Political News

డిజిట‌ల్ బుక్ పెట్టాం.. ఎవ‌రూ రావొద్దంటే ఎలా

వైసిపి అధినేత జగన్ ఇటీవల డిజిటల్ బుక్ పేరుతో ఒక యాప్‌ను తీసుకువచ్చారు. వైసీపీ సమస్యలు, నాయకుల పై నమోదవుతున్న కేసులు, వారి విషయంలో ఏ విధమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారనే అంశాలను కూడా ఈ యాప్‌లో నమోదు చేయాలని ఆయన పార్టీ కేడర్‌కు సూచించారు.

అయితే ఇంతవరకు బాగానే ఉన్నప్పటికీ, వాస్తవానికి ఒక యాప్ ద్వారా మాత్రమే సమస్యలు పరిష్కారం అవుతాయని కానీ ఒక యాప్ ద్వారానే నాయకులపై ఒత్తిళ్లు తగ్గుతాయని గాని అనుకోలేము.

గతంలో టిడిపి కూడా ఇలానే డిజిటల్ యాప్‌ను తీసుకొచ్చింది. పార్టీ నాయకుల పై నమోదైన కేసులను అందులో నమోదు చేయాలని పేర్కొంది. అయినప్పటికీ సీఎం చంద్రబాబు, అదేవిధంగా ప్రస్తుత మంత్రి నారా లోకేష్ పార్టీ నాయకులకు అందుబాటులో ఉంటూ వచ్చారు. వారి సమస్యలు విన్నారు. వారు చెప్పింది విని పరిష్కారం కూడా చూపించారు.

కానీ దానికి భిన్నంగా ఇప్పుడు వైసీపీలో డిజిటల్ బుక్ పెట్టాము కాబట్టి ఇక ఎవరూ పార్టీ ఆఫీస్‌కి రావాల్సిన అవసరం లేదని, ఏదైనా ఉంటే డిజిటల్ బుక్ ద్వారా నమోదు చేసుకుంటే సీఎం చూస్తారని తాడేపల్లిలో కీలక నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇటీవల గుంటూరు జిల్లా ప‌ల్నాడు ప్రాంతానికి చెందిన కొంతమంది నాయకులు పార్టీ ఆఫీసుకు వచ్చారు. అయితే మీ సమస్యలు ఏంటి అని అడగాల్సిన వారే “డిజిటల్ బుక్‌లో నమోదు చేశారా? లేదా చెయ్యకపోతే నమోదు చేయండి చాలు” అని ఖరాఖండిగా చెప్పుకొచ్చారు. దీంతో వచ్చిన నాయకులు వెనుతిరిగి వెళ్లిపోవాల్సి వచ్చింది.

ఇక అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలకు చెందిన నాయకులు కూడా కొంత అసంతృప్తితో ఉన్నారు. డిజిటల్ బుక్ పెట్టడం తప్పు కాదు. కానీ తమ సమస్యలు నేరుగా చెప్పుకునే అవకాశం కల్పించాలని వారి వాదన.

కానీ ఆది నుంచి కూడా ఒకరు చెప్పింది వినే లక్షణం లేకపోవడంతో నాయకులు తీవ్ర మదనం చెందుతున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే భవిష్యత్తులో పార్టీ పుంజుకోవడం కష్టం అనే వాదన కూడా వినిపిస్తోంది.

ఎన్ని పుస్తకాలు ఉన్నా, ఎన్ని యాప్‌లు ఉన్నా ముఖాముఖి నాయకుడితో మాట్లాడితే కలిగే సంతృప్తి కార్యకర్తలకు కానీ ద్వితీయ శ్రేణి నాయకులకు కానీ ఉండదు. ఈ విషయాన్ని తెలుసుకోవడంలో వైసిపి నాయకులు మరోసారి వెనకబడ్డారని చెప్పాలి.

మరి ఈ సమస్యని ఇలాగే ఉంచుతారా? లేక పరిష్కరిస్తారా? అనేది చూడాలి. డిజిటల్ బుక్ ఒకటే ప్రామాణికమైతే అన్ని పార్టీలు ఏదో ఒక యాప్‌ను తీసుకువచ్చి కార్యకర్తలను దూరం పెట్టే పరిస్థితి ఉండేది. కానీ అలా చేయడం వల్ల పరిస్థితులు సర్దుమణ‌గమని, కార్యకర్తల్లో సంతృప్తి రాదని అన్ని పార్టీలు గమనించబట్టే నాయకులకు, కార్యకర్తలకు సమయం కేటాయించే పరిస్థితి ఉంది.

ఈ దిశగా వైసిపి ఆలోచన చేయాలి. ముఖ్యంగా జగన్ అందుబాటులోకి రావాలి అనేది పార్టీ నాయకులు కోరుతున్న మాట. మరి ఏం చేస్తారనేది చూడాలి.

This post was last modified on October 8, 2025 10:34 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

కేరళం ‘సీల్డ్ కవర్’ తెరచుకునేదెన్నడో..?

దేశంలో ఇటీవలే ముగిసిన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఎప్పుడో వెలువడ్డాయి. ఆ ఐదు రాష్ట్రాల్లో నాలుగు రాష్ట్రాల్లో…

10 minutes ago

ప్రజలను ఆందోళనకు గురి చేస్తున్న మోదీ వ్యాఖ్యలు

యావత్తు ప్రపంచాన్ని కరోనా చుట్టుముట్టిన తరుణంలో లాక్ డౌన్ అంటే ఏమిటో… ఎలా ఉంటుందో చూశాం. ఇప్పుడు కరోనా లాంటి…

3 hours ago

ఒక్క ఓటుతో గెలిస్తే ఓటేయొద్దా…?

తమిళ రాజకీయాల్లో వరుసబెట్టి ఆసక్తికర పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. తమిళనాడు అసెంబ్లీకి జరిగిన ఎన్నికల ఫలితాలు వెలువడిన దగ్గర నుంచి రోజుకో…

4 hours ago

మలుపు తిప్పేది అప్పాల సూరినే

ప్రమోషన్ల సంగతి ఎలా ఉన్నా పెద్ది ఇంకో ఇరవై రెండు రోజుల్లో థియేటర్లలో అడుగు పెట్టనుంది. ఈ నెల 18…

4 hours ago

చిన్న నటుడే కానీ పెద్ద నిజం చెప్పాడు

పెళ్లి చూపులు, జాతి రత్నాలు టైంలో బిజీ ఆర్టిస్టుగా మారిపోయిన రాహుల్ రామకృష్ణ ఈ మధ్య కనిపించడం తగ్గించేశాడు. అడపాదడపా…

5 hours ago

కేంద్రంతో క‌లుస్తాం.. మోడీతో కాదు: రేవంత్ అంత‌రంగం

హైద‌రాబాద్ ప‌ర్య‌ట‌న‌లో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ చేసిన వ్యాఖ్య‌లు.. రాజ‌కీయంగా చ‌ర్చ‌కు దారి తీసిన విష‌యం తెలిసిందే. నువ్వు నాతో…

5 hours ago