Political News

యాద‌వుల‌ను మెప్పించేలా సీఎం హామీలు

స‌మాజంలో కీల‌క‌మైన స్థానంలో ఉన్న యాద‌వ సామాజిక వ‌ర్గాన్ని కూడా మాజీ సీఎం కేసీఆర్ తీవ్రంగా అవ‌మానించార‌ని తెలంగాణ ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి విమ‌ర్శించారు. వారికి గొర్రెలు, బ‌ర్రెలు మేపుకునేవారిగానే చూశార‌ని.. అన్నారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు ఏమాత్రం స‌హ‌క‌రించ‌లేద‌న్నారు. ఏటా దీపావ‌ళి పండుగకు ముందు జ‌రుపుకొనే యాద‌వుల అతి పెద్ద పండుగ స‌ద‌ర్‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించాల‌న్న విజ్ఞ‌ప్తినికూడా ప‌దేళ్ల పాల‌న‌లో ఏనాడూ కేసీఆర్ ప‌ట్టించుకోలేద‌ని విమ‌ర్శించారు. తాము అధికారంలోకి రాగానే స‌ద‌ర్ పండుగ‌ను రాష్ట్ర పండుగ‌గా గుర్తించామ‌న్నారు.

తాజాగా హైద‌రాబాద్‌లోని ఎన్టీఆర్ స్టేడియంలో నిర్వ‌హించిన స‌ద‌ర్ ఉత్స‌వాన్ని సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించారు. అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ.. యాద‌వుల‌ను త‌మ ప్ర‌భుత్వంక‌డుపులో పెట్టుకుని చూసుకుంటుంద‌న్నారు. రాష్ట్ర సాధ‌న‌లో యాద‌వ సామాజిక వ‌ర్గం ఎంతో కీల‌క పాత్ర పోషించింద‌ని తెలిపారు. వారికి అవ‌స‌ర‌మైన అన్ని సౌక‌ర్యాలు క‌ల్పిస్తామ‌ని చెప్పారు. వారి పిల్ల‌ల చ‌దువుల‌కు కూడా స‌హ‌క‌రిస్తామ‌ని తెలిపారు. రాజ‌కీయంగా కూడా కాంగ్రెస్ పార్టీనే యాద‌వుల‌కు అవ‌కాశం క‌ల్పించిందని రేవంత్ రెడ్డి చెప్పారు. గ‌త సీఎం క‌నీసం వారిని గుర్తించ‌లేక పోయార‌ని అన్నారు.

ప్ర‌భుత్వానికి అండ‌గా ఉండాల‌ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సంద‌ర్భంగా యాద‌వుల‌ను కోరారు. యాద‌వుల‌కు మ‌రిన్ని రాజ‌కీయ అవ‌కాశాలు క‌ల్పించేందుకు త‌న వంతుకృషి చేస్తాన‌న్న ఆయ‌న‌.. హైద‌రాబాద్ అభివృద్ధికి యాద‌వులు క‌లిసి రావాల‌ని కోరారు. ప్ర‌తి విష‌యంలోనూ యాద‌వుల‌కు అండ‌గా ఉంటామ‌ని తెలిపారు. కాగా.. సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్య‌ల వెనుక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఉండ‌డం గ‌మ‌నార్హం. యాద‌వ సామాజిక వ‌ర్గం ఓట్లు కూడా జూబ్లీహిల్స్ లో ఉన్నారు. సుమారు 50-60 వేల మంది యాద‌వులు ఉన్నారు. ఈ క్ర‌మంలోనే రేవంత్ రెడ్డి స‌ద‌ర్ ఉత్స‌వ్‌కు హాజ‌రుకావ‌డం.. వారికి రాజ‌కీయంగా అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 19, 2025 10:53 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

ఎన్నికలపై బెట్టింగుల హోరు!… అంతటా హైటెన్షన్!

దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…

1 hour ago

తారక్ అభిమానికి చరణ్ ఛాన్స్?

పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్‌కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…

2 hours ago

మమ్ముట్టి & మోహన్ లాల్ మెప్పించారా

మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…

2 hours ago

30 రోజుల కౌంట్ డౌన్ మొదలయ్యింది

సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…

3 hours ago

చావానే టార్గెట్… అంత సీన్ లేదు రాజా

ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…

3 hours ago

తరుణ్ క్యాలికులేషన్ ఎక్కడ తప్పుతోంది

పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…

5 hours ago