Political News

పిక్‌టాక్‌: `త్రిమూర్తులు`… పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్న‌ట్టు!!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్ర‌బాబు.. డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్‌లు.. ఒకే వేదిక‌పై ప‌లు మార్లు క‌లుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా ప‌క్క‌ప‌క్క‌న కూర్చున్నారు. వారి మ‌ధ్య‌లో ఇత‌ర నాయ‌కులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో శ్రీశైలం దేవ‌స్థానానికి విచ్చేసిన ప్ర‌ధాన మంత్రి-సీఎం-ఉప‌ముఖ్య‌మంత్రులు.. దాదాపు ఒక‌రి ప‌క్క‌న ఒక‌రు కూర్చుని చ‌ర్చించుకుంటున్న ఫొటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది.

దీనికి `త్రిమూర్తులు` అంటూ నెటిజ‌న్లు కామెంట్లు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. శ్రీశైలంలోని భ్ర‌మ‌రాంబ అమ్మ‌వారి దేవ‌స్థానంలో అమ్మ‌వారి మండ‌పం ఉంది. దీని అరుగుపై ఎలాంటి ఆచ్ఛాద‌న లేకుండా అలానే కూర్చున్న ముగ్గ‌రు అధినేత‌లు.. ఒక‌రి కొక‌రు దాదాపు ఎదురుగా కూర్చొన్న‌ట్టుగా ఉన్నారు. ఈ సంద‌ర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారో తెలియ‌దు కానీ.. ఆల‌య విశేషాల గురించి.. సీఎం చంద్ర‌బాబు వివ‌రిస్తున్న‌ట్టుగా.. ప్ర‌ధాని ఆస‌క్తిగా వింటున్న‌ట్టుగా ఈ ఫొటోలో క‌నిపిస్తోంది.

ఇక‌, వారికి ప‌క్క‌నే.. వారి వైపు తిరిగి అరుగుపై కూర్చున్న ప‌వ‌న్ క‌ల్యాణ్ కూడా వారి సంభాష‌ణ‌ను ఆస‌క్తిగా తిల‌కిస్తున్నారు. ఇలాంటి ఫొటో ఇప్ప‌టి వ‌ర‌కు రాలేద‌ని నెటిజ‌న్లు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక స‌భ‌ల్లో ప‌క్క ప‌క్క‌న కూర్చున్నా.. ఇలా.. ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకునే సందర్భం.. అందునా.. దేవ స్థానంలోని అరుగుపై.. పొరుగింటి వ్య‌క్తులు ప‌క్క‌ప‌క్క‌న కూర్చుని మాట్లాడుకున్న‌ట్టుగా ఉండ‌డంతో ఎక్కువ మంది షేర్‌లు, లైకులు చేస్తుండ‌డం గ‌మ‌నార్హం. మొత్తం క‌ర్నూలు ప‌ర్య‌ట‌న‌లో ఈ ఫొటో హైలెట్‌గా నిల‌వ‌డం గ‌మ‌నార్హం.

This post was last modified on October 16, 2025 7:00 pm

Share
Show comments
Published by
Kumar

Recent Posts

రాజమౌళి, మహేష్ కొట్టుకోవడమేంటయ్యా

దర్శక ధీరుడు రాజమౌళి, సూపర్ స్టార్ మహేష్ బాబు కలిసి సినిమా చేయాలని వాళ్లిద్దరి అభిమానులు ఎన్నో ఏళ్ల ముందు…

12 minutes ago

మున్నా మంచి స్ట్రాటజీ వాడుతున్నాడు

మాములుగా రీ రిలీజులు ఏవి ఆడతాయో ఏవి ఆడవో అంత ఈజీగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. గత ఏడాది ఖలేజాని…

30 minutes ago

ఇలాంటిది వేరే మతంలో జరిగి ఉంటే?: పవన్

తిరుపతి లడ్డూ తయారీలో కల్తీ నెయ్యి అంశం జాతీయ స్థాయిలో దుమారం రేపిన సంగతి తెలిసిందే. ఆ టాపిక్ పై…

4 hours ago

చరణ్‌పై మచ్చ పడనివ్వని అల్లు శిరీష్

మెగా, అల్లు బంధం మీద ఎప్పటికప్పుడు రకరకాల ఊహాగానాలు, అనుమానాలు వస్తూనే ఉంటాయి. ఇరు కుటుంబాల మధ్య సంబంధాలు ఒకప్పట్లా…

5 hours ago

టీమిండియా సెమీస్ చేరాలంటే ఏం జరగాలి?

జింబాబ్వేపై వెస్టిండీస్ భారీ గెలుపు తర్వాత భారత్ సెమీస్ అవకాశాలు ఇప్పుడు పక్కా లెక్కల మీద ఆధారపడి ఉన్నాయి. నెట్…

6 hours ago

దురంధర్ టీమ్ భలే స్ట్రోక్ ఇచ్చింది

ప్రాణానికి ప్రాణం అనేది పాత సామెత. స్ట్రోకుకు స్ట్రోకు కొత్త ట్రెండ్. ఇటీవలే ఒక ఇంటర్నేషనల్ మ్యాగజైన్ కు చెందిన…

6 hours ago