Political News

బుల్లెట్‌లా దూసుకుపోతున్న డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌: లోకేష్‌

రాష్ట్రంలో డ‌బుల్ ఇంజ‌న్ స‌ర్కార్‌.. బుల్లెట్ మాదిరిగా దూసుకుపోతోంద‌ని మంత్రి నారా లోకేష్ తెలిపారు. అన్ని రంగాల్లోనూ అభివృద్ది సాధిస్తున్న‌ట్టు చెప్పారు. రాష్ట్రంలో మొత్తం ఐదేళ్ల‌లో 20 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పిస్తామ‌ని ఎన్నిక‌ల‌కు ముందు హామీ ఇచ్చామ‌ని.. తొలి ఏడాదిలోనే మొత్తం 4.7 ల‌క్ష‌ల ఉద్యోగాల‌ను క‌ల్పించిన‌ట్టు వివ‌రించారు. తాజాగా విశాఖ ప‌ట్నంలో ప‌ర్య‌టించిన మంత్రి లోకేష్‌..  ఏఐ ఎడ్జ్‌ డేటా సెంటర్‌తో పాటు ఓపెన్‌ కేబుల్‌ ల్యాండింగ్‌ స్టేషన్‌కు శంకుస్థాపన చేశారు.

ఈ సంద‌ర్బంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో మంత్రి మాట్లాడుతూ.. ఒక్క ఐటీ రంగంలోనే 5 ల‌క్ష‌ల ఉద్యోగాల క‌ల్ప‌న‌కు ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. విశాఖ‌లో మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టేందుకుసంస్థ‌లు క్యూ క‌ట్టాయ‌ని వివ‌రించారు. కేంద్రం నుంచి స‌హ‌కారం సంపూర్ణంగా ఉంద‌ని.. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ  ఏపీ విష‌యంలో ఉదారంగా ఉన్నార‌ని తెలిపారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న విప‌క్ష నాయ‌కుల‌పై ప‌రోక్షంగా విమ‌ర్శ‌లు గుప్పించారు. రాష్ట్రంలో కొంద‌రు మారీచుల మాదిరిగా అభివృద్ధికి అడ్డుప‌డుతున్నార‌ని తెలిపారు.

పెట్టుబ‌డులు పెట్టేందుకు ముందుకువస్తున్న కంపెనీల‌ను ప్రోత్స‌హిస్తే.. ఓర్చుకోలేక పోతున్నార‌ని అన్నారు. అందుకే.. కోర్టుల‌కు కూడా వెళ్లి అడ్డుకునే ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. అయినా.. త‌మ ప్ర‌భుత్వం అన్ని చ‌ట్ట నిబంధ‌న‌లు పాటించి పెట్టుబ‌డుల‌కు మార్గం సుగ‌మం చేస్తోంద‌ని మంత్రి వివ‌రించారు. కేంద్రం చేపట్టే సంస్కరణల్లో ఏపీకి ప్రాధాన్యం ఇస్తోందన్న మంత్రి.. ఇప్పటికే ప‌లు కార్య‌క్ర‌మాల‌కు కేంద్రం స‌హ‌క‌రిస్తోంద‌ని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంటును కాపాడుకున్నామ‌ని చెప్పారు.

ఒక‌ప్పుడు హైద‌రాబాద్ డెవ‌ల‌ప్ అయ్యేందుకు 3 ద‌శాబ్దాలు ప‌ట్టింద‌ని, కానీ.. ఇప్పుడు విశాఖ‌ను కేవ‌లం ప‌దేళ్ల‌లోనే ప‌రుగులు పెట్టిస్తామ‌న్నారు. హైదరాబాద్‌ స్థాయిలో విశాఖను అభివృద్ధి చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నామ‌ని చెప్పారు. “మ‌న‌కు విజ‌న్ ఉన్న ముఖ్య‌మంత్రి, దూర‌దృష్టి ఉన్న ప్ర‌ధాని ఉన్నారు. ఇదే మ‌న బ‌లం. అధికార‌, రాజ‌కీయ పొర‌పాట్ల‌కు తావులేకుండా ప్ర‌జ‌ల కోసం వారు నిరంత‌రం ప‌నిచేస్తున్నారు.“ అని మంత్రి వివ‌రించారు.

రాజ‌ధానిపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ.. ఏ రాష్ట్రానికైనా రాజధాని ఒక్కటే ఉంటుంద‌న్నారు. అదేస‌మ‌యంలో అన్ని ప్రాంతాల‌ను అభివృద్ధి చేస్తామ‌ని చెప్పారు. తుగ్ల‌క్ మాత్ర‌మే రాజ‌ధానిని మార్చాడ‌ని ఈ సంద‌ర్బంగా వైసీపీ అధినేత‌, మాజీ సీఎం జ‌గ‌న్‌పై ప‌రోక్షంగా వ్యాఖ్యానించారు. రాష్ట్రానికి త్వ‌ర‌లోనే 120 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులు రాబోతున్నాయని తెలిపారు. అయితే.. ఐటీ రాజ‌ధానిగా ఉన్న విశాఖ‌కు 50 శాతం పెట్టుబ‌డులు రానున్నాయ‌ని వివ‌రించారు.

This post was last modified on October 12, 2025 10:59 pm

Share
Show comments
Published by
Kumar
Tags: Lokesh

Recent Posts

పవర్ స్టార్ మేజిక్ పని చేస్తోంది

ఉస్తాద్ భగత్ సింగ్ కు యునానిమస్ టాక్ రాలేదు. అభిమానులు బాగుందన్నారు. క్రిటిక్స్ రొటీనని తేల్చేశారు. న్యూట్రల్ ఆడియన్స్ జస్ట్…

3 minutes ago

దేవిశ్రీ ప్రసాద్ దూరానికి కారణమిదేనా ?

పవన్ కళ్యాణ్ కలయికలో అత్తారింటికి దారేది, గబ్బర్ సింగ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దేవిశ్రీ ప్రసాద్ తాజాగా విడుదలైన…

39 minutes ago

పెంపుడు పిల్లి చ‌నిపోయింద‌ని.. ఉరేసుకున్న విద్యార్థిని!

పెంపుడు జంతువుల ప‌ట్ల య‌జ‌మానులు, కుటుంబ స‌భ్యులు ఎంత ప్రేమ‌ను పెంచుకుంటారో ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన అవ‌స‌రం లేదు. ఆయా జంతువులు…

1 hour ago

ఉస్తాద్ పాట‌ల వాడ‌కం.. ఎంత ఖ‌ర్చు పెట్టారో?

ఒక‌ప్పుడు పాత సినిమాల పాట‌లను య‌థేచ్ఛ‌గా వాడేసుకునేవారు కొత్త చిత్రాల్లో. ఎవ‌రికీ ఏ అభ్యంత‌రాలు ఉండేవి కావు. కానీ ఇప్పుడు…

2 hours ago

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

5 hours ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

6 hours ago