Political News

సీబీఐకి ల‌క్ష్మ‌ణ రేఖ‌: సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు

కేంద్ర దర్యాప్తు సంస్థ‌(సీబీఐ)కి ల‌క్ష్మ‌ణ రేఖను విధిస్తూ.. సుప్రీంకోర్టు సంచ‌ల‌న ఉత్త‌ర్వులు జారీ చేసింది. సీబీఐ ద‌ర్యాప్తును ఎలా ప‌డితే అలా వేయ‌డానికి వీల్లేద‌ని స్ప‌ష్టం చేసింది. కేవ‌లం అత్యంత‌కీల‌క‌మైన కేసులు.. రాష్ట్రాల ప‌రిధిలో ఉన్న‌ పోలీసుల‌పై  విశ్వాసం స‌న్న‌గిల్లుతున్న ప‌రిస్థితులు ఏర్ప‌డిన‌ప్పుడు మాత్రమే సీబీఐ ద‌ర్యాప్తునకు ఆదేశించాల‌ని స్ప‌ష్టం చేసింది. అంతేకాదు..  సీబీఐకి ఇవ్వాల్సిన కేసుల‌ను స‌మ‌గ్రంగా అధ్య‌య‌నం చేయాల‌ని సూచించింది. ఆయా కేసుల్లో రాజ‌కీయ ప‌రిణామాలు.. కీల‌క నేత‌ల హ‌స్తం, ప్ర‌భుత్వాలు ఉదాసీనంగా వ్య‌వ‌హ‌రించ‌డం వంటివి స్ప‌ష్టంగా క‌నిపిస్తే.. అప్పుడే సీబీఐకి ఇవ్వాల‌ని తేల్చి చెప్పింది.

ఏం జ‌రిగింది?

ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని శాస‌న మండ‌లిలో ప‌నిచేసే ఉద్యోగులు అవ‌క‌త‌వ‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని కేసులున‌మోద‌య్యాయి. దీనిని విచారించి రాష్ట్ర హైకోర్టు.. ఈ కేసును తీవ్రంగా ప‌రిగ‌ణిస్తున్న‌ట్టు పేర్కొంది. ఈ అవ‌క‌త‌వ‌క‌ల నిగ్గు తేల్చేందుకు.. సీబీఐకి ఇస్తున్న‌ట్టు పేర్కొంది. అయితే.. ఈ కేసును రాష్ట్ర పోలీసులు నిబ‌ద్ధ‌త‌తో విచార‌ణ చేస్తున్నార‌ని.. అలాంటి స‌మ‌యంలో సీబీఐకి ఇవ్వ‌డం ద్వారా.. వారి ఆత్మ‌స్థ‌యిర్యాన్ని దెబ్బ‌తీసిన‌ట్టు అవుతుంద‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం వ్యాఖ్యానించింది. అయిన‌ప్ప‌టికీ.. అల‌హాబాద్ హైకోర్టు ఈ కేసును సీబీఐకి ఇస్తూ ఉత్త‌ర్వులు జారీ చేసింది. దీనిని రాష్ట్ర పోలీసు శాఖ సుప్రీంకోర్టులో స‌వాల్ చేసింది.

ఈ పిటిష‌న్‌పై విచార‌ణ జ‌రిపిన సుప్రీంకోర్టు.. ఏకేసును బ‌డితే ఆకేసును సీబీఐకి ఇవ్వరాద‌ని తేల్చి చెప్పింది. అత్యంత కీల‌క‌మైన కేసులు.. మెజారిటీ వ‌ర్గాల‌పై ప్ర‌భావం చూపుతుంద‌ని భావించిన స‌మ‌యంలోనే సీబీఐకి స‌ద‌రు కేసును అప్ప‌గించాల‌ని సూచించింది. అంతేకాదు.. రాష్ట్రంలో రాజకీయ నేత‌ల ప్ర‌మేయం, అధికారుల ఉదాసీన‌త‌, ప్ర‌భుత్వాల నిర్ల‌క్ష్యం ఉన్న‌ప్పుడు వాటిపై సీబీఐని వేయొచ్చ‌ని స్ప‌ష్టం చేసింది. అలా కాక‌పోతే.. అత్యంత కీల‌క‌మైన సీబీఐని దుర్వినియోగం చేసిన‌ట్టే అవుతుంద‌ని అభిప్రాయ‌ప‌డింది. అంతేకాదు..ఈ విష‌యంలో హైకోర్టులు కూడా జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించింది. దీనిపై గ‌తంలో సుప్రీంకోర్టు ఇచ్చిన నిబంధ‌న‌ల‌ను ప‌రిశీలించాల‌ని హిత‌వు ప‌లికింది.

ఏపీపై ప్ర‌భావం..?

ఏపీలోనూ ఓ కేసును సీబీఐకి ఇస్తూ.. ఇటీవ‌ల హైకోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసింది. వీటిలో ప్ర‌ధానంగా తాడేప‌ల్లి పోలీసులు వైసీపీ డిజిట‌ల్ మీడియాకార్య‌క‌ర్త‌ను అరెస్టు చేశారు. అయితే.. కోర్టుకు మాత్రం అరెస్టు చేయ‌లేద‌ని చెప్పారు. దీనిపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసిన కోర్టు దీనిని సీబీఐకి అప్ప‌గిస్తున్న‌ట్టు ఆదేశాలుజారీ చేసింది. త‌ర్వాత‌.. ఈ వ్య‌వ‌హారం సుప్రీంకోర్టుకు చేరింది. ప్ర‌స్తుతం దీనిపై స్టే కొన‌సాగుతోంది. ప్ర‌స్తుతం సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల నేప‌థ్యంలో దీనిపై ఏమేర‌కు ప్ర‌భావం ప‌డుతుందో చూడాలి.

This post was last modified on October 19, 2025 11:51 am

Share

Recent Posts

మోదీని యువత తిడుతుంటే పవన్ కంట్లో నీళ్లు తిరిగాయి

బారత ప్రధానిగా పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోదీ... వరుసబెట్టి మూడు పర్యాయాలు దేశ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేశారు. అంతేకాకుండా దేశానికి అత్యధిక…

1 hour ago

టాలీవుడ్ ఆగస్ట్ కిరీటం – ఎవరికో అవకాశం!

కొత్త నెల వచ్చేసింది. సంక్రాంతి అయిపోయాక ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ దాకా జనాలు రాక థియేటర్లు అలో లక్ష్మణా అంటున్న…

5 hours ago

మా పిల్లలను శిక్షించలేను… క్షమిస్తున్నాను

జంతర్ మంతర్ ఆందోళనలో విద్యార్థులు తనను దుషించారని ప్రధాని మోదీ శుక్రవారం రాత్రి విడుదల చేసిన వీడియో సోషల్ మీడియాలో…

6 hours ago

పవన్… కళాకారులకో వరం

నేటి తరం రాజకీయ నాయకులలో ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కుమార్ స్టైలే వేరు. నిబద్దత కలిగిన నాయకుడిగా ఎదిగినప్పటికి…

8 hours ago

మహేష్ వెనుకడుగుకు కారణం ఏంటో

గత రెండు మూడు రోజులుగా మహేష్ బాబు గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరుగుతోంది. జయకృష్ణ తొలి సినిమ…

9 hours ago

ట్విట్టర్ టాక్స్… ప్రీమియర్ మాటలు… నిజాలు కావా

గత కొన్ని వారాలుగా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పెద్ది  తెలుగు రాష్ట్రాల్లో బాగా ఆడితే…

16 hours ago