Political News

దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన,నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో ఏపీ అభివృద్ధి ఎంతో కీలకమని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకం అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులతో సీమ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కొనియాడారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే యువతకు అపార శక్తి ఉందని అన్నారు. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని చెప్పారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 16 నెలలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఓ వైపు ఢిల్లీ, మరోవైపు అమరావతి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తామని, 21వ శతాబ్దం..140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం అని అన్నారు.

This post was last modified on October 16, 2025 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

చంద్రబాబును కలిసిన కాంగ్రెస్ మంత్రి

ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్‌కు…

59 minutes ago

సైకో హంతకుడిగా నటించిన స్టార్ హీరో

మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…

1 hour ago

ఎంగేజ్మెంట్ తర్వాత ఆమె చేతికి రింగ్ లేదేంటి?

టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…

1 hour ago

కాసేపు క్లాస్ రూములో విద్యార్థులుగా మారిన చంద్రబాబు, లోకేష్

పార్వతీపురం మన్యం జిల్లా, భామినిలో నేడు నిర్వహించిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,…

2 hours ago

పవన్ కల్యాణ్ హీరోగా… టీడీపీ ఎమ్మెల్యే నిర్మాతగా…

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి. తొలినాళ్లలో తీసిన చాలా సినిమాలు బ్లాక్ బస్టర్…

3 hours ago

రష్యా vs ఉక్రెయిన్ – ఇండియా ఎవరివైపో చెప్పిన మోడీ

ప్రపంచమంతా ఉత్కంఠగా ఎదురుచూస్తున్న సమావేశం ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌లో జరిగింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, భారత ప్రధాని నరేంద్ర…

4 hours ago