బీహార్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఒక అభ్యర్థి జీవిత కథ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అతను మరేవరో కాదు, నీరజ్ సింగ్. ఒకప్పుడు ఢిల్లీలో సెక్యూరిటీ గార్డ్గా పని చేసిన ఈ 38 ఏళ్ల యువకుడు, ఇప్పుడు రూ. 400 కోట్ల టర్నోవర్తో కంపెనీని నడుపుతున్నాడు. ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ నేతృత్వంలోని జన్ సూరాజ్ పార్టీ తరఫున శేవహార్ స్థానం నుంచి నీరజ్ సింగ్ బరిలోకి దిగడం, అతని స్ఫూర్తిదాయక ప్రయాణానికి మరింత బలాన్నిచ్చింది.
బీహార్లోని శేవహార్ జిల్లా, మథురాపూర్ గ్రామానికి చెందిన నీరజ్ సింగ్ చాలా సాధారణ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చారు. 13 ఏళ్లకే పదో తరగతి పాస్ అయిన తర్వాత, ఇంటికి సాయంగా ఉండాలని ఉద్యోగం కోసం వెతికారు. కానీ చిన్న వయసు కావడంతో ఎవరూ పని ఇవ్వలేదు. దాంతో గ్రామంలో పెట్రోల్, డీజిల్ అమ్మడం మొదలుపెట్టారు. మూడేళ్ల తర్వాత బతుకు తెరువు కోసం ఢిల్లీకి వెళ్లి సెక్యూరిటీ గార్డ్గా పని చేశారు.
ఢిల్లీ నుంచి పుణెకు మారిన నీరజ్, అక్కడ ఒక ప్రైవేట్ సంస్థలో ఆఫీస్ అటెండెంట్గా జాయిన్ అయ్యారు. ఆ తరువాత తన కష్టంతో, పట్టుదలతో హ్యూమన్ రిసోర్సెస్ ప్రొఫెషనల్గా ఎదిగారు. అక్కడితో ఆగకుండా 2010లో సొంతంగా ధాన్యం వ్యాపారాన్ని ప్రారంభించారు. అక్కడే కష్టానికి తగ్గ ఫలితం దక్కింది, వ్యాపారం వేగంగా పుంజుకుంది.
ఆ తర్వాత అతను ఉషా ఇండస్ట్రీస్ను స్థాపించారు. ఈ కంపెనీ ఇటుకలు, బిల్డింగ్ బ్లాక్లు, టైల్స్ వంటి సిరామిక్ ఉత్పత్తులతో పాటు రోడ్ల నిర్మాణ రంగంలోకి కూడా అడుగు పెట్టింది. ఇటీవల ఒక పెట్రోల్ పంపును కూడా ప్రారంభించారు. మోతిహార్ కేంద్రంగా పనిచేస్తున్న ఆయన కంపెనీ టర్నోవర్ ఇప్పుడు ఏకంగా రూ. 400 కోట్లుగా ఉంది. ఈ సంస్థలో దాదాపు 2,000 మందికి ఉద్యోగం లభిస్తోంది.
ఒకప్పుడు సైకిల్ కూడా లేక పక్కింటి వారి సైకిల్ అడిగి వాడుకున్న నీరజ్ సింగ్, ఇప్పుడు రేంజ్ రోవర్తో పాటు అరడజను లగ్జరీ కార్లకు యజమాని. లా డిగ్రీ పూర్తి చేసిన ఆయన, తన భార్య, ఇద్దరు కొడుకులు, తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నారు. వ్యాపారమే కాకుండా, పలు సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పేద మహిళల పెళ్లిళ్లకు ఆర్థిక సాయం చేయడం, వృద్ధులకు ఉచిత ఆరోగ్య శిబిరాలు, పుణ్యక్షేత్రాల యాత్రలు నిర్వహించడం వంటి పనుల్లో నిమగ్నమై ఉన్నారు. సెక్యూరిటీ గార్డ్ స్థాయి నుంచి కోట్లాది రూపాయల సామ్రాజ్యాన్ని స్థాపించిన నీరజ్ సింగ్, ఇప్పుడు రాజకీయాల్లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
This post was last modified on October 16, 2025 1:27 pm
తమిళ రాజకీయాల్లో తన అరంగేట్రం చేస్తున్న నటుడు విజయ్ (తమిళగ వెట్రి కళగం), గతంలో ఏపీలో పవన్ కళ్యాణ్ అనుసరించిన…
పవన్ కళ్యాణ్ కొత్త సినిమా నుంచి పాట వస్తోందంటే అభిమానులకు ఎక్కడ లేని హుషారు పుట్టుకొస్తుంది. అందులోనూ గబ్బర్ సింగ్…
నెల్లూరు పార్లమెంటు సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యవహారం వైసీపీలో హాట్ టాపిక్గా మారింది. ఇటీ వల వేమిరెడ్డి ప్రభాకర్రెడ్డి,…
వైసీపీ హయాంలో అప్పటి సీఎం జగన్ కనుసన్నల్లో పనిచేసిన అధికారులు రూల్స్ను పక్కన పెట్టి ఇష్టానుసారంగా వ్యవహరించారని ఆరోపణలు ఉన్నాయి.…
జగన్ హయాంలో తీసుకున్న పలువురు నిర్ణయాలు రాష్ట్రాన్ని వెనక్కి నెట్టాయని, ముఖ్యంగా ఆర్థికంగానే కాకుండా రాజధాని పరంగా కూడా రాష్ట్రానికి…
రాజస్థాన్ రాష్ట్రంలోని జోధ్పూర్ జిల్లా మనాయ్ గ్రామంలో శనివారం జరగాల్సిన వివాహ కార్యక్రమాలకు కొద్దిగంటల ముందు ఇద్దరు అక్కచెల్లెళ్లు అనుమానాస్పద…