తెలుగు రాజకీయాల్లో అత్యధిక ప్రజాదరణ కలిగిన నాయకులలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేరు ముందు వరుసలో ఉంటుంది. జగన్ వస్తున్నారంటే చాలు, ఆయనను చూడటానికి జనం తారసపడటం సాధారణం. కానీ ఈ మధ్యకాలంలో ఆ దృశ్యం కనిపించడం లేదు.
ఇటీవల బెంగళూరు నుంచి విజయవాడకు వచ్చిన జగన్కు స్వాగతం పలికేందుకు పెద్దగా జనసంద్రం కనిపించలేదు. పార్టీ నేతలు, ముఖ్యంగా దేవినేని అవినాష్ మరియు ఎమ్మెల్సీ తలశిల రఘురాం మాత్రమే కనిపించగా, జగన్ చుట్టూ జనాలు కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. అయినప్పటికీ జగన్ తన చేతులు జోడించి నమస్కారం చేస్తూ నడుస్తూ వెళ్లిపోయారు.
గతంలో జగన్ బెంగళూరు వెళ్తున్నప్పుడు లేదా అక్కడి నుంచి వస్తున్నప్పుడు పెద్ద ఎత్తున అభిమానులు, కార్యకర్తలు తరలివచ్చేవారు. కానీ ఇప్పుడు ఆ ఉత్సాహం కనిపించకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చకు దారితీసింది.
మరింత ఆసక్తికరంగా, వైసీపీ సోషల్ మీడియా ఈ వీడియోలోని అసలు దృశ్యాలను తొలగించి, పాత జనసందోహ దృశ్యాలను జతచేసినట్లు సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇది కూడా ప్రజలు గమనించక మానలేదు.
ఐదేళ్ల పాలనలో ప్రజల నుంచి దూరమవడం, ఇప్పుడు కూటమి ప్రభుత్వ ప్రాభావం వల్ల జగన్ గ్రాప్ క్రమంగా పడిపోతున్నదని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ పరిస్థితిని అర్థం చేసుకున్న జగన్, ప్రజల మద్దతు తిరిగి పొందేందుకు ఎప్పుడు చర్యలు తీసుకుంటారో చూడాలి.
ఢిల్లీలో పర్యటిస్తున్న సీఎం చంద్రబాబుకు కేంద్రంలోని పెద్దలు బిగ్ ఆఫర్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం ఎన్డీయే కూటమిని మరింత బలోపేతం…
తమిళ నటి వరలక్ష్మి శరత్ కుమార్.. ఇటీవల వరుసగా వివాదాల్లో చిక్కుకుంటోంది. వరలక్ష్మి స్వీయ దర్శకత్వంలో రూపొందించిన ‘సరస్వతి’ సినిమాకు…
జనసేన అధినేత పవన్ కల్యాణ్.. తన వ్యూహాన్ని దాదాపు తేల్చేశారు. రాజకీయంగా తనకు ఉన్న లక్ష్యాన్ని కూడా వివరించారు. దేశాన్ని…
ఇప్పుడంతా అప్ డేటెడ్ వెర్షన్లే వినిపిస్తున్నాయి. వ్యవహారికంతో పాటుగా పాలిటిక్స్ లోనూ నయా తరం వచ్చేసింది. ఆ ఫలితమే జన్…
మెగా డీఎస్సీ పరీక్షలు జరిగి దాదాపు ఏడాది అవుతోంది. సెలెక్ట్ అయిన అభ్యర్థులు ఉద్యోగాల్లో చేరి ఆరు నెలలు దాటిపోయింది.…
కొన్ని నెలల క్రితం అన్నపూర్ణ స్టూడియోస్ నుంచి ఒక ప్రకటన వెలువడింది. 2027 సంక్రాంతికి థియేటర్లను బ్లాస్ట్ చేయబోతున్నాం అనే…