Political News

ఇన్ని సార్లు బెంగళూరు వెళ్తే జనం మాత్రం ఎవరొస్తారు?

తెలుగు రాజకీయాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. జగన్ వస్తున్నారంటే చాలు, ఆయనను చూడటానికి జనం తారసపడటం సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో ఆ దృశ్యం కనిపించడం లేదు.

ఇటీవల బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన జగన్‌కు స్వాగతం పలికేందుకు పెద్దగా జనసంద్రం కనిపించలేదు. పార్టీ నేతలు, ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాత్రమే కనిపించగా, జగన్ చుట్టూ జనాలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ జగన్ తన చేతులు జోడించి నమస్కారం చేస్తూ నడుస్తూ వెళ్లిపోయారు.

గతంలో జగన్ బెంగళూరు వెళ్తున్నప్పుడు లేదా అక్కడి నుంచి వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.

మరింత ఆసక్తికరంగా, వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోలోని అసలు దృశ్యాలను తొలగించి, పాత జనసందోహ దృశ్యాలను జతచేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ప్రజలు గమనించక మానలేదు.

ఐదేళ్ల పాలనలో ప్రజల నుంచి దూరమవడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వ ప్రాభావం వల్ల జగన్ గ్రాప్ క్రమంగా పడిపోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్, ప్రజల మద్దతు తిరిగి పొందేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి.

This post was last modified on October 6, 2025 9:46 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

‘పవన్ అన్న’ మాటే… ‘తమ్ముడు లోకేష్’ మాట!

కూటమిలో మూడు పార్టీలు.. విభిన్నమైన భావజాలం.. అయినా ఏకతాటిపై నడుస్తున్నాయి. దానికి కారణం రాష్ట్రం బాగుండాలనే సదుద్దేశమే అని పార్టీల…

1 hour ago

అవకాశాన్ని ఆంధ్రకింగ్ వాడుకుంటాడా

రివ్యూస్, పబ్లిక్ టాక్ బాగున్నప్పటికీ ఆశించిన స్థాయిలో వసూళ్లు రాబట్టలేకపోయిన ఆంధ్రకింగ్ తాలూకా రెండో వారం నుంచి పికప్ ఆశిస్తున్నామని…

4 hours ago

అఖండ 2 ఆగింది… అసలేం జరుగుతోంది

బహుశా బాలకృష్ణ కెరీర్ లోనే ఇది మొదటిసారని చెప్పొచ్చు. ఇంకో రెండు మూడు గంటల్లో షోలు ప్రారంభమవుతాయని అభిమానులు ఎదురు…

5 hours ago

అన్నగారు వచ్చేలా లేరు

నిర్మాతలకు వచ్చే ఆర్థిక చిక్కులు పెద్ద రిలీజులను ఎంత ఇబ్బంది పెడతాయో అఖండ 2 విషయంలో చూస్తున్నాం. అయితే ఇలాంటి…

5 hours ago

‘హైదరాబాద్ హౌస్’లో పుతిన్ బస.. ఈ ప్యాలెస్ ఎవరిదో తెలుసా?

రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ భారత పర్యటనలో భాగంగా ఢిల్లీలోని 'హైదరాబాద్ హౌస్'లో బస చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.…

10 hours ago

బోకేలు, శాలువాలు లేవు… పవన్ రియాక్షన్ ఏంటి?

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తన పర్యటనల్లో అధికారులు పుష్పగుచ్ఛాలు ఇవ్వడం, శాలువాలు వేయడం లాంటివి వద్దని సున్నితంగా…

13 hours ago