ప్రపంచ దేశాలలో అత్యంత శక్తిమంతమైన ప్రధానులల ఒకరు భారత ప్రధాని నరేంద్ర మోదీ ఒక వైపు…భారత దేశంలోని రాష్ట్రాలలో అత్యంత అనుభవం ఉన్న ముఖ్యమంత్రులలో ఒకరైన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు మరోవైపు…ఇటువంటి డెడ్లీ కాంబినేషన్ ఉంటే ఇటు రాష్ట్రం..అటు కేంద్రం అభివృద్ధి పథంలో దూసుకుపోవడం ఖాయం. డేరింగ్ అండ్ డ్యాషింగ్ పీఎం మోదీ, విజనరీ సీఎం చంద్రబాబుల కాంబోలో నవ్యాంధ్ర శరవేగంగా అభివృద్ధి చెందుతోంది. ఈ నేపథ్యంలోనే కర్నూలులో ఏర్పాటు చేసిన సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్ సభలో ప్రధాని మోదీపై సీఎం చంద్రబాబు ప్రశంసలు కురిపించారు.
మనందరి భవిష్యత్తు కాపాడే నాయకుడు ప్రధాని మోదీ అని చంద్రబాబు అన్నారు. జీఎస్టీ సంస్కరణలతో ప్రజలందరూ లాభం పొందారని ఆయన అన్నారు. సూపర్ సేవింగ్స్ ప్రారంభం మాత్రమేనని, రాబోయే రోజుల్లో మరిన్ని ఉంటాయని చెప్పుకొచ్చారు. పాతికేళ్లుగా ప్రజా సేవలో సీఎంగా, పీఎంగా మోదీ ఉన్నారని కొనియాడారు. 21వ శతాబ్దం మోదీకి చెందుతుందని, ఈ విషయంలో సందేహం లేదని చెప్పారు. సరైన సమయంలో మోదీ వంటి నాయకుడిని పొందడం దేశం అదృష్టమని అన్నారు.
మోదీ మాదిరి నిర్విరామంగా నిరంతరం పనిచేసే ప్రధానిని తాను చూడలేదని, 2047 నాటికి ప్రపంచంలో భారత్ అగ్రస్థానంలో ఉంటుందని అన్నారు. మోదీ సంకల్పంతో 11వ స్థానం నుంచి నాలుగో స్థానానికి భారత్ చేరిందని ప్రశంసించారు. జీఎస్టీ తగ్గింపుతో 99శాతం వస్తువులు 5 శాతం జీఎస్టీ పరిధిలోకి వచ్చాయని చెప్పారు. డబుల్ ఇంజిన్ సర్కార్ వల్ల ఏపీకి డబుల్ బెనిపిట్ వచ్చింది. సూపర్ సిక్స్ పథకాలు, సూపర్ జీఎస్టీతో ప్రజలకు సూపర్ సేవింగ్స్ అందాయని అన్నారు.
This post was last modified on October 16, 2025 5:23 pm
ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…
ఇండస్ట్రీలో వరుసగా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవకాశాలు దక్కించుకోవడం అంత తేలికైన విషయం కాదు. కానీ కొందరు డైరెక్టర్లు మాత్రం తమ…
ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…
ఫిలిం ఇండస్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబర్ స్థానానికి పోటీ పడ్డ ఇద్దరు టాప్ హీరోల మధ్య మంచి స్నేహం…
ఏంటో టాలీవుడ్ లో ఏదీ మాట మీద అనుకున్నది అనుకున్నట్టు జరుగుతుందన్న గ్యారెంటీ లేకుండా పోతోంది. వాయిదాల పర్వంలో నలిగిపోతున్న…
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…