ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ఏపీ సీఎం చంద్రబాబు.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్లు.. ఒకే వేదికపై పలు మార్లు కలుసుకున్నారు. కూర్చున్నారు కూడా. కానీ.. వారంతా పక్కపక్కన కూర్చున్నారు. వారి మధ్యలో ఇతర నాయకులు కూడా కూర్చున్నారు. కానీ.. తాజాగా కర్నూలు పర్యటనలో శ్రీశైలం దేవస్థానానికి విచ్చేసిన ప్రధాన మంత్రి-సీఎం-ఉపముఖ్యమంత్రులు.. దాదాపు ఒకరి పక్కన ఒకరు కూర్చుని చర్చించుకుంటున్న ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయింది.
దీనికి `త్రిమూర్తులు` అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండడం గమనార్హం. శ్రీశైలంలోని భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో అమ్మవారి మండపం ఉంది. దీని అరుగుపై ఎలాంటి ఆచ్ఛాదన లేకుండా అలానే కూర్చున్న ముగ్గరు అధినేతలు.. ఒకరి కొకరు దాదాపు ఎదురుగా కూర్చొన్నట్టుగా ఉన్నారు. ఈ సందర్భంగా వారు ఏం మాట్లాడుకున్నారో తెలియదు కానీ.. ఆలయ విశేషాల గురించి.. సీఎం చంద్రబాబు వివరిస్తున్నట్టుగా.. ప్రధాని ఆసక్తిగా వింటున్నట్టుగా ఈ ఫొటోలో కనిపిస్తోంది.
ఇక, వారికి పక్కనే.. వారి వైపు తిరిగి అరుగుపై కూర్చున్న పవన్ కల్యాణ్ కూడా వారి సంభాషణను ఆసక్తిగా తిలకిస్తున్నారు. ఇలాంటి ఫొటో ఇప్పటి వరకు రాలేదని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. అనేక సభల్లో పక్క పక్కన కూర్చున్నా.. ఇలా.. ఏకాంతంగా కూర్చుని మాట్లాడుకునే సందర్భం.. అందునా.. దేవ స్థానంలోని అరుగుపై.. పొరుగింటి వ్యక్తులు పక్కపక్కన కూర్చుని మాట్లాడుకున్నట్టుగా ఉండడంతో ఎక్కువ మంది షేర్లు, లైకులు చేస్తుండడం గమనార్హం. మొత్తం కర్నూలు పర్యటనలో ఈ ఫొటో హైలెట్గా నిలవడం గమనార్హం.
This post was last modified on October 16, 2025 7:00 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…