Political News

అన్న‌మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్న‌మాట నిల‌బెట్టుకున్నారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల సంఘాల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి డిమాండ్ల‌లో కొన్నింటికి అప్ప‌టిక‌ప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్ర‌ధానంగా క‌రువు భ‌త్యం(డీఏ) త‌క్ష‌ణ‌మే అమ‌లు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. అయిన‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు వారికి హామీ ఇచ్చారు. ఈ హామీని అమ‌లు చేస్తూ.. తాజాగా స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు స‌ర్కారు దీపావ‌ళి కానుక ప్ర‌క‌టించింది. ఉద్యోగులు, పెన్ష‌నర్ల‌కు సంబంధించిన క‌రువు భ‌త్యం.. డీఏను పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. 3.64 శాతం చొప్పున డీఏను పెంచుతున్న‌ట్టు తెలిపింది. ఇది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న 33.67 శాతం డీఏ జ‌న‌వ‌రి నుంచి 37.31 శాతానికి పెర‌గ‌నుంది. ఈ పెంచిన మొత్తాన్ని జ‌న‌వ‌రి నెల వేత‌నం నుంచి ఉద్యోగుల‌కు అందించ‌నున్నారు. ఈ మేర‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాట‌ను కూడా సీఎం చంద్ర‌బాబు నిల‌బెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా ప్ర‌మోష‌న్ల‌కు నోచుకోక‌పోవ‌డంపై ఉద్యోగులు ఆందోళ‌న‌లో ఉన్నారు. శ‌నివారం సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇదే విష‌యాన్ని చెప్పారు. దీనిపై త‌క్ష‌ణం స్పందించిన ముఖ్య‌మంత్రి.. ప‌దోన్న‌తుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకు ని సోమ‌వారం దీనికి సంబంధించిన జీవోను కూడా స‌ర్కారు విడుద‌ల చేసింది. వీరికి కూడా జ‌న‌వ‌రి నుంచి ప‌దోన్న‌తులు క‌ల్పించ‌నున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది.

This post was last modified on October 20, 2025 2:24 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Chandrababu

Recent Posts

శ్రీ విష్ణుకు సన్నాఫ్ సత్యమూర్తి ఇచ్చిన షాక్

చిన్న చిన్న పాత్రలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత హీరోగా మారి ఇప్పుడు యూత్‌లో మంచి క్రేజ్‌తో సాగుతున్నాడు శ్రీ విష్ణు.…

1 minute ago

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

13 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

31 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago