Political News

ఎవ‌రున్నా వదల‌ద్దు: చంద్ర‌బాబు

ఏపీలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన నేప‌థ్యంలో ఆయ‌న త‌క్షణ‌మే స్పందించారు. పార్టీ నాయ‌కుల‌పై వేటు వేశారు. ఇదే సమయంలో అధికారుల‌తోను, మంత్రుల‌తోనూ ఆయ‌న ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

న‌కిలీ మ‌ద్యం త‌యారీ, విక్ర‌యాల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తెర‌వెనుక ఎవ‌రున్నారో చూడాలన్నారు.

ప్ర‌భుత్వానికి మ‌చ్చ తెచ్చేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యంలో అధికారులు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మీరు కూడా ఎవ‌రెవ‌రితోనో చేతులు కలిపితే.. మిమ్మ‌ల్ని కూడా ఉపేక్షించేది లేదు. న‌కిలీ మద్యం వ్య‌వ‌హారంలో ఇత‌ర పార్టీ నాయ‌కుల ప్ర‌మేయాన్ని కూడా బయటకు లాగాలి. ఎవ‌రున్నా.. ఎంత‌టి వారైనా వ‌దిలి పెట్టొద్దు. అని చంద్ర‌బాబు ఆదేశించారు.

తెనాలికి చెందిన ఓ వైసీపీ కీల‌క నేత స‌హ‌చ‌రుడు మద్యం కేసులో ఉన్నట్టు వార్తలు వచ్చిన నేప‌ధ్యంలో ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టొద్ద‌ని ప్రత్యేక అధికారాలు కూడా వాడుకోవాల‌ని సూచించారు. వైసీపీ హయాంలో న‌కిలీ మద్యం పై పోరాడిన పార్టీగా ప్రజలలో టీడీపీకి గుర్తింపు ఉందని, ఇప్పుడు ఆ పేరు పోవకూడదని, కొంద‌రు చేస్తున్న కుట్రలను అరికట్టాల‌ని ఆయ‌న కోరారు.

This post was last modified on October 6, 2025 9:47 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

వైసీపీ పంచాంగం.. కేంద్రం ప్లస్.. రాష్ట్రం మైనస్

ఏపీలో త్వరలో మంత్రుల శాఖలు మారతాయట..? ప్రభుత్వంలో భారీగానే మార్పులు ఉంటాయట..? ఇది ఏ రాజకీయ విశ్లేషలు చెప్పిన జోస్యం…

1 hour ago

స‌మంత బంగారం కోసం రాజు గారు వ‌స్తారా?

ఒక‌ప్పుడు తెలుగు, త‌మిళంలో టాప్ హీరోయిన్ల‌లో ఒక‌రిగా ద‌శాబ్దానికి పైగా ఒక వెలుగు వెలిగిన క‌థానాయిక స‌మంత‌. కానీ కొన్నేళ్లుగా…

2 hours ago

ఆ యూట్యూబర్లకు ‘పరాభవం’ తప్పదట

సాధారణంగా ఉగాది సందర్భంగా రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు తమ ఇంట్లో పంచాంగ శ్రవణం జరుపుతుంటారు. ఈ సందర్భంగా వారికి ఈ…

2 hours ago

క‌విత పార్టీకి న్యాయ చిక్కులు… ఏం జరిగింది?

బీఆర్ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. సొంత పార్టీ పెట్టుకునేందుకు రెడీ అయిన మాజీ సీఎం కేసీఆర్ కుమార్తె క‌విత త‌న…

4 hours ago

ఫిక్స్… మూడో భాగం ఛాన్స్ లేదు

బాక్సాఫీస్ వద్ద ర్యాంపేజ్ చూపిస్తున్న దురంధర్ ది రివెంజ్ కు సంబంధించి ఒక ముఖ్యమైన ప్రశ్న అందరి మెదళ్లను తొలిచేసింది.…

4 hours ago

పవన్ పట్టుకు బాలినేని లొంగిపోయారా?

బాలినేని శ్రీనివాస రెడ్డి జనసేనలో చేరిన తర్వాత పెద్దగా యాక్టివ్ గా లేని సంగతి తెలిసిందే. అధికారికంగా జనసేన నిర్వహించే…

5 hours ago