బీఆర్ఎస్ మాజీ నాయకురాలు, మాజీ ఎమ్మెల్సీ కవిత ప్రజల మధ్యకు వస్తేందుకు రెడీ అయ్యారు. జాగృతి జనం బాట పేరుతో ఆమె ఈ నెల చివరి వారం నుంచి రాష్ట్ర పర్యటనకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో తాజా జాగృతి జనం బాట కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. హైదరాబాద్లో జరిగిన కార్యక్రమంలో జాగృతి కార్యకర్తల మధ్య ఈ పోస్టర్ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టర్లో కేవలం ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ తల్లి ఫోటోలు మాత్రమే ముద్రించారు.
దీనిపై గత 24 గంటల్లో మీడియాకు లీక్ అయిన విషయమే తెలిసిందే. ఇక, పోస్టర్ ఆవిష్కరణ అనంతరం కవిత కీలక వ్యాఖ్యలు చేశారు. కేసీఆర్ది-తనది దారులు వేరయ్యాయని తెలిపారు. అందుకే తాను ఆ పార్టీ అధినేత చిత్రాన్ని వాడడం సరికాదని, ఆ అవసరం కూడా లేదని వ్యాఖ్యానించారు. అందుకే ఆయన ఫొటోను పెట్టుకోలేదని తెలిపారు. ఇక నుంచి తాను ప్రజల మనిషినని, వారే తనకు హైకమాండ్ అని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా తన పర్యటనలు జరుగుతాయని చెప్పారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి తన జాగృతి జనం బాట కార్యక్రమం ముగియనుందని తెలిపారు. ఈ సందర్భంగా మేధావులు, ఉద్యమకారుల సలహాలను తీసుకుంటానని వివరించారు. ప్రధానంగా గ్రామీణ ప్రాంతాలపై తన పర్యటన దృష్టి సారించనుందని వెల్లడించారు. అనేక మంది ప్రజలు రాష్ట్రం కోసం ప్రాణత్యాగం చేశారన్నారు. వారి ఆశయ సాధనలో తాను కూడా గళం విప్పుతానని తెలిపారు.
మొత్తానికి ఇది రాజకీయ పార్టీనా కాదా అనే విషయంలో మాత్రం కవిత క్లారిటీ ఇవ్వలేదు.
This post was last modified on October 15, 2025 6:54 pm
దేశంలో కీలక రాష్ట్రాలైన పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళలతో పాటు మరో రెండు రాష్ట్రాలు అసోం, పుదచ్ఛేరి అసెంబ్లీ ఎన్నికల…
పెద్ద హీరోలకు సామాన్య ప్రేక్షకుల్లోనే కాదు.. ఇండస్ట్రీలోనూ అభిమానులుంటారు. యంగ్ టైగర్ ఎన్టీఆర్కు అలాంటి ఫ్యాన్స్ ఇండస్ట్రీలో చాలామందే ఉన్నారు.…
మల్లువుడ్ అతి పెద్ద స్టార్ హీరోలు మమ్ముట్టి, మోహన్ లాల్ 18 సంవత్సరాల తర్వాత కలిసి నటించడం అంటే మాములు…
సరిగ్గా ఇంకో ముప్పై రోజుల్లో పెద్ది ప్రీమియర్ డే వచ్చేస్తుంది. నిర్మాత వెంకట సతీష్ కిలారు ప్రకటించిన దాని ప్రకారం…
ఇటీవలే విడుదలైన బాలీవుడ్ మూవీ రాజా శివాజీ బాక్సాఫీస్ వద్ద బాగానే పెర్ఫార్మ్ చేస్తోంది. మొదటి రెండు రోజులకే సుమారు…
పది సంవత్సరాల కెరీర్ లో కేవలం మూడు సినిమాలు తీసిన దర్శకుడు తరుణ్ భాస్కర్. పెళ్లి చూపులు, ఈ నగరానికి…