కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)కి లక్ష్మణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచలన ఉత్తర్వులు జారీ చేసింది. సీబీఐ దర్యాప్తును ఎలా పడితే అలా వేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. కేవలం అత్యంతకీలకమైన కేసులు.. రాష్ట్రాల పరిధిలో ఉన్న పోలీసులపై విశ్వాసం సన్నగిల్లుతున్న పరిస్థితులు ఏర్పడినప్పుడు మాత్రమే సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని స్పష్టం చేసింది. అంతేకాదు.. సీబీఐకి ఇవ్వాల్సిన కేసులను సమగ్రంగా అధ్యయనం చేయాలని సూచించింది. ఆయా కేసుల్లో రాజకీయ పరిణామాలు.. కీలక నేతల హస్తం, ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరించడం వంటివి స్పష్టంగా కనిపిస్తే.. అప్పుడే సీబీఐకి ఇవ్వాలని తేల్చి చెప్పింది.
ఏం జరిగింది?
ఉత్తరప్రదేశ్లోని శాసన మండలిలో పనిచేసే ఉద్యోగులు అవకతవకలకు పాల్పడ్డారని కేసులునమోదయ్యాయి. దీనిని విచారించి రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసును తీవ్రంగా పరిగణిస్తున్నట్టు పేర్కొంది. ఈ అవకతవకల నిగ్గు తేల్చేందుకు.. సీబీఐకి ఇస్తున్నట్టు పేర్కొంది. అయితే.. ఈ కేసును రాష్ట్ర పోలీసులు నిబద్ధతతో విచారణ చేస్తున్నారని.. అలాంటి సమయంలో సీబీఐకి ఇవ్వడం ద్వారా.. వారి ఆత్మస్థయిర్యాన్ని దెబ్బతీసినట్టు అవుతుందని రాష్ట్ర ప్రభుత్వం వ్యాఖ్యానించింది. అయినప్పటికీ.. అలహాబాద్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి ఇస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని రాష్ట్ర పోలీసు శాఖ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది.
ఈ పిటిషన్పై విచారణ జరిపిన సుప్రీంకోర్టు.. ఏకేసును బడితే ఆకేసును సీబీఐకి ఇవ్వరాదని తేల్చి చెప్పింది. అత్యంత కీలకమైన కేసులు.. మెజారిటీ వర్గాలపై ప్రభావం చూపుతుందని భావించిన సమయంలోనే సీబీఐకి సదరు కేసును అప్పగించాలని సూచించింది. అంతేకాదు.. రాష్ట్రంలో రాజకీయ నేతల ప్రమేయం, అధికారుల ఉదాసీనత, ప్రభుత్వాల నిర్లక్ష్యం ఉన్నప్పుడు వాటిపై సీబీఐని వేయొచ్చని స్పష్టం చేసింది. అలా కాకపోతే.. అత్యంత కీలకమైన సీబీఐని దుర్వినియోగం చేసినట్టే అవుతుందని అభిప్రాయపడింది. అంతేకాదు..ఈ విషయంలో హైకోర్టులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించింది. దీనిపై గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధనలను పరిశీలించాలని హితవు పలికింది.
ఏపీపై ప్రభావం..?
ఏపీలోనూ ఓ కేసును సీబీఐకి ఇస్తూ.. ఇటీవల హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. వీటిలో ప్రధానంగా తాడేపల్లి పోలీసులు వైసీపీ డిజిటల్ మీడియాకార్యకర్తను అరెస్టు చేశారు. అయితే.. కోర్టుకు మాత్రం అరెస్టు చేయలేదని చెప్పారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన కోర్టు దీనిని సీబీఐకి అప్పగిస్తున్నట్టు ఆదేశాలుజారీ చేసింది. తర్వాత.. ఈ వ్యవహారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్రస్తుతం దీనిపై స్టే కొనసాగుతోంది. ప్రస్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో దీనిపై ఏమేరకు ప్రభావం పడుతుందో చూడాలి.
ఈ నెల 24 విడుదల కాబోతున్న చెన్నై లవ్ స్టోరీ టీమ్ ఒక విషయంలో టెన్షన్ పడుతోంది. అదే రోజు…
పెద్ది, మా ఇంటి బంగారం తర్వాత ఈ సీజన్ లో బాక్సాఫీస్ కు మళ్ళీ జోష్ వచ్చింది. థియేటర్లు కళకళలాడుతున్నాయి.…
తమిళ సినిమాల్లో చాలా ఏళ్ల నుంచి తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్నాడు అనిరుధ్ రవిచందర్. అతడి హవా తమిళానికే పరిమితం కావట్లేదు…
బూత్ స్థాయిలో బలోపేతం అయ్యే దిశగా జనసేన కసరత్తు షురూ చేసింది. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ నాయకులు ఉన్నప్పటికీ..…
ఏపీ రాజధాని అమరావతిలో రైతుల భూములను వారి అనుమతి లేకుండానే కూటమి సర్కారు లాక్కుంటోందని శనివారం పెద్ద రచ్చే జరిగింది. రాజధాని నిర్మాణం కోసం తమ భూములను…
లెనిన్ సినిమా ప్రమోషన్లలో హీరో అఖిల్ అక్కినేని గురించి ఒక ఇంట్రెస్టింగ్ కామెంట్ చేశాడు నిర్మాతల్లో ఒకరైన నాగవంశీ. లెనిన్…