Political News

అన్న‌మాట నిల‌బెట్టుకున్న చంద్ర‌బాబు.. ఏం చేశారంటే!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అన్న‌మాట నిల‌బెట్టుకున్నారు. శ‌నివారం రాత్రి ఆయ‌న ప్ర‌భుత్వ‌ ఉద్యోగుల సంఘాల‌తో భేటీ అయ్యారు. ఈ సంద‌ర్భంగా వారి డిమాండ్ల‌లో కొన్నింటికి అప్ప‌టిక‌ప్పుడు హామీ ఇచ్చారు. వీటిలో ప్ర‌ధానంగా క‌రువు భ‌త్యం(డీఏ) త‌క్ష‌ణ‌మే అమ‌లు చేస్తామని హామీ ఇచ్చారు. దీనికి సుమారు 2 వేల కోట్ల రూపాయ‌ల వ‌ర‌కు ఖ‌ర్చ‌వుతుంది. అయిన‌ప్ప‌టికీ సీఎం చంద్ర‌బాబు వారికి హామీ ఇచ్చారు. ఈ హామీని అమ‌లు చేస్తూ.. తాజాగా స‌ర్కారు ఉత్త‌ర్వులు జారీ చేసింది.

రాష్ట్ర ప్ర‌భుత్వ ఉద్యోగులు, పెన్ష‌న‌ర్ల‌కు స‌ర్కారు దీపావ‌ళి కానుక ప్ర‌క‌టించింది. ఉద్యోగులు, పెన్ష‌నర్ల‌కు సంబంధించిన క‌రువు భ‌త్యం.. డీఏను పెంచుతూ.. ఉత్త‌ర్వులు జారీ చేసింది. 3.64 శాతం చొప్పున డీఏను పెంచుతున్న‌ట్టు తెలిపింది. ఇది జ‌న‌వ‌రి 1వ తేదీ నుంచి అమ‌ల్లోకి రానుంద‌ని ఉత్త‌ర్వుల్లో స్ప‌ష్టం చేసింది. దీంతో ప్ర‌స్తుతం ఉన్న 33.67 శాతం డీఏ జ‌న‌వ‌రి నుంచి 37.31 శాతానికి పెర‌గ‌నుంది. ఈ పెంచిన మొత్తాన్ని జ‌న‌వ‌రి నెల వేత‌నం నుంచి ఉద్యోగుల‌కు అందించ‌నున్నారు. ఈ మేర‌కు ఆర్థిక శాఖ ముఖ్య కార్య‌ద‌ర్శి పీయూష్ కుమార్ ఉత్త‌ర్వులు జారీ చేశారు.

అదేవిధంగా ఆర్టీసీ ఉద్యోగులకు సంబంధించి ఇచ్చిన మాట‌ను కూడా సీఎం చంద్ర‌బాబు నిల‌బెట్టుకున్నారు. సుదీర్ఘ కాలంగా ప్ర‌మోష‌న్ల‌కు నోచుకోక‌పోవ‌డంపై ఉద్యోగులు ఆందోళ‌న‌లో ఉన్నారు. శ‌నివారం సీఎం చంద్ర‌బాబుతో చ‌ర్చించిన ఆర్టీసీ ఉద్యోగ సంఘాలు ఇదే విష‌యాన్ని చెప్పారు. దీనిపై త‌క్ష‌ణం స్పందించిన ముఖ్య‌మంత్రి.. ప‌దోన్న‌తుల‌కు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు. తాజాగా దీపావ‌ళిని పుర‌స్క‌రించుకు ని సోమ‌వారం దీనికి సంబంధించిన జీవోను కూడా స‌ర్కారు విడుద‌ల చేసింది. వీరికి కూడా జ‌న‌వ‌రి నుంచి ప‌దోన్న‌తులు క‌ల్పించ‌నున్న‌ట్టు స‌ర్కారు తెలిపింది.

Kumar

Recent Posts

అనుకున్నట్లే జరిగింది.. రెండోసారి ఐపీఎల్ ఛాంపియన్!

అనుకున్నట్లే ఐపీఎల్ 2026 విజేతగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) మళ్ళీ కొట్టేసింది. ఆ జట్టుకు పోటీగా ఈ సీజన్…

1 hour ago

బుచ్చిబాబు మీద నమ్మకం ఎంత ఉందంటే

మాములుగా ప్రీ రిలీజ్ ఈవెంట్ల సమయంలో నిర్వాహకులు హీరోలతో పాటు దర్శక నిర్మాతల కటవుట్లు పెట్టడం కొత్త కాదు. అందరూ…

1 hour ago

మెగా సినిమాల మీదే యువి భారం

మొన్నటిదాకా టాప్ ప్రొడక్షన్ హౌస్ గా వెలిగిపోయిన యువి క్రియేషన్స్ ఇప్పుడు బయటికి చెప్పుకోలేని ఇబ్బందులతో సతమతమవుతోందట. చిన్న బడ్జెట్…

1 hour ago

పీఏ అక్ర‌మాలు… గట్టిగా వినిపిస్తున్న జగన్ పేరు

వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్ అధికారంలో ఉన్న‌ప్పుడు.. రాష్ట్రంలో జ‌రిగిన అనేక అక్ర‌మాల‌పై ప్ర‌స్తుత ప్ర‌భుత్వం విచార‌ణ చేస్తున్న…

2 hours ago

తెలుగు దుకాణంలో డబ్బింగ్ వ్యాపారం

వేసవిలో కీలకమైన నెలగా చెప్పుకునే మే అయిపోయింది. స్కూళ్ళు, కాలేజీలకు సెలవులు ఉండే ఈ ముఖ్యమైన సీజన్ టాలీవుడ్ వృథా…

3 hours ago

కాంట్రాక్ట్ వ్యవస్థను రద్దు చేసిన రాష్ట్ర ప్రభుత్వం

ఉద్యోగ వ్యవస్థకు సంబంధించి పంజాబ్ లోని ఆమ్ ఆద్మీ పార్టీ సర్కారు సంచలన నిర్ణయం తీసుకుంది. ప్రజా పాలనలో ఇకపై…

4 hours ago