Political News

దేశాభివృద్ధికి ఏపీ కీలకం: మోదీ

దేశవ్యాప్తంగా 28 శాతం జీఎస్టీ ఉన్న చాలా వస్తువులు, సేవలను ఇప్పుడు 18 శాతం జీఎస్టీ లేదా 5 శాతం జీఎస్టీకే ప్రజలంతా పొందుతున్న సంగతి తెలిసిందే. ఇకపై, కేవలం జీఎస్టీలో రెండు శ్లాబులు మాత్రమే ఉండేలా, ముఖ్యమంగా పేద, మధ్య తరగతి ప్రజలకు భారీ ఊరట కలిగేలా కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.ఈ క్రమంలోనే జీఎస్టీ తగ్గింపుతో దసరా, దీపావళి సందర్భంగా ప్రజలకు సూపర్ సేవింగ్స్ లభించాయి. ఈ నేపథ్యంలోనే కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలుపుతూ రాష్ట్ర ప్రభుత్వం సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ పేరుతో కర్నూలులో బహిరంగ సభ ఏర్పాటు చేసింది.

ఈ బహిరంగ సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పలుచోట్ల నిర్మించిన,నిర్మించబోతున్న రూ.13,429 కోట్ల విలువైన ప్రాజెక్టులకు మోదీ వర్చువల్ గా ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఆ తర్వాత సభలో ప్రసంగించిన మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. దేశాభివృద్ధిలో ఏపీ అభివృద్ధి ఎంతో కీలకమని, ఏపీ అభివృద్ధికి రాయలసీమ అభివృద్ధి ఎంతో కీలకం అని మోదీ అన్నారు. ఈ ప్రాజెక్టులతో సీమ డెవలప్ అవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఆత్మగౌరవం, సంస్కృతికి నిలయంగా, సైన్స్, ఆవిష్కరణల కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందని కొనియాడారు. ఏపీలో ఎన్నో అవకాశాలున్నాయని, వాటిని అందిపుచ్చుకునే యువతకు అపార శక్తి ఉందని అన్నారు. ఈ రోజు శ్రీశైలం మల్లికార్జున స్వామి ఆశీస్సులు పొందానని చెప్పారు.

సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ల రూపంలో ఏపీకి శక్తిమంతమైన నాయకత్వం ఉందని కితాబిచ్చారు. ఏపీకి కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఉంటుందని భరోసానిచ్చారు. డబుల్ ఇంజన్ సర్కారు వల్ల 16 నెలలుగా ఏపీ శరవేగంగా అభివృద్ధి చెందుతోందని అన్నారు. ఓ వైపు ఢిల్లీ, మరోవైపు అమరావతి అభివృద్ధి పథంలో దూసుకుపోతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. 2047 నాటికి వికసిత్ భారత్ సాధిస్తామని, 21వ శతాబ్దం..140 కోట్ల మంది భారతీయుల శతాబ్దం అని అన్నారు.

This post was last modified on October 16, 2025 5:17 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

రఘురామ జైలులో ఉన్నప్పుడు ముసుగు వేసుకొని వచ్చిందెవరు?

నాలుగు గంటల విచారణలో అన్నీ ముక్తసరి సమాధానాలే..! కొన్నిటికి మౌనం, మరికొన్నిటికి తెలియదు అంటూ దాటవేత.. విచారణలో ఇదీ సీఐడీ…

41 minutes ago

అకీరాను లాంచ్ చేయమంటే… అంత‌కంటేనా?

తెలుగు సినీ ప్రేక్ష‌కులు అత్యంత ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న అరంగేట్రాల్లో అకీరా నంద‌న్‌ది ఒక‌టి. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్…

1 hour ago

టీ-బీజేపీ… మోడీ చెప్పాక కూడా మార్పు రాలేదా?

తెలంగాణ బిజెపిని దారిలో పెట్టాలని, నాయకుల మధ్య ఐక్యత ఉండాలని, రాజకీయంగా దూకుడు పెంచాలని కచ్చితంగా నాలుగు రోజుల కిందట…

2 hours ago

క్రింజ్ కామెంట్ల‌పై రావిపూడి ఏమ‌న్నాడంటే?

అనిల్ రావిపూడిని టాలీవుడ్లో అంద‌రూ హిట్ మెషీన్ అంటారు. ద‌ర్శ‌క ధీరుడు రాజ‌మౌళి త‌ర్వాత అప‌జ‌యం లేకుండా కెరీర్‌ను సాగిస్తున్న…

2 hours ago

100 కోట్లు ఉన్నా ప్రశాంతత లేదా? ఎన్నారై స్టోరీ వైరల్!

అమెరికా వెళ్లాలి, బాగా సంపాదించి ఇండియా వచ్చి సెటిల్ అవ్వాలి అనేది చాలామంది మిడిల్ క్లాస్ కుర్రాళ్ళ కల. కానీ…

3 hours ago

ట్రెండుకు భిన్నంగా వెళితే ఎలా జగన్?

బ‌లంగా మాట్లాడాలి. మాట‌కు మాట కౌంట‌ర్ ఇవ్వాలి. అది వింటే ప్ర‌త్య‌ర్థులు నోరు అప్ప‌గించాలి!. రాజకీయాల్లో ఇప్పుడు ఇదే ట్రెండ్…

5 hours ago