Political News

ఏడేళ్ల తర్వాత‌… కోర్టు మెట్లెక్క‌నున్న జ‌గ‌న్‌?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదా? అంటే అవుననే సమాధానమే వినిపిస్తోంది. అక్రమ ఆస్తుల కేసులలో నిండా కొరుకుపోయి.. ఒకప్పుడు 16 నెలల పాటు జైలు జీవితం గడిపిన జగన్ ప్రస్తుతం బెయిల్ పై ఉన్న విషయం తెలిసిందే. 2019 ఎన్నికలకు ముందు కోర్టుకు హాజరైన ఆయన.. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఈ హాజరు నుంచి మిన‌హాయింపు పొందుతూ వచ్చారు.

ప్రస్తుతం అక్రమ ఆస్తుల కేసును హైదరాబాదులోని సిబిఐ కోర్టు విచారణ సాగిస్తోంది. అయితే, 2019 ఎన్నికలకు ముందు నుంచి కోర్టుకు వెళ్లకుండా ఉన్న జగన్ దాదాపు 7 సంవత్సరాల తర్వాత వచ్చే నెల 14న కోర్టుకు హాజరు కాక తప్పని పరిస్థితి ఏర్పడింది.

తాజాగా జరిగిన విచారణలో సిబీఐ కోర్టు మరోసారి జగన్ కు ఈ విషయాన్ని గుర్తు చేసింది. ఇటీవల జగన్ తన ఫ్యామిలీతో కలిసి లండన్ లో పర్యటించారు. అయితే ఆయన లండన్ కు వెళ్లడానికి ముందు సిబిఐ అనుమతి తీసుకున్నారు. కానీ, ఈ క్రమంలో ఆయన తమకు వేరే ఫోన్ నెంబర్ ఇచ్చారని పేర్కొంటూ సిబిఐ అధికారులు కోర్టులో పిటిషన్ వేశారు.

దీనిని విచారించిన సిబిఐ కోర్టు ఈ విషయం ముగిసిపోయిన అంశమని. లండన్ వెళ్లిన జగన్ తిరిగి వచ్చేసారని తెలిపింది. కాబట్టి ఈ కేసుతో పనిలేదని పేర్కొంది. అయితే, ఇదే సమయంలో నవంబర్ 14న జగన్ స్వయంగా కోర్టుకు హాజరు కావాల్సి ఉంటుందని గుర్తు చేసింది.

అక్రమ ఆస్తుల కేసులు విచారణ జరుగుతున్న సిబిఐ కోర్టుకు దాదాపు ఏడు సంవత్సరాలుగా జగన్ రాకపోవడాన్ని ఇటీవల సిబిఐ అధికారులు ప్రశ్నించారు. ఆయన కోర్టుకు రావాల్సిందేనని వారు పట్టుబట్టారు. ఈ నేపథ్యంలో గత నెలలో సిబీఐ కోర్టు జగన్ కు ఈ మేరకు ఆదేశించింది. తాజాగా మరోసారి గుర్తు చేసింది.

సో దీంతో జగన్ కోర్టు మెట్లు ఎక్కక తప్పదని సిబిఐ న్యాయవాదులు చెబుతున్నారు. కానీ, మ‌రోవైపు వైసీపీ త‌ర‌ఫున న్యాయ‌వాదులు మాత్రం దీనిపై నిర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానిస్తున్నారు. త‌మ‌కు మ‌రో అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు.

This post was last modified on October 30, 2025 12:42 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

16 minutes ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

3 hours ago

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

6 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

6 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

9 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

11 hours ago