Political News

భూమ‌న‌కు పోలీసుల నోటీసులు, రీజనేంటి?

తిరుపతి మాజీ ఎమ్మెల్యే, వైసీపీ సీనియర్ నాయ‌కుడు భూమ‌న క‌రుణాక‌ర్ రెడ్డికి తిరుప‌తి జాల్లా పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 23న విచార‌ణ‌కు రావాల‌ని ఆయ‌న‌కు సూచించారు. అదేవిధంగా గ‌తంలో తిరుమ‌ల తిరుప‌తి దేవ‌స్థానానికి సంబంధించిన తిరుప‌తిలోని గోశాల‌పై చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించిన ఆధారాల‌ను కూడా తీసుకురావాల‌ని పోలీసులు ఆయ‌న‌కు తెలిపారు. విచార‌ణ‌కు రాక‌పోతే.. కేసు న‌మోదు చేయాల్సి ఉంటుంద‌ని పేర్కొన్నారు.

ఏం జ‌రిగింది?

రాష్ట్రంలో కూటమి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత‌.. తిరుమ‌ల ప్ర‌తిష్ఠ దిగ‌జారింద‌ని, తిరుప‌తిలోని గోశాల‌లో సంర‌క్ష‌ణ చ‌ర్య‌లు చేప‌ట్ట‌డం లేద‌ని భూమ‌న క‌రుణాక‌ర్‌రెడ్డి ఆరోపించారు. ఈ క్ర‌మంలో గోశాల‌లోని వంద‌లాది గోవులు మృతి చెందాయంటూ.. అప్ప‌ట్లో ఆయ‌న ఆరోప‌ణ‌లు చేశారు. అంతేకాదు.. గోశాల‌ను ప‌రిశీలించేందుకు వెళ్లిన స‌మ‌యంలో పోలీసులు ఆయ‌న‌ను అరెస్టు చేసి త‌ర్వాత విడుదల చేశారు. దీనిని అప్ప‌టి టీటీడీ ఈవో శ్యామ‌ల‌రావు ఖండించారు. వైసీపీ హ‌యాంలోనే ఎక్కువ‌గా గోవులు మృతి చెందాయ‌ని పేర్కొన్నారు.

ఈ సంద‌ర్భంగా ఇరు ప‌క్షాలు కూడా.. లెక్క‌లు చెప్పుకొచ్చాయి. గోశాల‌లో 150 గోవులు చనిపోయాయ‌ని. దీనికి టీటీడీ బాధ్య‌త వహించాల‌ని అప్ప‌ట్లో భూమ‌న ఆరోపించారు. అయితే.. కేవ‌లం 30-45 గోవులు మాత్ర‌మే చనిపోయాయ‌ని టీటీడీఈవో వివ‌రించారు. ఇలా ఇరు ప‌క్షాల మ‌ధ్య వాగ్వాదం.. వివ‌ర‌ణ‌లు.. మీడియా ముందు విమ‌ర్శ‌లు చోటు చేసుకున్నాయి. అప్ప‌ట్లోనే కేసు న‌మోదు చేసిన పోలీసులు.. త‌ర్వాత కాలంలో మౌనంగా ఉన్నారు. తాజాగా ఇప్పుడు భూమ‌న‌కు నోటీసులు ఇచ్చారు.

అంతా రాజ‌కీయం:  భూమ‌న‌

త‌న‌కు నోటీసులు ఇవ్వ‌డం ప‌ట్ల భూమ‌న స్పందించారు. ఇది రాజ‌కీయ కుట్ర‌లో భాగ‌మ‌ని వ్యాఖ్యానించారు. రెండు మాసాల కిందట చేసిన ఆరోప‌ణ‌ల‌పై ఇప్పుడు స్పందించ‌డం ఏంట‌ని ప్ర‌శ్నించారు. విచార‌ణకు హాజ‌రవుతాన‌న్న భూమ‌న‌.. త‌న వ‌ద్ద ఉన్న ఆధారాల‌ను స‌మ‌ర్పిస్తాన‌ని.. చ‌ర్య‌లు తీసుకుంటారా? అని ప్ర‌శ్నించారు. చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని హామీ ఇవ్వాల‌ని ఆయ‌న పోలీసును కోరారు.

This post was last modified on October 21, 2025 9:45 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Bhumana

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

1 hour ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago