కర్నూలులో నిర్వహించిన సూపర్ జీఎస్టీ-సూపర్ సేవింగ్స్ భారీ బహిరంగ సభలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ, సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తొలుత మాట్లాడిన మంత్రి నారా లోకేష్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆద్యంత ప్రధాని మోడీని ప్రశంసలతో ముంచెత్తిన నారా లోకేష్.. అమెరికా అధ్యక్షుడు ట్రంప్, దాయాది దేశం పాకిస్థాన్ వ్యవహార శైలిన ప్రస్తావించారు. ఆ రెండు దేశాలకు ప్రధాని మోడీ తగిన విధంగా బుద్ధి చెప్పారని అన్నారు.
ఈ సందర్భంలోనే “ఫ్లూట్ జింక ముందు ఊదు.. కానీ, సింహం ముందు కాదు!” అని ఆయా దేశాలకు పరోక్షంగా తేల్చి చెప్పారు. జీఎస్టీ తగ్గింపు నిర్ణయం ద్వారా ప్రధాన మంత్రి దేశంలోని పేదలకు అనేక వరాలు ఇచ్చారని అన్నారు. తొలుత ఈ ప్రతిపాదన వచ్చినప్పుడు కొందరు అధికారులు ప్రధానిని కలిసి.. ఇలా చేస్తే.. ప్రభుత్వానికి ఆర్థికంగా తీవ్ర నష్టం వస్తుందని చెప్పారని, అయినా పేదల కోసం.. తాను ఏం చేయడానికైనా సిద్ధమేనని ప్రధాని చెప్పారని తెలిపారు.
ఈ క్రమంలోనే జీఎస్టీ 2.0 సంస్కరణలు తీసుకువచ్చారని అన్నారు. ఆత్మనిర్భర్ భారత్ ద్వారా దేశాన్ని ముందుకు నడిపిస్తున్నారని తెలిపారు. ప్రధాని మోడీ భారత్ ను తిరుగులేని శక్తిగా నిలబెడుతున్నారని తెలిపారు. దేశాన్ని సూపర్ పవర్ గా మార్చిన నాయకుడు కూడా మోడీనేని తెలిపారు. “మోడీ కొట్టిన దెబ్బకు పాకిస్థాన్కు దిమ్మ తిరిగిపోయింది. అమెరికా సుంకాలు విధిస్తే.. ప్రపంచం విలవిలలాడిపోయింది. కానీ, మోడీ ఎక్కడా జంకలేదు. ఆత్మనిర్భర్ భారత్కు పెద్దపీట వేశారు. అందుకే చెబుతున్నా.. ఫ్లూటు జింక ముందు ఊదు. సింహం ముందు కాదు.” అని నారా లోకేష్ వ్యాఖ్యానించారు.
ప్రధాని మోడీ కేవలం దేశాన్ని మాత్రమే కాదని, రెండు తరాలను కూడా ముందుండి నడిపిస్తున్నారని లోకేష్ అన్నారు. రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కారు దూసుకుపోతోందన్నారు. పేదలకు మేలు చేయడంలో ప్రధాని ముందుంటున్నారని కొనియాడారు. కేంద్రంలోను.. రాష్ట్రంలో ఎన్డీయే కూటమి ప్రజలకు మేలు చేస్తోందన్నారు. జీఎస్టీ తగ్గింపుతో పేదలకు, వ్యాపారులకు కూడా మేలు జరుగుతోందన్నారు.
This post was last modified on October 16, 2025 3:52 pm
తెలుగు రాష్ట్రాల మధ్య విభజన వ్యాఖ్యలపై మరోసారి చర్చ మొదలైంది. తెలంగాణ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా…
ప్రధాని నరేంద్ర మోదీ స్కిన్ టోన్పై సోషల్ మీడియాలో చర్చ జోరందుకుంది. రెండు వేర్వేరు ప్రాంతాల్లో చిత్రీకరించిన వీడియోల్లో ఆయన…
మొన్న శుక్రవారం విడుదలైన తిమ్మరాజుపల్లి టీవీకి ప్రమోషన్లయితే ఘనంగా జరిగాయి. ఈవెంట్లు, ప్రెస్ మీట్లు, ఇంటర్వ్యూలు అన్నీ చేశారు. నిర్మాత…
అనుకున్నంతా అయ్యింది. జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కలయికలో తెరకెక్కుతున్న ప్యాన్ ఇండియా మూవీ ఈ ఏడాది రావడం లేదు.…
గత ఏడాది ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీలో అతి పెద్ద సర్ప్రైజ్ అంటే.. ‘మహావతార నరసింహా’నే. పెద్దగా అంచనాలు లేకుండా విడుదలైన…
రాష్ట్రంలో కారుణ్య నియామకాల అమలు విధానంపై ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. నియంత్రణ లేకుండా పెరుగుతున్న ఈ…