ఉచిత పథకాలు ప్రకటించడం తేలికే.. కానీ, వాటి అమలుకు వచ్చే సరికి మాత్రం తల ప్రాణం తోకకు వస్తోంది. తెలంగాణ, కర్ణాటకల్లో మహిళలకు ఉచిత బస్సును ప్రకటించినా.. తర్వాత కాలంలో ప్రభుత్వాలు ఇబ్బందులు పడుతూనే ఉన్నాయి. మొదట్లో బాగానే ఉన్నా.. ఉచితం భారం రాబోయే రోజుల్లో సర్కా రు మెడకు గుదిబండలా మారుతున్నాయి. తాజాగా ఏపీ ప్రభుత్వానికి కూడా షాకే తగిలింది. తమకు 360 కోట్ల రూపాయలు బకాయి ఉన్నారంటూ.. ఆర్టీసీ అధికారులు ప్రభుత్వానికి బిల్లులు పెట్టారు.
ఏపీలోనూ ‘స్త్రీ శక్తి’ పేరుతో మహిళలకు ఉచిత బస్సును అందుబాటులోకి తెచ్చారు. ఆగస్టు 15ను పురస్కరించుకుని ఈ పథకాన్ని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రారంభించారు. ఇక, అప్పటి నుంచి అనేక రూపాల్లో మహిళలకు బస్సల్లో ఉచిత ప్రయాణాన్ని చేరువ చేశారు. తొలుత పల్లెవెలుగు బస్సులకు మాత్రమే పరిమితం అనుకున్నా.. తర్వాత డీలక్స్ బస్సులకు కూడా ఉచిత సేవలను అందించారు. దీంతో లెక్కకు మిక్కిలిగా ఈ బిల్లు భారం చేరుకుంది.
మహిళలకు ఆర్టీసీలో ఉచితప్రయాణమే అయినా.. ఆ టికెట్ చార్జీలను ప్రభుత్వం చెల్లిస్తుంది. ఇలా.. ఆగస్టు 15 నుంచి సెప్టెంబరు 30వ తేదీ వరకు మొత్తం 45 రోజులకు గాను ప్రభుత్వానికి ఈ టికెట్ల బిల్లు 360 కోట్ల రూపాయలకు పైగానే చేరింది. ఇప్పుడు ఈబిల్లును తమకు చెల్లించాలని.. ఆర్టీసీ అధికారులు సర్కారుపై ఒత్తిడి పెంచారు. మరోవైపు.. ఆర్టీసీ కార్మిక సంఘాలు కూడా.. సర్కారు తక్షణమే ఆ సొమ్ములు ఇవ్వాలని కోరుతున్నారు. ప్రభుత్వం టికెట్ల సొమ్ము ఇస్తే తప్ప.. తమకు వేతనాలు లేవని కూడా వారు చెబుతున్నారు.
సో.. ఇప్పటికే అనేక బిల్లులు పెండింగులో ఉన్న సర్కారుకు ఆర్టీసీ బిల్లు భారంగా మారింది. ఇక, ఈ లెక్క ప్రకారం.. మహిళలపై బాబు సర్కారు రూ.8 కోట్ల వరకు ఖర్చు చేస్తోందని తేలింది. నిజానికి ఒక్క రోజుకు రూ.4-5 కోట్ల వరకు భారం పడుతుందని ముందుగానే అంచనా వేసుకున్నా..ఈ పరిమితి ఎప్పుడో దాటి పోయిందని అధికారులు చెబుతుండడం గమనార్హం. సో.. ఎలా చూసుకున్నాబాబుకు ఆర్టీసీ భారం రోజుకు రూ.8 కోట్ల మేరకు పడుతోంది.
This post was last modified on October 5, 2025 10:39 pm
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…
మలయాళం మెగాస్టార్ గా అభిమానులు పిలుచుకునే మమ్ముట్టి కొత్త సినిమా కలం కవల్ ఇవాళ ప్రేక్షకుల ముందుకొచ్చింది. అఖండ 2…
టీమిండియా స్టార్ క్రికెటర్ స్మృతి మంధాన పెళ్లి ఆగిపోవడం అభిమానులను నిరాశపరిచింది. తండ్రి ఆరోగ్యం బాగోలేకపోవడంతో నవంబర్ 23న జరగాల్సిన…