ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయం. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పీఎం మోదీ, విజనరీ సీఎం చంద్రబాబుల కాంబోలో నవ్యాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని ఆయన అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పుకొచ్చారు. పాతికేళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, పీఎంగా మోదీ ఉన్నారని కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందని, ఈ విషయంలో సందేహం లేదని చెప్పారు. సరైన సమయంలో మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం అదృష్టమని అన్నారు.
మోదీ మాదిరి నిర్విరామంగా నిరంతరం పనిచేసే ప్రధానిని తాను చూడలేదని, 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి భారత్ చేరిందని ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో 99శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి డబుల్ బెనిపిట్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందాయని అన్నారు.
This post was last modified on October 16, 2025 5:23 pm
సంక్రాంతి పండుగ హడావుడి మొదలవడంతో హైదరాబాద్ నగరం ఒక్కసారిగా ఖాళీ అవుతోంది. సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో విజయవాడ జాతీయ రహదారి…
టాలీవుడ్లో సక్సెస్ ఫార్ములా తెలిసిన దర్శకుల్లో అనిల్ రావిపూడి ఒకరు. కెరీర్ ప్రారంభం నుంచి ఆయన ఎంచుకుంటున్న పంథా చాలా…
తెలంగాణలో జనసేన టార్గెట్ ఫిక్స్ అయింది. జనసేన ప్రధాన లక్ష్యం 2028 అసెంబ్లీ ఎన్నికలేనని తెలంగాణ జనసేన ఇన్చార్జ్ శంకర్గౌడ్…
వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…
క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…
అప్పుడు మహ్మద్ గజని… ఇప్పుడు వైఎస్ జగన్ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…