Political News

దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన,నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో ఏపీ అభివృద్ధి ఎంతో కీలకమని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకం అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులతో సీమ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కొనియాడారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే యువతకు అపార శక్తి ఉందని అన్నారు. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని చెప్పారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 16 నెలలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఓ వైపు ఢిల్లీ, మరోవైపు అమరావతి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తామని, 21వ శతాబ్దం..140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం అని అన్నారు.

This post was last modified on October 16, 2025 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

జననాగయన్ లీక్ వెనుక..

ఒక భారీ చిత్రం విడుదలకు చాలా రోజుల ముందే హెచ్డీ ప్రింట్ లీక్ అయిపోవడం గత కొద్ది కాలంలో తొలిసారిగా…

2 hours ago

గాడ్ ఆఫ్ వార్… ఏదో ఒకటి తేలిపోవాలి

గాడ్ ఆఫ్ వార్.. ఏడాది కిందట్నుంచి టాలీవుడ్లో విపరీతంగా చర్చనీయాంశం అవుతున్న ప్రాజెక్టు. ఇప్పటిదాకా ఎక్కువగా ఫ్యామిలీ, మాస్, యాక్షన్…

2 hours ago

మృణాల్‌తో సినిమా చేస్తే హీరో ఔటేనా?

సినిమాల్లో పాత్రలను కొంతమంది నిజ జీవితంలో కూడా ఎంతో ఓన్ చేసుకుంటారు. తెరపై వారికి అన్యాయం జరిగితే నిజంగానే వారికేదో నష్టం…

4 hours ago

ఒక్కొక్క పార్టీకీ `3 గంట‌లు`…

పార్ల‌మెంటులో డీలిమిటేష‌న్ స‌హా.. మ‌హిళా రిజ‌ర్వేష‌న్ బిల్లుపై చ‌ర్చించేందుకు.. ఎంత‌స‌మ‌య‌మైనా ఇచ్చేందుకు కేంద్ర ప్ర‌భుత్వం రెడీ అయింది. ఈ వ్య‌వ‌హారంపై…

5 hours ago

జగన్ మకాం మార్పు.. సెంటిమెంటా? రాజకీయ వ్యూహమా?

అధికారాన్ని కోల్పోయిన తర్వాత బెంగళూరు–తాడేపల్లి మధ్యనే ఎక్కువగా సమయం గడుపుతున్న వైసీపీ అధినేత వైయస్ జగన్ ఇప్పుడు కొత్త నిర్ణయంపై…

6 hours ago

తల్లిని తరిమేశారు.. చెల్లిని గెంటేశారు.. ముమ్మాటీకీ సైకోయిజ‌మే..

వైసిపి అధినేత వైయస్ జగన్ తీరుపై మంత్రి నారా లోకేష్ మరోసారి నిప్పులు చెరిగారు. ఏం రాక్షస మనస్తత్వం అంటూ…

6 hours ago