తెలంగాణలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశం రాజకీయ దుమారం రేపిన సంగతి తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో సైతం ఈ రిజన్వేషన్లు అమలు చేయాలని రేవంత్ సర్కార్ రెడీ అయింది. అయితే, ఆ వ్యవహారం సుప్రీం కోర్టుకు చేరడంతో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ ఏర్పడింది. ఈ క్రమంలోనే తెలంగాణ ప్రభుత్వానికి షాకిస్తూ తాజాగా సుప్రీం కోర్టు సంచలన తీర్పునిచ్చింది. బీసీ రిజర్వేషన్ల అంశంపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన స్పెషల్ లీవ్ పిటిషన్ (ఎస్ఎల్పీ)ను సుప్రీంకోర్టు కోర్టు కొట్టివేసింది. 50 శాతం రిజర్వేషన్ల పాత పద్ధతిలోనే ఎన్నికలకు వెళ్లాలని ఆదేశించింది.
సుప్రీంకోర్టులో తెలంగాణ ప్రభుత్వానికి చుక్కెదురైంది. 50% రిజర్వేషన్లు దాటకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని సుప్రీం కోర్టు ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన SLPని సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. 50% రిజర్వేషన్లు దాటకూడదని నిబంధన ఉన్నప్పుడు సర్వే చేసి లాభం ఏంటని ప్రభుత్వం తరఫు లాయర్ ను సుప్రీం కోర్టు ప్రశ్నించింది. అసలు చట్టం చేయకుండా జీవో ఎలా ఇస్తారని దేశపు సర్వోన్నత న్యాయస్థానం ప్రశ్నించింది.
This post was last modified on October 16, 2025 3:40 pm
రాజమౌళి దర్శకత్వంలో మహేష్ బాబు.. ఈ వార్త నిజం కావడానికి దశాబ్దంన్నర పాటు ఎదురు చూడాల్సి వచ్చింది అభిమానులు. వీరి…
రామ్ గోపాల్ వర్మ సత్యతో స్టార్ ఆర్టిస్టుగా మారిపోయిన మనోజ్ బాజ్ పాయ్ తెలుగులోనూ హ్యాపీ, ప్రేమకథ, కొమరం పులి…
సంక్రాంతికి ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రంతో భారీ విజయాన్నందుకున్నాడు మెగాస్టార్ చిరంజీవి. దీని కంటే ముందు ఆయన మొదలుపెట్టిన…
తిరుమల శ్రీవారి లడ్డూ విషయంలో కల్తీ నెయ్యి వ్యవహారం మరింత కాక రేపుతోంది. గత 2024 సెప్టెంబరు నుంచి ఇప్పటి…
గుంటూరు కారం తర్వాత మహేష్ బాబు దర్శనం లేక డీలాపడిన అభిమానులకు ఊరట కలిగించేలా వారణాసి ఇంటర్వ్యూలు విడుదలయ్యాయి. మహేష్…
ప్రపంచంలోనే అతి పెద్ద సినిమా మార్కెట్ ఉన్న దేశాల్లో భారత్ ఒకటి. ఐతే భారీ చిత్రాల వీక్షణలో అద్భుతమైన అనుభూతిని…