Political News

ఎవ‌రున్నా వదల‌ద్దు: చంద్ర‌బాబు

ఏపీలో నకిలీ మద్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని, ప్రజల ప్రాణాలకు చేటు చేసే నకిలీ మద్యంపై ఉక్కుపాదం మోపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సంబంధిత అధికారులను ఆదేశించారు. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లి నియోజకవర్గం ములకలచెరువులో నకిలీ మద్యం వ్యవహారం వెలుగు చూసిన నేప‌థ్యంలో ఆయ‌న త‌క్షణ‌మే స్పందించారు. పార్టీ నాయ‌కుల‌పై వేటు వేశారు. ఇదే సమయంలో అధికారుల‌తోను, మంత్రుల‌తోనూ ఆయ‌న ప్రత్యేకంగా సమావేశమయ్యారు.

న‌కిలీ మ‌ద్యం త‌యారీ, విక్ర‌యాల కేసులో నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సీఎం చంద్ర‌బాబు ఆదేశించారు. ఈ వ్యవహారంలో నిష్పక్షపాతంగా దర్యాప్తు చేయాలన్నారు. నకిలీ మద్యం వ్యవహారంపై ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర, ఎక్సైజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, ఎన్‌ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్ దేవ్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్ శ్రీధర్‌తో క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష చేశారు. ఈ సంద‌ర్భంగా చంద్ర‌బాబు మాట్లాడుతూ.. తెర‌వెనుక ఎవ‌రున్నారో చూడాలన్నారు.

ప్ర‌భుత్వానికి మ‌చ్చ తెచ్చేలా కొంద‌రు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఈ విష‌యంలో అధికారులు కూడా జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి. మీరు కూడా ఎవ‌రెవ‌రితోనో చేతులు కలిపితే.. మిమ్మ‌ల్ని కూడా ఉపేక్షించేది లేదు. న‌కిలీ మద్యం వ్య‌వ‌హారంలో ఇత‌ర పార్టీ నాయ‌కుల ప్ర‌మేయాన్ని కూడా బయటకు లాగాలి. ఎవ‌రున్నా.. ఎంత‌టి వారైనా వ‌దిలి పెట్టొద్దు. అని చంద్ర‌బాబు ఆదేశించారు.

తెనాలికి చెందిన ఓ వైసీపీ కీల‌క నేత స‌హ‌చ‌రుడు మద్యం కేసులో ఉన్నట్టు వార్తలు వచ్చిన నేప‌ధ్యంలో ఈ విష‌యాన్ని సీరియస్‌గా తీసుకోవాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు. ఎవ‌రినీ వ‌దిలి పెట్టొద్ద‌ని ప్రత్యేక అధికారాలు కూడా వాడుకోవాల‌ని సూచించారు. వైసీపీ హయాంలో న‌కిలీ మద్యం పై పోరాడిన పార్టీగా ప్రజలలో టీడీపీకి గుర్తింపు ఉందని, ఇప్పుడు ఆ పేరు పోవకూడదని, కొంద‌రు చేస్తున్న కుట్రలను అరికట్టాల‌ని ఆయ‌న కోరారు.

This post was last modified on October 6, 2025 9:47 pm

Share

Recent Posts

యానిమల్ పార్క్… ఇంకెంత దూరం?

రణ్‌బీర్ కపూర్, సందీప్ రెడ్డి వంగా కాంబినేషన్‌లో వచ్చిన ‘యానిమల్’ 2023లో బాక్సాఫీస్ బిగ్ హిట్ గా నిలిచిన విషయం…

5 hours ago

తమన్ సమాజ సేవకు 12 కోట్ల టార్గెట్

మ్యూజిక్ డైరెక్టర్ తమన్ తన ప్రపంచంలో మరో కోణాన్ని బయటపెట్టాడు. రీసెంట్‌గా ఒక ఇంటర్వ్యూలో పర్సనల్ చారిటీ వర్క్ గురించి…

5 hours ago

చివరి సిక్సర్ కోసం కనకరాజు పోరాటం

వరుణ్ తేజ్ కు చాలా గ్యాప్ తర్వాత సక్సెస్ ఇచ్చిన సినిమాగా కొరియన్ కనకరాజు తొలి నాలుగు రోజుల్లోనే బ్రేక్…

6 hours ago

గుజరాత్ ను వణికిస్తున్న చండీపుర…. 25 పిల్లలు బలి

గుజరాత్ రాష్ట్రంలో కొత్త వైరస్ కలకలం సృష్టిస్తుంది. రోజుల పరిధిలోనే పదుల సంఖ్యలో చిన్నారుల ప్రాణాలను బలికొనడం భయాందోళన కలిగిస్తుంది.…

7 hours ago

జనసేనలో వుండాలంటే బూతులు మానాలి

కొన్నేళ్లుగా ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయ వాతావరణంలో విచారకర మార్పులు వచ్చాయి. రాజకీయ కాలుష్యం ఏర్పడ్డటంతో ప్రజలు చిరాకు పడుతున్నారు. వైసీపీ…

7 hours ago

హనుమాన్ విజయమే మహాకాళీ ధైర్యం

2027 సంక్రాంతి పందెం క్రమంగా వేడెక్కుతోంది. శర్వానంద్ - శ్రీను వైట్ల కాంబో ' జార్జ్ క్రిష్' జనవరి 14…

7 hours ago