ఈ మాట ఎవరో కాదు.. పార్టీనాయకులు, కార్యకర్తలే కోరుతున్నారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి దారుణంగా ఉందని.. రైతులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారని.. కొందరు నేతలు సోషల్ మీడియాలో సంబంధిత వీడియోలను పోస్టు చేస్తున్నారు. ఇక ప్రధాన మీడియా కూడా ఇలాంటి వార్తలను ప్రస్తావిస్తోంది. దీంతో పరిస్థితి చేయి దాటకముందే… సీఎం రేవంత్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటించి.. అన్నదాతలకు భరోసా ఇవ్వాల్సిన అవసరం ఉందనే మాట సర్వత్రా పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది.
ఏం జరిగింది?
మొంథా తుఫాను ప్రభావంతో కురిసిన ఎడతెరిపి లేని వర్షాలతో ఖమ్మం, మహూబూబాబాద్, హుస్నా బాద్ సహా.. పలు ప్రాంతాల్లోని పంటలునీట మునిగాయి. సరే.. ఇది ఇలా ఉంటే.. మార్కెట్ యార్డులకు తీసుకు వచ్చి.. గత కొంతకాలంగా కొనుగోళ్ల కోసంఎదురు చూస్తున్న ధాన్యం రాసులు కూడా నీట కొట్టుకుపోయాయి. ఇది రైతన్నల కంట కన్నీరు కారిస్తోంది. కొట్టుకుపోతున్న ధాన్యాన్ని రైతులు.. పట్టుకుని.. సంచుల్లోకి ఎక్కిస్తున్న దృశ్యాలు.. అదేసమయంలో సర్కారు ఆదుకోవాలని వారు పెడుతున్న శోకాలు కూడా.. వీడియోల రూపంలో వైరల్ అవుతున్నాయి.
ఇక, ఆయా ప్రాంతాలను పరిశీలించేందుకు వస్తున్న అధికారులను రైతులు చుట్టుముట్టి తమ ఆవేదనను వెల్లడిస్తున్నారు. హుస్నాబాద్లో అయితే.. ఓ మహిళా రైతు.. తన కష్టాన్ని వివరిస్తూ కలెక్టర్ పాదాలు పట్టుకున్నారు. పిల్ల పెళ్లి చేయాల్సివుందని.. ఈ ధాన్యం అమ్మితే వచ్చే నిధులతో పెళ్లి చేయాలని అనుకున్నామని.. ఇప్పుడు ధాన్యం నీటి పాలైందని.. తమకు ఎవరు న్యాయం చేస్తారని.. ఆమె గుండెలు బాదుకుంటూ.. కలెక్టర్ పాదాలపై పడ్డారు. ఆమెను సముదాయించలేక కలెక్టర్ తీవ్ర ప్రయాసకు గురయ్యారు.
ఇది ఒక్కటే కాదు.. వరద ప్రభావిత ప్రాంతాలు.. తీవ్ర వర్షాలతో నీట మునిగిన ప్రాంతాల్లోనూ రైతులు ఇదే విధంగా విలపిస్తున్నారు. ఈ పరిణామాలపై సీఎం రేవంత్ స్పందించి.. క్షేత్రస్థాయిలో పర్యటిస్తే.. రైతులకు భరోసా కలుగుతుందని పార్టీ నాయకులు చెబుతున్నారు. లేకపోతే.. విపక్షాలకు అవకాశం ఇచ్చినట్టు అవుతుందని చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం రేవంత్ రెడ్డి స్పందించి.. క్షేత్రస్తాయిలో పర్యటించాలని కోరుతున్నారు. కేవలం ఆఫీసులో కూర్చుని ఆదుకుంటామంటే పరిస్థితి చేయి దాటుతుందని కూడా చెబుతున్నారు.
శుక్రవారం విడుదలైన లెనిన్ దూకుడు బాక్సాఫీస్ వద్ద కొనసాగుతోంది. తొలి రోజు పదమూడు కోట్లకు పైగా వసూలు చేసి శని…
ఏపీ రాజధాని అమరావతిలో శనివారం తెల్లవారు జాము నుంచి పోలీసులు అధికారులు పెద్ద ఎత్తున మోహరించారు. ఈ ప్రాంతంలో రాజధాని…
సంగీత ప్రపంచాన్ని దిగ్భ్రాంతికి గురి చేస్తూ గాన కోకిల ఎస్ జానకి చివరి శ్వాస తీసుకున్నారు. గత కొంత కాలంగా…
వైసీపీ అధినేత జగన్పై సీఎం చంద్రబాబు షాకింగ్ కామెంట్స్ చేశారు. తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా షాబాద్లో ఓ వ్యక్తి ఆరుగురిని…
ఏపీలో ఆసక్తి రేకెత్తించిన జోసెఫ్ రావణ్ అలియాస్ ప్రశ్న రావణ్ వ్యవహారంపై కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి. జనసేన అదినేత,…
అమెరికా అధ్యక్షుడి హోదాలో డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న విచిత్రమైన నిర్ణయాలతో ఆ దేశ ప్రజలతో పాటు ఆ దేశంలోని విదేశీయులు నానా ఇబ్బందులు పడుతున్నారు.…