Political News

బరువు తగ్గావ్..లోకేశ్ కు మోదీ కాంప్లిమెంట్

ఏపీలో ప్రధాని మోదీ నేడు పర్యటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే కర్నూలు పర్యటనకు వచ్చిన మోదీకి ఓర్వకల్లు విమానాశ్రయంలో ఏపీ సీఎం చంద్రబాబు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, ఐటీ శాఖా మంత్రి నారా లోకేశ్ ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా లోకేశ్ తో మోదీ సరదాగా చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. బరువు బాగా తగ్గిపోయావని లోకేశ్ తో మోదీ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నాయి. గతసారి చూసినప్పటికంటే ఇప్పుడు చాలా బరువు తగ్గావని లోకేశ్ తో మోదీ అన్నారు. అంతేకాదు, త్వరలోనే మీ నాన్నలా తయారవుతావంటూ మోదీ చెప్పారు.

అంతకుముందు, ప్రధాని మోదీకి ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మంత్రి లోకేశ్ తదితరులు ఘన స్వాగతం పలికారు. ఓర్వకల్లు నుంచి హెలికాప్టర్లో మోదీ సున్నిపెంట చేరుకున్నారు. అనంతరం రోడ్డుమార్గంలో శ్రీశైలంలోని శ్రీ భ్రమరాంబ, మల్లికార్జున స్వామి ఆలయానికి వెళ్లి ప్రత్యేక దర్శనం చేసుకున్నారు. శ్రీశైల మల్లన్న క్షేత్రంలో మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడి నుంచి హెలీకాప్టర్లో నన్నూరుకు చేరుకొని రాగమయూరి గ్రీన్ హిల్స్ వద్ద ‘సూపర్ జీఎస్టీ.. సూపర్ ‘సేవింగ్స్’ బహిరంగ సభలో పాల్గొంటారు. ఓర్వకల్లు పారిశ్రామిక వాడకు శంకుస్థాపన చేసి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. వివిధ కార్యక్రమాల్లో పాల్గొని సాయంత్రం 4.45 గంటలకు తిరిగి ఢిల్లీకి మోదీ పయనమవుతారు.

This post was last modified on October 16, 2025 3:36 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

`ఏఐ`లో ఏపీ దూకుడు.. పార్ల‌మెంటు సాక్షిగా కేంద్రం!

ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్‌(ఏఐ)లో ఏపీ దూకుడుగా ఉంద‌ని కేంద్ర ప్ర‌భుత్వం తెలిపింది. ఏఐ ఆధారిత ఉత్ప‌త్తులు, వృద్ధి వంటి అంశాల్లో ఏపీ…

2 hours ago

అధికారంలో ఉన్నాం ఆ తమ్ముళ్ల బాధే వేరుగా ఉందే…!

అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…

5 hours ago

డాలర్లు, మంచి లైఫ్ కోసం విదేశాలకు వెళ్ళాక నిజం తెలిసింది

డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…

8 hours ago

జగన్ ఇలానే ఉండాలంటూ టీడీపీ ఆశీస్సులు

వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవ‌రినీ దెబ్బతీయరు.…

11 hours ago

టీం ఇండియా ఇప్పటికైన ఆ ప్లేయర్ ను ఆడిస్తుందా?

రాయ్‌పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…

11 hours ago

చరిత్ర ఎన్నోసార్లు హెచ్చరిస్తూనే ఉంది

కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…

13 hours ago