Political News

భూమ‌న‌కు పోలీసుల నోటీసులు, రీజనేంటి?

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి తిరుప‌తి జాల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు సూచించారు. అదేవిధంగా గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన తిరుప‌తిలోని గోశాల‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పోలీసులు ఆయ‌న‌కు తెలిపారు. విచార‌ణ‌కు రాక‌పోతే.. కేసు న‌మోదు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తిరుమ‌ల ప్ర‌తిష్ఠ దిగ‌జారింద‌ని, తిరుప‌తిలోని గోశాల‌లో సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో గోశాల‌లోని వంద‌లాది గోవులు మృతి చెందాయంటూ.. అప్ప‌ట్లో ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు.. గోశాల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన స‌మ‌యంలో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేసి త‌ర్వాత విడుదల చేశారు. దీనిని అప్ప‌టి టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఖండించారు. వైసీపీ హ‌యాంలోనే ఎక్కువ‌గా గోవులు మృతి చెందాయ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరు ప‌క్షాలు కూడా.. లెక్క‌లు చెప్పుకొచ్చాయి. గోశాల‌లో 150 గోవులు చనిపోయాయ‌ని. దీనికి టీటీడీ బాధ్య‌త వహించాల‌ని అప్ప‌ట్లో భూమ‌న ఆరోపించారు. అయితే.. కేవ‌లం 30-45 గోవులు మాత్ర‌మే చనిపోయాయ‌ని టీటీడీఈవో వివ‌రించారు. ఇలా ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం.. వివ‌ర‌ణ‌లు.. మీడియా ముందు విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. అప్ప‌ట్లోనే కేసు న‌మోదు చేసిన పోలీసులు.. త‌ర్వాత కాలంలో మౌనంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు భూమ‌న‌కు నోటీసులు ఇచ్చారు.

అంతా రాజ‌కీయం:  భూమ‌న‌

త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డం ప‌ట్ల భూమ‌న స్పందించారు. ఇది రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని వ్యాఖ్యానించారు. రెండు మాసాల కిందట చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇప్పుడు స్పందించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. విచార‌ణకు హాజ‌రవుతాన‌న్న భూమ‌న‌.. త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను స‌మ‌ర్పిస్తాన‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇవ్వాల‌ని ఆయ‌న పోలీసును కోరారు.

This post was last modified on October 21, 2025 9:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bhumana

Recent Posts

జగన్ ఇలానే ఉండాలి టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

3 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

3 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

5 hours ago

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

8 hours ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

8 hours ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

8 hours ago