Political News

బాబుకు భారం: మ‌హిళ‌ల కోసం రోజుకు 8 కోట్లు

ఉచిత ప‌థ‌కాలు ప్ర‌క‌టించ‌డం తేలికే.. కానీ, వాటి అమ‌లుకు వ‌చ్చే స‌రికి మాత్రం త‌ల ప్రాణం తోక‌కు వ‌స్తోంది. తెలంగాణ‌, క‌ర్ణాట‌క‌ల్లో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సును ప్ర‌క‌టించినా.. త‌ర్వాత కాలంలో ప్ర‌భుత్వాలు ఇబ్బందులు ప‌డుతూనే ఉన్నాయి. మొద‌ట్లో బాగానే ఉన్నా.. ఉచితం భారం రాబోయే రోజుల్లో స‌ర్కా రు మెడ‌కు గుదిబండ‌లా మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్ర‌భుత్వానికి కూడా షాకే త‌గిలింది. త‌మ‌కు 360 కోట్ల రూపాయ‌లు బ‌కాయి ఉన్నారంటూ.. ఆర్టీసీ అధికారులు ప్ర‌భుత్వానికి బిల్లులు పెట్టారు.

ఏపీలోనూ ‘స్త్రీ శ‌క్తి’ పేరుతో మ‌హిళ‌ల‌కు ఉచిత బ‌స్సును అందుబాటులోకి తెచ్చారు. ఆగ‌స్టు 15ను పురస్క‌రించుకుని ఈ ప‌థ‌కాన్ని సీఎం చంద్ర‌బాబు, డిప్యూటీ సీఎం ప‌వ‌న్ క‌ల్యాణ్ ప్రారంభించారు. ఇక‌, అప్ప‌టి నుంచి అనేక రూపాల్లో మ‌హిళ‌ల‌కు బ‌స్స‌ల్లో ఉచిత ప్ర‌యాణాన్ని చేరువ చేశారు. తొలుత ప‌ల్లెవెలుగు బ‌స్సుల‌కు మాత్ర‌మే ప‌రిమితం అనుకున్నా.. త‌ర్వాత డీల‌క్స్ బ‌స్సుల‌కు కూడా ఉచిత సేవ‌ల‌ను అందించారు. దీంతో లెక్క‌కు మిక్కిలిగా ఈ బిల్లు భారం చేరుకుంది.

మ‌హిళ‌ల‌కు ఆర్టీసీలో ఉచిత‌ప్ర‌యాణ‌మే అయినా.. ఆ టికెట్ చార్జీల‌ను ప్ర‌భుత్వం చెల్లిస్తుంది. ఇలా.. ఆగ‌స్టు 15 నుంచి సెప్టెంబ‌రు 30వ తేదీ వ‌ర‌కు మొత్తం 45 రోజుల‌కు గాను ప్ర‌భుత్వానికి ఈ టికెట్ల బిల్లు 360 కోట్ల రూపాయ‌ల‌కు పైగానే చేరింది. ఇప్పుడు ఈబిల్లును త‌మ‌కు చెల్లించాల‌ని.. ఆర్టీసీ అధికారులు స‌ర్కారుపై ఒత్తిడి పెంచారు. మ‌రోవైపు.. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా.. స‌ర్కారు త‌క్ష‌ణ‌మే ఆ సొమ్ములు ఇవ్వాల‌ని కోరుతున్నారు. ప్ర‌భుత్వం టికెట్ల సొమ్ము ఇస్తే త‌ప్ప‌.. త‌మ‌కు వేత‌నాలు లేవ‌ని కూడా వారు చెబుతున్నారు.

సో.. ఇప్ప‌టికే అనేక బిల్లులు పెండింగులో ఉన్న స‌ర్కారుకు ఆర్టీసీ బిల్లు భారంగా మారింది. ఇక‌, ఈ లెక్క ప్ర‌కారం.. మ‌హిళ‌ల‌పై బాబు స‌ర్కారు రూ.8 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేస్తోంద‌ని తేలింది. నిజానికి ఒక్క రోజుకు రూ.4-5 కోట్ల వ‌ర‌కు భారం ప‌డుతుంద‌ని ముందుగానే అంచ‌నా వేసుకున్నా..ఈ ప‌రిమితి ఎప్పుడో దాటి పోయిందని అధికారులు చెబుతుండ‌డం గ‌మ‌నార్హం. సో.. ఎలా చూసుకున్నాబాబుకు ఆర్టీసీ భారం రోజుకు రూ.8 కోట్ల మేర‌కు ప‌డుతోంది.

This post was last modified on October 5, 2025 10:39 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

లెజెండరీ ప్లేయర్లను దాటేసిన హిట్ మ్యాన్

వడోదరలోని బీసీఏ స్టేడియంలో భారత్, న్యూజిలాండ్ మధ్య తొలి వన్డే పోరుకు సర్వం సిద్ధమైంది. గ్రౌండ్ లో టీమ్ ఇండియా…

39 minutes ago

తొమ్మిదేళ్ల విక్రమ్ సినిమాకు మోక్షం ?

క్రేజీ కాంబినేషన్ లో రూపొందిన ఒక సినిమా తొమ్మిదేళ్ళు ల్యాబ్ లోనే మగ్గిపోవడం చాలా అరుదు. ఏదో ఒకరకంగా బయటికి…

1 hour ago

‘అప్పుడు మహ్మద్ గజిని… ఇప్పుడు వైఎస్ జగన్’

అప్పుడు మహ్మద్‌ గజని… ఇప్పుడు వైఎస్‌ జగన్‌ అంటూ టీడీపీ నేతలు మండిపడుతున్నారు. దేవాలయాలు, హిందూ సంప్రదాయాలపై వైసీపీ దాడులు…

1 hour ago

రాజాసాబ్.. దేవర రూట్లో వెళ్లినా..

సంక్రాంతి సీజన్ లో భారీ అంచనాల మధ్య వచ్చిన ది రాజా సాబ్ ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద ఒక రకమైన…

2 hours ago

ప్రసాదు ప్రీమియర్ల మీదే అందరి కన్ను

సంక్రాంతి రేసులో రెండో పుంజు దిగుతోంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ది రాజా సాబ్ ఫలితం మీద దాదాపు…

3 hours ago

జేడీ లక్ష్మీనారాయణ సతీమణి సైబర్ వలలో పడడమా…

వాళ్లు వీళ్లు అన్న తేడా లేకుండా మోసమే శ్వాసగా మారి.. తమ మాటల్ని నమ్మినోళ్లను మోసం చేసే సైబర్ బందిపోట్లు..…

3 hours ago