Political News

నేను చెబితే కానీ.. క‌ద‌ల‌రా?: బాబు ఆగ్ర‌హం

మంత్రుల వైఖ‌రిపై కొన్నాళ్లుగా అస‌హ‌నంతో ఉన్న ఏపీ సీఎం చంద్ర‌బాబు మ‌రోసారి ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఒకే రోజు రెండు ఘ‌ట‌న‌లు రాష్ట్రంలో తీవ్ర దుమారం రేపాయి. ఈ రెండు అంశాలు ప‌త్రిక‌ల్లో భారీ ఎత్తున క‌వ‌ర్ అయ్యాయి. అయితే.. ఈ విష‌యాల‌పై మంత్రులు స్పందించ‌క‌పోవ‌డాన్ని తాజాగా సీఎం చంద్ర‌బాబు ప్ర‌శ్నించారు. “నేను చెబితే కానీ.. క‌ద‌ల‌రా?” అంటూ.. అస‌హ‌నం, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వెంట‌నే ఆయా అంశాల‌పై త‌న‌కు నివేదిక అందించాల‌ని ఆయ‌న ఆదేశించారు.

ఏంటా ఘ‌ట‌న‌లు..

ఉమ్మ‌డి విజ‌య‌న‌గ‌రం జిల్లాలోని గిరిజ‌న సామాజిక నియోజ‌క‌వ‌ర్గం కురుపాంలో ఉన్న గిరిజ‌న సంక్షేమ వ‌స‌తి గృహంలో బాలిక‌లు.. ప‌చ్చ‌కామెర్ల‌తో అనారోగ్యానికి గుర‌య్యారు. వీరిలో ఇద్ద‌రు మృతి చెందారు. మ‌రో న‌లుగురు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. ఇక‌, ఇదేస‌మ‌యంలో ప‌దుల సంఖ్య‌లో బాలిక‌లు ఆసుప త్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘ‌ట‌న‌ల‌పై క‌లెక్ట‌ర్ స్పందించినా.. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి సంధ్యా రాణి మాత్రం మౌనంగా ఉన్నారు. పైగా ఆమె విజ‌య‌న‌గ‌రం ఉత్స‌వాల్లో పాల్గొన్నారు. దీంతో సీఎం చంద్ర‌బాబు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. వివ‌రాలు తెలుసుకుని త‌న‌కు నివేదిక ఇవ్వాల‌ని .. బాధ్య‌త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని అన్నారు.

ఇక‌, అనంత‌పురం జిల్లాలోని అనాథ శిశువుల సంక్షేమ కేంద్రంలో మ‌హిళా సిబ్బంది మ‌ధ్య త‌లెత్తిన వివాదం ఓ శిశువు మృతికి దారి తీసింది. ద‌స‌రా రోజు డ్యూటీ విష‌యంలో దెబ్బ‌లాడుకున్న ఇద్ద‌రు మ‌హిళా సిబ్బందిలో ఒక‌రు అయిష్టంగానే డ్యూటీకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో ఆమె.. ప‌నులు చేయ‌కుండా సీట్లో కూర్చున్నారు. అయితే.. ఓ శిశువు ఆక‌లికి తాళ‌లేక‌.. తెల్ల‌వారే స‌రికి ప్రాణాలు కోల్పోయాడు. వాస్త‌వానికి శిశువుకు పాలు అందించాల్సిన బాధ్య‌త‌ను స‌ద‌రు ఉద్యోగి విస్మ‌రించింది.

ఇక‌, విష‌యాన్ని బ‌య‌ట‌కు రాకుండా చేసేందుకు ఆసుప‌త్రి ఆవ‌ర‌ణ‌లోనే శిశువు మృత దేహాన్ని పూడ్చి పెట్టారు. ఈ విష‌యం వెలుగులోకి వ‌చ్చినా.. సంబంధిత మంత్రి ప‌ట్టించుకోక‌పోవ‌డంతో సీఎం చంద్ర‌బాబు ఆవేద‌న‌, ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. “ఈ విష‌యం ప‌త్రిక‌ల్లో వ‌చ్చే వ‌ర‌కు.. మీరు ఎందుకు తెలుసుకోలేక పోతున్నారంటూ” ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డంతోపాటు.. నివేదిక ఇవ్వాల‌ని కోరారు.

This post was last modified on October 5, 2025 10:57 pm

Share

Recent Posts

కాంగ్రెస్ లో కొండా కార్చిచ్చు

సీఎం రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ తనయురాలు కొండా సుష్మిత చేసిన కామెంట్లు తెలంగాణ రాజకీయాల్లో వేడి రాజేశాయి.…

2 hours ago

పైరసీ రూపంలో కొత్త తలనెప్పి

ఇప్పటికే పైరసీని ఎలా అణచాలో అర్థం కాక నిర్మాతలు తలలు పట్టుకోవడం చూస్తున్నాం. టెక్నాలజీ ఇంత అభివుద్ది చెందిన తర్వాత…

4 hours ago

పోలీస్ దుస్తుల్లో సూర్య షాకింగ్ ట్విస్టు

కరుప్పు / వీరభద్రుడు, విశ్వనాథ్ అండ్ సన్స్ విజయాలతో సూర్య మంచి ఊపు మీద ఉన్నాడు. గత కొన్నేళ్లుగా సరైన…

5 hours ago

రవితేజ విజయాలకు ‘గట్టిముడి’ పడాలి

ఫ్యాన్ బేసులకు అతీతంగా అందరు హీరోల అభిమానులు అధిక శాతం ఇష్టపడే హీరో రవితేజ. ఆరు పదుల వయసుకు దగ్గరగా…

5 hours ago

పోటీకి సిద్ధంకండి… పొత్తు సంగతి నేను చూసుకుంటాను

స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో జనసేన అధినేత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కార్యకర్తలు, నాయకులకు కీలక…

7 hours ago

తిరుమలలో ‘రోబోట్‌ డాగ్‌’… వాటి కదలికలపై నిఘా!

తిరుమల అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల కదలికలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించడంతోపాటు, భక్తుల భద్రతను మరింత పటిష్టం చేసేందుకు టీటీడీ ఆధునిక సాంకేతిక…

8 hours ago