టాపిక్..!

వైసీపీ పార్లమెంట్ సభ్యుడు, సీనియర్ నేత మిథున్ రెడ్డి ఆస్తులు భారీగా పెరిగాయని పేర్కొంటూ ఏడిఆర్ సర్వే తాజాగా వెల్లడించింది.…

43 minutes ago

లేడీ డైరెక్టర్ వేసిన డేరింగ్ స్టెప్

టాక్సిక్ టీజర్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా కారులో రొమాన్స్ పెట్టి దాని ద్వారా స్మశానంలో…

3 hours ago

ఎవరెస్ట్ బరువు మోస్తున్న మారుతీ సాబ్

ఇంకొద్ది గంటల్లో రాజా సాబ్ ప్రీమియర్లు ప్రారంభం కాబోతున్నాయి. జీవో త్వరగా రావడంతో ఆంధ్రప్రదేశ్ బుకింగ్స్ వేగంగా ఉండగా తెలంగాణది…

4 hours ago

రవితేజ వారి ‘మంచు’ పంచ్ చూశారా?

ఈ సంక్రాంతికి ‘మాస్ రాజా’ ట్యాగ్ తీసేసి.. ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ అనే పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్‌తో ప్రేక్షకుల ముందుకు…

5 hours ago

సినిమా వాయిదా… 60 కోట్ల రీఫండ్

అంతా అనుకున్న ప్రకారం జరిగితే తమిళనాడు థియేటర్ల దగ్గర ఈపాటికి పండుగ వాతావరణం ఉండేది. రేపటి ఉదయం ‘జననాయగన్’ రిలీజ్…

5 hours ago